-
ట్రెండింగ్ బీజేపీ నేత బయోపిక్లో స్టార్ హీరో
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బయోపిక్ ఉందా..? అందులో నటుడు విశాల్ అన్నామలై పాత్రలో నటించనున్నారా..? వంటి ప్రశ్నలు రాష్ట్రా వ్యాప్తంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి అవకాశం ఉందనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. తమిళనాడులో బీజేపీ అధ్యక్ష పగ్గాలను అన్నామలై చేపట్టిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీకి ఒక గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. అన్నామలై రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారన్నది గమనార్హం. ఆయన రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తికి మించి శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి అన్నామలై జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో అన్నమలై పాత్రలో విశాల్ నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. విశాల్ తాజాగా నటించిన రత్నం చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. తాజాగా ఆయన తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డిటెక్టివ్ 2 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల ఒక భేటీలో ఆయన 2026 ఎన్నికల పట్టికలో తన పేరు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వాగ్దాటి, ఆయన పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ నటుడు విశాల్ పేర్కొనడం గమనార్హం. కాగా అన్నామలై ఎలా పోలీస్ అధికారి అయ్యారు? ఆ తర్వాత ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించారు? వంటి ఆయన జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. -
ఎన్నికల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. డిఫరెంట్ స్టైల్ ప్రచారం!
చెన్నై: దేశంలో ఎన్నికల సందడి నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఎన్నికల సిత్రాల్లో భాగంగా నేతలు కూరగాయలు అమ్ముతూ, వంట చేస్తూ వివిధ పనుల్లో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాగా, ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి లోక్సభ స్థానం నుంచి ఇండిపెండింట్ అభ్యర్థిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్. దామోదరన్ డిఫరెంట్ బరిలో నిలిచారు. ఎన్నికల సందర్భంగా దామోదరన్ డిఫరెంట్ స్టైల్లో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియా సహా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఇంటిపెండెంట్ అభ్యర్థి కాగా.. ఈసీ ఆయనకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. #WATCH | Tiruchirappalli, Tamil Nadu: Independent candidate from Trichy Lok Sabha seat Padma Shri S Damodaran indulges in making flower garland and sells vegetables as the part of Election Campaign pic.twitter.com/9iARbrat1O — ANI (@ANI) April 11, 2024 ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దామోదరన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ వద్ద ఉధృత ప్రచారం నిర్వహిస్తున్న దామోదరన్.. తనకు ఓటు వేయాలంటూ అక్కడి వీధి వ్యాపారులు, సామాన్యులను కోరారు. వ్యాపారులతో కలిసి కూరగాయలు, పూలు అమ్ముతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తిరుచిరాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను. గత నలభై ఏళ్లుగా నేను పారిశుధ్య వాలంటీర్గా పనిచేస్తున్నాను. 21 ఏళ్ల వయసప్పుడు నా కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. 60 ఏళ్ల వయసులో నాకు పద్మశ్రీ లభించింది చెప్పుకొచ్చారు. తనను గలిపిస్తే పచ్చదనంతో పాటుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
9న చైన్నెలో పీఎం రోడ్షో
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ ఆరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈనెల 9వ తేదీన చైన్నెలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లపై బీజేపీ వర్గాలతో పాటు పీఎం భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఐదుసార్లు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. ఆరోసారి పర్యటనకు ఆయన రెడీ అయ్యారు. ఈసారి చైన్నెలో రోడ్ షో నిర్వహణకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. ఉత్తర చైన్నె, సెంట్రల్చైన్నె, దక్షిణ చైన్నెలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ రోడ్ షో జరగనుంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా పరమైన చర్యలపై బీజేపీ వర్గాలతోపాటుగా పీఎం భద్రతా బృందాలు దృష్టి పెట్టాయి. మాంబళం నుంచి పాండి బజార్ మీదుగా ఓ రూట్ మ్యాప్, కోడంబాక్కం – నుంగంబాక్కంమార్గంలో మరో రూట్ మ్యాప్, ఉత్తర చైన్నెలోని తిరువొత్తియూరు వడి ఉడయమ్మన్ ఆలయంలో దర్శనం, అక్కడ కొంత దూరం రోడ్ షోకు కార్యాచరణ సిద్ధం చేశారు. కాగా ఈరోడ్ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే వేలూరు, పెరంబలూరులో పోటీ చేస్తున్న మిత్ర పక్షాల అభ్యర్థులకు మద్దతుగా తిరుచ్చిలో జరిగే సభలో పీఎం ప్రసంగించబోతున్నారు. అనంతరం కేరళకు బయలుదేరనున్నారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనలలోజాప్యం తప్పడం లేదు. ప్రస్తుతం వెలువడ్డ సమాచారం మేరకు ఈనెల 11 నుంచి 13 తేదీలో వారి పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశిలలో రాహుల్ పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. -
‘ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది. కారణం ఇదే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది. ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి
తిరుచిరాపల్లి/లక్షద్వీప్: రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనేది కేంద్ర ప్రభుత్వం విశ్వసించే విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్దిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆయన మంగళవారం తమిళనాడులో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పౌర విమానయానం, ఓడ రేవులు, రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహాయ వాయువు, అణు శక్తి, ఉన్నత విద్యకు సంబంధించిన రూ.20,140 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొలుత భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఏడాది కాలంలో 40 మందికిపైగా కేంద్ర మంత్రులు తమిళనాడులో 400సార్లు పర్యటించారని చెప్పారు. తమిళనాడు అభివృద్ధితో ఇండియా అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ విదేశాలతో బహుళ అనుసంధానం అభివృద్ధికి కీలక మార్గమని అన్నారు. దీనివల్ల కీలక రంగాల్లో పెట్టుబడులు, తద్వారా వ్యాపారం, వాణిజ్యం పెరుగుతాయని, ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి యువతకు ఇది మంచి సమయమని చెప్పారు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు. లక్షద్వీప్లో మోదీ.. రూ1.1,50 కోట్లకుపైగా విలువైన పలు జాతీయ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ మంగళవారం లక్షద్వీప్కు చేరుకున్నారు. అగత్తీ ఎయిర్పోర్టు వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. లక్షద్వీప్లో గత పదేళ్లలో ఎన్నో ప్రాజెక్టులను అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి ద్వీపాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. -
సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను
తమిళసినిమా: సాధారణంగా వర్ధమాన నటీమణు గ్లామరస్ పాత్రలను కోరుకుంటారు. అలాంటి పాత్రలతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడవచ్చునని, ప్రేక్షకుల ఆదరణను పొందవచ్చు అనేది వారి అలోచనగా ఉంలుటుంది. అలాంటిది నటి అనుకీర్తీవాస్ మాత్రం ఛాలెంజింగ్ పాత్రలను కోరుకుంటున్నారు. ఈమె గురించి చెప్పాలంటే కళాశాల రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్నీ గెలుచుకున్నారు. తర్వాత సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు. ఇంకేముందు విజయ్సేతుపతి కథానాయకుడిగా నటించిన డీఎస్పీ చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేశారు. అలా తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ బ్యూటీకి ఆ వెనువెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వరించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీని గురించి నటి అనుకీర్తీవాస్ మాట్లాడుతూ తన తొలి చిత్రం డీఎస్పీలో కంటే మంచి పాత్రను తెలుగు చిత్రం టైగర్ నాగేశ్వరరావులో నటించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఇంకా ఛాలెంజింగ్తో కూడిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు ఈ బ్యూటీ పేర్కొన్నారు. ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలను అందుకుంటున్న ఈ భామ అందంతో పాటు అభినయంతోనూ సత్తా చాటుకోవడం విశేషం. -
బలపడుతున్న ఈశాన్యం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు చైన్నె వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 29వ తేదీ నుంచి డెల్టా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు.. ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం రాష్ట్రంలో మరీ తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సాధారణ వర్ష పాతం కన్నా 39 శాతం వర్షం తక్కువగా పడ్డట్లు వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. చైన్నెలో 18 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఐదు సెంటీ మీటర్లు వర్షం మాత్రమే పడిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నైరుతి కారణంగా అత్యధిక వర్షం కన్యాకుమారిలో పడింది. ఇక్కడ సగటున 19 సెంటీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా.. ఏకంగా 49 సెంటీ మీటర్ల వర్షం పడడం విశేషం. ఒక్క కన్యాకుమారి మినహా తక్కిన అన్ని జిల్లాలో సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదవడం గమనార్హం. బలపడుతున్న ఈశాన్యం అదే సమయంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసి ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ పవనాలు క్రమంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో నెలకొన్న తుపాన్లు తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ఈ పవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రధానంగా డెల్టాలోని తిరువారూర్, నాగపట్నం, కడలూరు, తంజావూరు, తిరుచ్చి, అరియలూరు, పుదుకోట్టై, పెరంబలూరు జిల్లాలతోపాటు శివగంగై, విల్లుపురం, కళ్లకురిచ్చి తదితర 16 జిల్లాల్లో ఈనెల 29వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో ఆ జిల్లాల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. క్రమంగా విస్తరిస్తున్న ఈశాన్య రుతుపవనాలు నైరుతిలో సాధారణ వర్షపాతం కంటే 39 శాతం తక్కువగా వానలు -
వర్షాల సీజన్ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో
సాక్షి, చైన్నె : వర్షాల సీజన్ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. చైన్నె బీసెంట్ నగర్లో వాకింగ్ కోసం కేటాయించిన మార్గాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఎం. సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ, వర్షాల సీజన్ నేపథ్యంలో వచ్చే జ్వరాలను కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రానున్న 10 వారాల పాటు వారాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల పరీక్షలూ ఈ శిబిరాల్లో నిర్వహించి రోగులకు మందులను పంపిణీ చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా చైన్నెతో పాటు 38 జిల్లాల్లో వాకింగ్ కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు పనులను వేగవంతం చేస్తున్నామని, చైన్నెలో బీసెంట్ నగర్ బీచ్ మార్గాన్ని తాజాగా పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి గగన్ దీప్సింగ్ బేడీ, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో
గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ గుండెపోటుతో మరణించారు. (ఇదీ చదవండి: విజయ్కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్) కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని పరిశోధనలు దీనికి మద్దతు ఇస్తుండగా, కొన్ని కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని నిపుణులు చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఫిట్నెస్కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్కు దూరంగా ఉండే వారు ఇలా చనిపోవడం సర్వసాధారణమైపోతోంది. యోగేష్ చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను బాడీ బిల్డర్, కొన్ని సంవత్సరాలుగా వివిధ ఛాంపియన్షిప్లలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. అతను 2021లోనే 9కి పైగా మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. బాడీబిల్డింగ్లో 'మిస్టర్ తమిళనాడు' అవార్డును అందుకున్నాడు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్.. ఓ జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్.. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన యువకులు వెంటనే యోగేశ్ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో యోగేశ్ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. -
తోడొకరుండిన అదే భాగ్యము!
తోడుండటమే పండు జీవితం. ఏడడుగులతో పడే బంధం. ఏడు జన్మలు కొనసాగాలనుకునే బంధం వైవాహిక బంధం. భార్యకు భర్త.. భర్తకు భార్య.. సంసారాన్ని ఈదాక ఏడు పదుల వయసు దాటాక ఒకరికి ఒకరై మరీ మెలగాలి. తమిళనాడులోని ఒక వృద్ధ జంట మధ్యాహ్న భోజనం తయారు చేసుకునే వీడియో పది లక్షల వ్యూస్ పొందింది. రోజులు కొందరికి కలిసి వస్తాయి. పెళ్లయిన నాటి నుంచే భార్య మనసు భర్తకు అర్థమయ్యి, భర్త స్వభావాలు భార్య అకళింపు చేసుకుని కాపురాన్ని కాపాడుకుంటూ వస్తారు. పిల్లల్ని కని, పెద్ద చేసి ఒక దారికి చేరుస్తారు. ఆ తర్వాత? తామిద్దరూ జీవించాలి. ఏం భయం? ఇప్పటికే ఎంతో జీవితం గడిపారు. కష్టసుఖాలు పంచుకున్నారు. అనుబంధాన్ని దృఢం చేసుకున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా హాయిగా జీవిస్తారు. అతను కూరగాయలు తెస్తాడు. ఆమె వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వెళ్లి వస్తారు. గుళ్లకు తిరుగుతారు. ఓపికుంటే పర్యటనలు చేస్తారు. నేనున్నానని.. నీకై నిలిచే.. తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అని రాశాడు శ్రీశ్రీ. తమిళనాడులో ఒక జంట అలాంటిదే. మధ్యతరగతికి చెందిన ఈ జంట ముదిమి వయసులో కలిసి మధ్యాహ్న వంట చేసుకుంటున్న వీడియోను అభిషేక్ చందరమరక్షణ్ అనే ఇన్స్టా యూజర్ పోస్ట్ చేశాడు. తన భార్యతో కలిసి వీడియోలు చేసే అభిషేక్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘భవిష్యత్తులో నువ్వూ నేనూ’ అనే క్యాప్షన్ పెట్టాడు. నిజమే.. ఈ వీడియో చూసిన యువ జంటలు ఆ వయసులో తాము అలా ఉంటే ఎంత బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. జీవితం పండాలి... అని పెద్దలు అంటారు. పండు వయసులో భార్యకు భర్త; భర్తకు భార్య. (చదవండి: అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!) -
డ్రైవర్కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
ఇటీవల తమిళనాడులో సాధారణ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 9000కోట్లు జమయ్యాయన్న వార్త సోషల్ మీడియా ద్వారా తెగ చక్కర్లు కొట్టింది. ఆ వ్యక్తి ఇంత డబ్బు వచ్చిందని సంతోషపడేలోపు అతని ఆశలన్నీ ఆవిరైపోయాయి. కాగా దీనికి కారణమైన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ తన పదవికి రాజీనామా చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'ఎస్ కృష్ణన్' గురువారం తన రాజీనామాను సమర్పించారు. చెన్నై క్యాబ్ డ్రైవర్కు రూ.9,000 కోట్లు తప్పుగా జమ చేసిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన రాజీనామాకు ఇది కాదని, కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే అని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో గతేడాది సెప్టెంబర్లో టీఎంబీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ 2023 సెప్టెంబరు 28న జరిగిన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రాజీనామాను ఆమోదించి, వారి మార్గదర్శకత్వం లేదా సలహా కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ఫార్వార్డ్ చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. డ్రైవర్కు రూ.9,000 కోట్లు ఖాతాలో యాడ్ అవ్వగానే ఇదేదో స్కామ్ అనుకున్నాడు, కానీ అనుమానంతో తమ ఫ్రెండుకు రూ. 21,000 ట్రాన్స్ఫర్ చేసాడు. ఈ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవ్వడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఇది జరిగిన కేవలం కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ మొత్తాన్ని బ్యాంక్ డెబిట్ చేసింది. -
89 ఏళ్ల పంచాయతీ ప్రెసిడెంట్!ఆమె ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే!
కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్! అనిపించుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి ప్రెసిడెంట్గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటోంది. మిల్లెట్స్ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్నెస్ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ అడ్మిన్స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆన్లైన్ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్లో కూడా లీడర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Veerammal Amma, popularly known as "Arittapatti Paati' the 89 years old Panchayat President of Arittapatti Panchayat is truly an inspiring woman. Fit as a fiddle she is the oldest Panchayat President in TN. Her infectious smile & unbridled enthusiasm is so heatwarming. When I… pic.twitter.com/ol7M2tpqIr — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2023 (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కేబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు వ్యవహారంలో బీజేపీ పార్టీపై చేసిన విమర్శలకు రాష్ట్ర బీజేపీ నాయకుడు అన్నామలై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ సందర్బంగా స్టాలిన్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ప్లాట్ఫారం స్పీకర్ లా మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు తర్వాత తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశం ద్వారా తమ పార్టీకి మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. మాస్ వార్నింగ్.. మనీ లాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీ పార్టీని విమర్శిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ తరహా ఈడీ వేధింపులకు గురిచేసినంత మాత్రాన మేము భయపడేది లేదు. మాక్కూడా రాజకీయాలు చేయడం తెలుసు. ఇది బెదింపు కాదు.. హెచ్చరిస్తున్నా.. " అంటూ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ మాటలేంటి? అన్నామలై మాట్లాడుతూ.. గౌరవనీయులైన స్టాలిన్ గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలా మాట్లాడటం తగదు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా ఒక ప్లాట్ ఫారం స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. అదికూడా ఇప్పటివరకు ఐదు పార్టీలు మారి అనేక అక్రమాలకు పాల్పడిన అవినీతిపరుడిని కాపాడటానికి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఒకప్పుడు స్వయంగా మీరే ఈ బాలాజీ అవినీతిపరుడని ఆరోపణలు చేసి సీబీఐ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరే ఆయన్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. మీరు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు మాత్రమే కాదు, 8.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అనవసర భయాందోళనలను పక్కనపెట్టి కాస్త విచక్షణతో మాట్లాడమని ఈ సందర్భంగా హితవు పలికారు. ఇది కూడా చదవండి: గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
వారి లిస్ట్ తీయండి.. ఫ్యాన్స్కు విజయ్ అదేశం
కోలీవుడ్ హీరో విజయ్ అందరికీ సుపరిచితుడే.తమిళ సూపర్ స్టార్గా తిరుగులేని ఫ్యాన్ బేస్తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విజయ్ ముందుంటారు. గతంలో తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి సాయం చేసేందుకు విజయ్ ముందుకొచ్చాడు. (ఇదీ చదవండి: వరుణ్, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!) “విజయ్ మక్కల్ ఇ యక్కం” తరపున తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలోని ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈనెల 17వ తేదీన ఆయన సన్మానించనున్నాడు. వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయనున్నాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయంతో విద్యార్థుల సమాచారం సేకరించాలని తన ఫ్యాన్స్కు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
గల్లీలో ఐరావతం హల్ చల్
-
క్షీణించిన నిర్మాత ఆరోగ్యం.. దీనస్థితిలో వీడియో విడుదల.. లారెన్స్ సాయం
చెన్నై: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు. విక్రమ్, సూర్య కలిసి నటించిన పితామహన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రంతో పాటు విజయకాంత్ హీరోగా నటించిన గజేంద్ర తదితర భారీ చిత్రాలను నిర్మాత విఏ.దురై. చివరిలో నిర్మించిన చిత్రాలు ప్లాప్ కావడంతో నష్టాల పాలయ్యారు. కాగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నటుడు రజనీకాంత్ కూడా సాయం చేస్తానని చెప్పారు. రాఘవ లారెన్స్ నిర్మాత పరిస్ధితి గ్రహించి బుధవారం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. కాగా లారెన్స్ కథానాయకుడిగా నటించిన రుద్రన్ చిత్రం తమిళ ఉగాది సందర్భంగా ఇవాళ ఏప్రిల్ 14న విడుదలైంది. చదవండి: ‘రుద్రన్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
జమిలీ ఎన్నికలు తథ్యం..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు. మొదట గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్ ఆగింది. పార్టీ కేడర్ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. జమిలీ ఎన్నికలు తథ్యం.. దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. -
Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. ఆ ప్రాంతానికి మహర్దశ
భారతీయ ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మన దేశంలో కొన్ని కంపెనీలు విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ Dao EVTech భారీ పెట్టుబడిని ప్రకటించింది. మహారాష్ట్ర పూణే సమీపంలోని చకన్లోని 'డావ్ ఈవీటెక్' (Dao EVTech) తమిళనాడులో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 షోరూమ్లను కలిగి ఉన్న ఈ కంపెనీ మరిన్ని షోరూమ్లను ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. (ఇదీ చదవండి: పది గ్రాముల బంగారం రూ. 2 లక్షలకుపైనే .. ఎక్కడంటే?) తమిళనాడులో ఇప్పటికే మధురై, పొల్లాచ్చి, కోయంబత్తూర్, తంజావూరు ప్రాంతాల్లో డీలర్షిప్లను కలిగి ఉన్న డావ్ ఈవీటెక్ మరిన్ని డీలర్ నెట్వర్క్స్ ప్రారంభించనుంది. చెన్నైలో ప్రారభించాలనుకున్న డీలర్షిప్లు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన నగరాల్లో డీలర్షిప్లు ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమళనాడు చాలా కీలకమైన ప్రాంతం. చెన్నైలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఎక్కువ జనాభా ఉండటం వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు చాలా దోహదపడతాయని కంపెనీ చైర్మన్ డాక్టర్ మైఖేల్ లుయి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు: వీడియో వైరల్
స్విమ్మింగ్ కాంపిటీషన్లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్సూట్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్ సీటిజన్ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం. ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్ సిటజన్ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్ చేశారు. Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G — Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023 (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ని పోలిన వ్యక్తి చాట్ అమ్ముతూ..) -
Tamil Nadu: అంబేద్కర్ పేరు పలకని గవర్నర్.. డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్ ఆర్ఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్ అంబేద్కర్ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. If he (TN Gov RN Ravi) refuses to utter the name of Ambedkar in his Assembly speech, don't I have the right to assault him? If you (Gov) don't read out the speech given by Govt, go to Kashmir&we'll send terrorists so that they'll gun you down: DMK's Shivaji Krishnamoorthy (12.01) pic.twitter.com/OvcuauylVw — ANI (@ANI) January 13, 2023 మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు. -
గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయం చేయదలచుకోలేదు: సీఎం స్టాలిన్
‘తమిళుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోం.. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు ఎందాకైనా వెళతాం’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు ధన్యవాదాలు తెలుపుతూ, సభలో ఆయన వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయం చేయదలచుకోలేదని.. ప్రజా సంక్షేమం, తల్లి తమిళనాడును రక్షించడమే తమ ముందున్న అతిపెద్ద బాధ్యత అని ఉద్వేగంగా ప్రసంగించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతూ.. అందరికీ సమ న్యాయం చేయడమే తమ లక్ష్యమని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా తమిళనాడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సభలో గవర్నర్ వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం గురించి మాట్లాడి రాజకీయం చేయదలచుకోలేదన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమష్టి అభివృద్ధి, సమానత్వం, మహిళల హక్కులు, మత సామరస్యం వంటి సూత్రాలను అనుసరించి ద్రావిడ మోడల్ పాలనను రూపొందించామన్నారు. ప్రజల సంక్షేమం మాత్రమే తమ ఆలోచన అని, అదే ప్రజల హృదయాలను తాము గెలుచుకున్నామని పేర్కొన్నారు. నేను అంటే ఓ వ్యక్తి కాదని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కెబినెట్, ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేయనున్నామని ప్రకటించారు. కొత్తగా సీఎం గ్రామీణ రోడ్డు అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. శక్తిమంతమైన ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాష, తమిళ హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి నినాదాలతో శక్తిమంతమైన ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంగా రాజీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నామన్నారు. తమిళనాడు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, సామాజిక మార్పు, విద్యా అభివృద్ధి ఏక కాలంలో జరగాలని, తద్వారా అందరికీ మేలు జరగాలన్న కాంక్షతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో తమిళనాడు ప్రభుత్వం ఆశయాలు, జరిగిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణను క్లుప్తంగా పేర్కొన్నామని వివరించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేందుకు, బలాన్ని చాటేందుకు, శతాబ్దాల చరిత్ర కలిగిన అసెంబ్లీ విలువలను నిలబెట్టే విషయంలో వెనకడానని, ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూక్తులు, తమిళ కవిత్వాలను క్రోడీకరించారు. నిరంతరం శ్రమిస్తున్నాం... గడిచిన ఏడాదిన్నర కాలం తమిళనాడుకు సువర్ణ యుగాన్ని తలపించే రోజులు అని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కరోనా బారిన ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించామని, తాను సైతం అనారోగ్య కారణాలతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన గదిలో ఓ ‘డ్యాష్ బోర్డ్ ‘ ఉందని, ప్రతి రోజు అందులోకి వచ్చే సమాచారాలను, వివరాలను పరిశీలించి ఆయా శాఖల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో తన పర్యటనలు, ప్రభుత్వ ప్రగతి, నిధుల కేటాయింపు, తదితర అంశాలను సభకు సీఎం వివరించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని, ద్రావిడ మోడల్ పాలనకు లభించిన ఫలితం ఇది అని పేర్కొన్నారు. పథకాల విస్తరణ.. రాష్ట్రంలోని 1,545 పాఠశాలల్లో అల్పాహారం పథకం అమల్లో ఉందని.. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఈ పథాకాన్ని అమలు చేస్తామన్నారు. 15 నెలల వ్యవధిలో రైతులకు లక్షా 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం సీఎం పేరిట ప్రత్యేక పథకం అమలు చేయనున్నామన్నారు. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లతో 10 వేల కి.మీ గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. మసీదులకు ఇది వరకు రూ. 6 కోట్లు రాయితీలు ఇచ్చామని, ఈ ఏడాది నుంచి ఆ సంఖ్యను రూ. 10 కోట్లకు పెంచుతున్నటు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు 2024 జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక్కడి పాలసీలు, మౌలిక వసతులను పెట్టుబడిదారులకు తెలియజేయడానికి విదేశీ పర్యటనలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వందకుపైగా దేశాల నుంచి పెట్టుబడిదారులను ఈ మహానాడుకు ఆహ్వానించనున్నామన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు - కృష్ణగిరి, హోసూరు మధ్య వర్తక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. - పుదుకోటైను కార్పొరేషన్గా మార్చబోతున్నామని మంత్రి కేఎన్ నెహ్రు అన్నారు. - సీఎం బీమా పథకం అమల్లో దేశంలో తమిళనాడు రికార్డు సృష్టించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ వివరించారు. - ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.2,37,850 కోట్లతో పనులు చేపట్టామని.. శరవేగంగా జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు. - ఈ ఏడాది 316 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. - అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి పేర్కొన్నారు. చివరగా సభలో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో సవరణలతో పాటు మరికొన్ని ముసాయిదాలు ఆమోదం పొందాయి. అనంతరం సభను స్పీకర్ అప్పావు వాయిదా వేశారు. -
సెంచరీతో చెలరేగిన బాబా అపరాజిత్.. ఆధిక్యంలో తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: బౌలర్ల వైఫల్యం కారణంగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 203/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు 111.5 ఓవర్లలో 4 వికెట్లకు 510 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 115 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్నైట్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ (116; 16 ఫోర్లు, 3 సిక్స్లు) అదే స్కోరు వద్ద కార్తికేయ కక్ బౌలింగ్లో అవుటవ్వగా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (273 బంతుల్లో 179; 18 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబా అపరాజిత్ (165 బంతుల్లో 115; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. అపరాజిత్ సోదరుడు ఇంద్రజిత్ (52 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అపరాజిత్ అవుటైన వెంటనే తమిళనాడు తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్కు రెండు వికెట్లు దక్కాయి. 115 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (14; 3 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్ కాగా... కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5 బ్యాటింగ్), తనయ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు పోరాడి ‘డ్రా’ చేసుకుంటారో చేతులెత్తేసి ఓటమిని ఆహ్వానిస్తారో వేచి చూడాలి. చదవండి: Mohammed Rizwan: వరల్డ్కప్లో భారత్ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ..! -
బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే
చెన్నై: తమిళనాడు బీజేపీ నాయకురాలు శశికళ పుష్పను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోన్ బాలగణపతి లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డీఎంకే ఐటీ వింగ్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శశికళను బాలగణపతి పదే పదే తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె చీర కొంగును పట్టుకునేందుకు, చేతిని ముట్టుకునేందుకు పలుమార్లు ట్రై చేశాడు. ఆమె మాత్రం ఈ చేష్టలకు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY — இசை (@isai_) September 13, 2022 ఈ వీడియోను సరిగ్గా చూపేందుకు స్లో మోషన్లో ఎడిట్ చేసింది డీఎంకే ఐటీ వింగ్. బీజేపీలో చేరే మహిళలు ఆ పార్టీ నుంచి తమను తాము కాపాడుకోవడమే అది పెద్ద సమస్యా? అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించింది. దళిత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఇమాన్యుయెల్ శేఖరన్ జయంతి సందర్భంగా రామనాథపురం జిల్లాలో నివాళులు అర్పించేందుకు బీజేపీ నేతలు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే డీఎంకే ఆరోపణలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో బీజేపీ నేత ఖండించారు. బాలగణపతి వేధింపులకు పాల్పడలేదని, పుష్పగుచ్చాన్ని పట్టుకునేందుకే ప్రయత్నించారని పేర్కొన్నారు. డీఎంకే దురుద్దేశంతోనే ఈ వీడియోను ఎడిట్ చేసిందన్నారు. మరోవైపు బాలగణపతి మాత్రం ఈ వీడియోపై ఇప్పటివరకు స్పందించలేదు. చదవండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement