వాస్తవ ఘటనల ఆధారంగా... | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనల ఆధారంగా...

Published Thu, Oct 26 2023 3:53 AM

Ravi Teja Next Gopichand Malineni Next - Sakshi

‘డాన్‌ శీను, బలుపు, క్రాక్‌’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

వాస్తవ ఘటనల ఆధారంగా ఓ పవర్‌ఫుల్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కాగా ఈ సినిమాలోని కీలక పాత్రల్లో దర్శక–నటుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్‌ నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు.
 

Advertisement
Advertisement