-
‘వట్టికోట’ తెలంగాణకే గర్వకారణం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక, సాహిత్య వికాసానికి వట్టికోట ఆళ్వారుస్వామి చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆళ్వారుస్వామి శతజయంతిని పురస్కరించుకొని సీఎం ఆయనకు ఘననివాళి అర్పించారు. సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారుడిగా, సాహితీవేత్తగా, గ్రంథాలయ ఉద్యమసారథిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన తెలంగాణ జాతి గర్వించదగ్గ యోధుడని కొనియాడారు. సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెడతామని, అదే ప్రాంగణంలో వట్టికోట విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే వట్టికోట స్వస్థలం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చెరువు మాదారంలో కూడా విగ్రహం పెట్టనున్నట్లు చెప్పారు. వట్టికోట సాహిత్యాన్నంతా ఓ సంకలనంగా మార్చి, తెలుగు అకాడమీ ద్వారా ప్రచురిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
ప్రజారాజ్యాన్ని కలగనే ప్రజల మనిషి
ఊళ్లో మతాంతీకరణలు జరుగుతున్నాయి. ‘ఆలా హజ్రత్’- అంటే నిజామ్ ప్రభువు కాలంలో మాల మాదిగల ఉద్ధరణ! ఏం లేదు... వాళ్ల బొట్టు చెరిపి, మొలతాళ్లు తెంపి, కొత్త చీర, కొత్త ధోవతి ఇచ్చి పేర్లు మారుస్తారు. గులామ్ రసూల్, గులామ్ నబీ, హాజిరా, కుల్సుంబీ.... ఊళ్లో అంతా అబ్బడ దిబ్బడగా ఉంది. కిరస్తానీలు కూడా ఈ పని చేస్తున్నారుగానీ వాళ్లకు రాజ్యబలం లేదు. రాజ్యబలం ఉన్నవారి మాటను కాదనడానికి లేదు. ఊళ్లో అందరికీ బాధగా ఉంది. ఒక అంగం ఏదో కోల్పోతున్న బాధ. మాల మాదిగలందరూ తమతోనే ఉండాలి. ఊరికి దూరంగా ఉండాలి. అంటరానివాళ్లుగా ఉండాలి. తమ పనులేవో చేస్తుండాలి. వాళ్లు మతం మారి అందరితో సమానం అయితే అదో నొప్పి. మరి దీనిని ఎదిరించేవారే లేరా? ఉన్నాడు. కంఠీరవం! ‘ఇది అన్యాయం’ అని అడ్డుపడ్డాడతడు. నీలకంఠం మాటకు ఊళ్లో విలువ ఉంది. కొద్దోగొప్పో చదువుకున్నవాడు. లోకజ్ఞానం తెలిసినవాడు. పైగా అందరూ గౌరవించే వైష్ణవ మతస్తుడు. ‘అంటరానివాళ్లను ఉద్ధరిస్తానంటే నీకెందుకు బాధ’ అన్నాడు అంజుమన్ నాయకుడు. ‘ఇదిగో. ఈ ఊళ్లో దొర ఉన్నాడు. ఆ దొరకు పెద్ద గుమాస్తాగా, ప్రభుత్వ ప్రతినిధిగా హైదరలీ అనే పెద్దమనిషి ఉన్నాడు. మీ మతంలో అందరూ సమానమైతే అతడు కూడా దొరతో కలిసి మాల మాదిగలను ఎందుకు హింసించాడు?’ అన్నాడు. సూటి ప్రశ్న. జవాబు లేదు. ఇక్కడ మతం ఏమిటన్నది ముఖ్యం కాదు. అధికార ప్రాబల్యం ఎవరికుంది అన్నది ముఖ్యం. దొరలూ, దొరలతో పాటు మిలాఖాత్ అయిన నిజాం బంట్లు అందరూ కలిసి పీడించేది బీదా బిక్కి జనాలనే... కాపులనూ.... అంటరానివాళ్లనే. ‘మరి పరిస్థితిలో ఏ మార్పూ లేనప్పుడు వారు మతం మారి మాత్రం ఏమిటి ప్రయోజనం’ అన్నాడు కంఠీరం. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారిని సాధారణంగా బయట తిరగనీయరు. జైల్లో పెడతారు. కంఠీరవంను కూడా నిజామాబాద్ జైల్లో వేశారు. కాని కంఠీరవం రగిల్చిన స్ఫూర్తి- ఆ ఊరు- దిమ్మెగూడెంలో రగులుతూనే ఉంది. జైల్లో అసలైన లోకాన్ని చూశాడు కంఠీరవం. నోరు లేని వాళ్లందరూ అక్కడ ఖైదీలు. దొరలను ఎదిరించి, దొరల బంట్లను ఎదిరించి దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్నారు. అన్యాయం అని అరిచిన ప్రతి ఒక్కడికీ అదే గతి. మరో వైపు బషీర్లాంటి అనాధలను దొంగలుగా చేసి వారిని దొంగ బతుకు బతికేలా చేసి దారుణంగా హింసించే పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థలో ఉన్నది ముస్లింలే. బషీర్ కూడా ముస్లిమే. ఏమిటి ప్రయోజనం? వ్యవస్థలో అనుభవించేవాడికి మతం లేదు. అవమానాలు పొందేవాడికీ మతం లేదు. కంఠీరవం ఇంకోటి కూడా గ్రహించాడు. ఆచారాలు, విశ్వాసాలు అంటూ కులాలు, గోత్రాలు అంటూ ఆర్య సంస్కృతి వృద్ధి చేసిన విష పరంపర. ఇంత చదువు చదివీ ఇంత లోకం చూసిన తనే సాటి మనిషితో కలిసి భోం చేయ నిరాకరిస్తున్నప్పుడు సంప్రదాయవాదులు చేసే దౌర్జన్యాలు, చూపే నీచత్వం ఎంత తీవ్రంగా ఉంటాయి? ‘ఆర్య సంస్కృతి మంచిదే. కాని దానికి ఇంకా పూర్ణత్వం రాలేదు’ అని అనుకున్నాడు కంఠీరం. పరివర్తన అనేది తన నుంచే మొదలవ్వాలి. తన సంస్కృతిని చక్క దిద్దుకోవాలంటే తనలోని ప్రతివారూ తనతో సమానం అనుకోవాలి. అలానే అనుకోవడం మొదలుపెట్టాడు కంఠీరం. బషీర్ తన స్నేహితుడు. కాపుల కుర్రవాడు కొమరయ్య తల్లే తన తల్లి. ఊరంటే పరస్పరం ప్రేమగా ఉండే ఒక సమూహం. ఈ ఎరుకతో శిక్షాకాలం తర్వాత ఊరు చేరుకున్నాడు కంఠీరవం. అప్పటికే అక్కడ భూమిక సిద్ధం అయి ఉంది. మతాంతీకరణలకు వ్యతిరేకంగా పని చేయడానికి వచ్చిన ఆర్యసమాజ్ కార్యకర్త విజయ్దేవ్- అసలు మతాంతీకరణలకు కారణం మతం కాదనీ వ్యవస్థలోని పీడన అని గ్రహించాడు. ఊరి దొర- రామ భూపాల్రావు బర్రె ఉన్నవాడి దగ్గర బర్రె లాక్కుంటూ, ఎడ్లు ఉన్నవాడి దగ్గర ఎడ్లు లాక్కుంటూ, భూమి ఉన్నవాడి దగ్గర భూమి లాక్కుంటూ, ఏమీ లేనివాడి దగ్గర మిరపకాయలో మంచి నెయ్యో లాక్కుంటూ ఉంటే జనం ఏం చేస్తారు? గాలికి పోయే గడ్డిపోచనైనా గట్టిగా పట్టుకుందామనుకుంటారు. ముందు ఈ దొరను కూల్చాలి అని గ్రహించాడు విజయ్దేవ్. కంఠీరవం వచ్చి అసలు ఈ నిజాము సర్కారునే కూల్చాలి అన్నాడు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం వస్తే మన బాధలన్నీ తొలగి పోతాయి అని పిలుపు ఇచ్చాడు. కాంగ్రేసు ఉద్యమంలోకి సమరోత్సాహంతో దూకితే విజయం ఖాయం అనే నిశ్చయానికి వచ్చాడు. అతడి కల అదే. నిజంగా ప్రజాప్రభుత్వం రావాలి. ప్రతి పాలకుడు ప్రజల మనిషి కావాలి. అప్పుడే ఈ సమాజంలో ఆకలి కోసం అరిచేవాళ్లు ఉండరు. అవమానాలతో బాధపడేవారు ఉండరు. అన్యాయంగా ఇతరుల ఆస్తులను ఆక్రమించేవాళ్లు ఉండరు. ద్వేషంతో రగిలేవాళ్లు ఉండరు. అంతా ఒక అద్భుతమైన సమాజం. అదే ప్రజారాజ్యానికి అసలైన నిర్వచనం. మొదట అందరూ కలిసి దొరను జైలుకు పంపారు. ఇక నిజాం ప్రభుత్వాన్ని కూల్చే పనే మిగిలింది. కంఠీరవం బృందం ఉద్యమంలోకి బయలు దేరింది. నవల ముగిసింది. మహా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి తెలుగు సాహిత్యానికి ఇచ్చిన గొప్ప కానుక, ఈ నవల, ‘ప్రజల మనిషి’. తెలంగాణలో కవులేం ఉన్నారు, రచయితలేం ఉన్నారు అంటే ఉన్న వాళ్లందరూ ఉన్నారు. చేయవలసిన పనంతా చేశారు. నిజాం కాలపు సమాజాన్ని అంటే 1935 నాటి సమాజాన్ని నవలలో చూపాలని అనుకోవడం మామూలు విషయం కాదు. అంతవరకూ అలాంటి ప్రయత్నం జరిగి దారీ దోవా లేకపోయినా ఒక గొప్ప పరిణితరూపంలో రాయడం మామూలు విషయం ఎంత మాత్రం కాదు. ఈ పనంతా చాలా నిరాడంబరంగా చేసిన గొప్ప తేజస్వి వట్టికోట ఆళ్వారుస్వామి. కొద్దోగొప్పో చదువుకున్న పామరులు కూడా సులభంగా అర్థం చేసుకునే శైలిలో, శిల్పంలో, కళ్లకు కట్టినట్టుండే పాత్రలతో, సంభాషణలతో ఆయన ఈ నవలను నడిపిస్తాడు. ఇది ఒక రకంగా ఆయన పర్సనల్ జర్నీ కూడా. అందులోని కంఠీరవం పాత్ర దాదాపుగా ఆయన అంతరాత్మ. ఆ పాత్ర పడే పరివర్తన అంతా ఆయన పడిందే. ఆ పాత్ర కార్చే ప్రతి కన్నీటి చుక్కా వట్టికోట నిష్కల్మష హృదయం కార్చిన దయామయ అశ్రువే. చాలా చిన్న వయసులో (జ.1915 - మ.1961) మరణించిన వట్టికోట మరికొంత కాలం జీవించి ఉంటే మరెన్నో గొప్ప రచనలు చూసి ఉండేవాళ్లం. విషాదం ఏమిటంటే ఆయన ఇంత గొప్ప రచనలు చేసినా కొంతమంది దశాబ్దాల తరబడి చీకటిలో పెట్టడం. ఆయన పేరే ప్రస్తావించకపోవడం. కడుపు మండమంటే మండదా? చూపుడు వేలు ఆడించమంటే ఆడించరా? ప్రజల మనిషి; రచయిత: వట్టికోట ఆళ్వారుస్వామి; రచనాకాలం: 1955; తెలంగాణ తొలి నవలగా వాసికెక్కింది. నిజాం కాలపు తెలంగాణ జీవితాన్ని సమర్థంగా చూపిన నవలగా ఖ్యాతి పొందింది. ఈ నవల ఒక దారి చూపించడం వల్లే దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్లు’ వంటి అద్భుత నవలను రాయగలిగారు. మార్కెట్లో లభ్యం. వెల: రూ. 70
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement