-
క్లీన్ కామెడీతో పార్టీ
‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్ కామెడీతో ‘సౌండ్ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్తో తెలుగులో ‘సౌండ్ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్ అయినా కామెడీ జానర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్లో 150కి పైగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే!
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
ఆమనికి ఈ హీరోయిన్ ఏమవుతుందో తెలుసా?
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు. -
ఇండస్ట్రీలో విషాదం.. సూపర్ హిట్ మూవీ డైరెక్టర్ మృతి!
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాధ్వి (56) కన్నుమూశారు. ముంబయిలోని నివాసంలో ఉదయం సంజయ్ తుదిశ్వాస విడిచారని ఆయన పెద్దకుమార్తె సంజినా తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 2000లో విడుదలైన తేరే లియే చిత్రంతో సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 2004లో విడుదలైన ధూమ్ సినిమాతో ఆయన తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఏడాదే ధూమ్ -2తో అలరించారు. 2020లో విడుదలైన ఆపరేషన్ పరిందే ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన చివరి చిత్రంగా నిలిచింది. -
‘ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది నేర దర్యాప్తు సంస్థ(Crime Investigation Department..సీఐడీ). ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. ‘‘సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్ అకౌంట్స్ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టాం’’ అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారాయన. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్ తెలిపారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్లను తొలగించాం. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడం. ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ విధంగా 45 తప్పుడు పోస్టులని గుర్తించాం. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించాం. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపాం. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టాం. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దు’’ అని సీఐడీ సూచించింది. సోషల్ మీడియా అకౌంట్స్ను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్లు 19 మందికి నోటీసులు ఇచ్చాం. ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చాం. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశాం. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లని గుర్తించాం. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్లు పెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. -
జప్తు చేసింది రూ.1.7 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్లైన్ నంబర్ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం. వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే యాప్ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. -
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
కాంగ్రెస్ది గతం.. ఇప్పుడు ఖతం!
జగిత్యాల, జగిత్యాల క్రైం, ధర్మపురి, సిరిసిల్ల, సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది గతమని, ఇప్పుడా పార్టీ ఖతమైందని, వారంటీ ముగిసిన పార్టీ గ్యారంటీ ఎలా ఇస్తుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. 150 ఏళ్ల కాంగ్రెస్ వారంటీ అయిపోయిందని, ఆరు గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు 24 గంటల కరెంట్పై అనుమానం ఉందని, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, ఆ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సోనియాకు సైతం లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అని, జనాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీకి తెలుసని ధ్వజ మెత్తారు. పీఎం మోదీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా వేరే ఎవరూ విమర్శించలేరని, మాకు ఆ పార్టీతో, మోదీతో ఎలాంటి మిలాఖత్ లేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మోదీది గాడ్సే వారసత్వమని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం బీఆర్ఎస్ అంటే కాళేశ్వరమని, కాంగ్రెస్ అంటే శనీశ్వరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మాతాశిశు ఆస్పత్రితోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. నరేంద్రమోదీ అంటే నమ్మించి మోసం చేసేవాడని విమర్శించారు. కాగా జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యా లయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తో కలిసి హోంమంత్రి మహమూద్అలీ ప్రారంభించారు. ఒక్క రూపాయి లంచం లేకుండా.. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ 577 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, 1,747 మందికి గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి కలిగే విధంగా కేసీఆర్ పాలన వర్ధిల్లుతోందన్నారు. మోదీ అబద్ధాల జాతర ఎక్స్(ట్విట్టర్)లో మంత్రి కేటీఆర్ ధ్వజం పీఎం నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలనే కాకుండా 140 కోట్ల మంది భారతీయులను మోసం చేశారని మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విభజన హామీలకు దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ విభజన హామీలకు పదేళ్లుగా పాతరేసి అబద్ధాల జాతర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. -
చంద్రబాబు పాత్ర సుస్పష్టం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుకున్నారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డిలు తెలిపారు. ఈ అడ్డగోలు అవినీతికి పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఈ స్కామ్ తాలూకు ఫైళ్లపై 13 డిజిటల్ సంతకాలు చేశారని వెల్లడించారు. ఆ సంతకాల కాపీలను మీడియా ఎదుట ప్రదర్శించారు. అగ్రిమెంట్లలో కనీసం తేదీ వేయకపోవడం, లెటర్ నంబర్ ప్రాంతాల్లో ఖాళీలను వదిలిన విషయాన్ని బయటపెట్టారు. థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వకూడదన్న నిబంధనలు పాటించలేదన్నారు. అన్ని వివరాలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించారు. ఈ కుంభకోణానికి తెరతీసేందుకు రూపొందించిన అగ్రిమెంట్లో లోపాలు మొదలు.. నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల్లోకి వాటిని తరలించిన విధానం.. తద్వారా ఎలా లబ్ధిపొందారన్న పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సీమెన్స్ కంపెనీకి ప్రాజెక్టు గురించే తెలీదు జీఓ నంబర్ 4 ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిజైన్టెక్ కంపెనీ, సీమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ల మధ్య త్రైపాక్షిక అగ్రిమెంట్ జరిగినట్టు చూపారు. వాస్తవంగా జీవోలో ఉన్న అంశాలు, అగ్రిమెంట్లోని అంశాలు వేరుగా ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ పేరుతో కుట్రపూరితంగా ప్రాజెక్ట్ను రూపొంందించారు. ఈ అగ్రిమెంట్ పరిశీలిస్తే..అందులో జీఓ నంబర్, లెటర్ నంబర్, తేదీలు సైతం సరిగా లేవు. కేవలం డ్రాఫ్ట్గా తయారు చేసి, భవిష్యత్తులో నంబర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంచినట్టు నిర్ధారణ అవుతోంది. ఒరిజినల్ పత్రాలు పరిశీలించాం. అవి నకిలీ అని నిర్ధారణ అయ్యింది. థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వకూడదని అగ్రిమెంట్లో రాసుకున్నట్టు స్పష్టంగా ఉంది. అయినా థర్డ్ పార్టీకి రూ.330 కోట్లు వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయి. డిజైన్టెక్ నుంచి ఈ మొత్తాన్ని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. 2014లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశాక ఆడిటర్గా జి వెంకటేశ్వర్లు అనే ప్రైవేటు వ్యక్తిని నియమించారు. గంటా సుబ్బారావును స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శిగా, ఎక్స్ అఫీషియో సెక్రెటరీ టు సీఎంగా నియమించారు. ఇలా ఉన్నత విద్యా శాఖ పర్యవేక్షణ లేకుండా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి సీఎం కార్యాలయం నుంచే నేరుగా పనిచేసేలా ‘కావాల్సిన’ విధంగా పని పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. డిప్యూటీ సీఈఓగా యూపీ కేడర్కు చెందిన అపర్ణ అనే ఐఏఎస్ అధికారిని నియమించారు. ఆమె భర్త సీమెన్స్ తరఫున అగ్రిమెంట్ల తయారీలో పనిచేశారు. తమ ప్రమేయమే లేదని ‘సీమెన్స్’ చెప్పింది గుజరాత్ తరహాలో యువతకు నైపుణ్యాభివృద్ధి అంటూ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి తెరతీశారు. కనీసం పైలెట్ ప్రాజెక్టు అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. భారత్లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారణ అయ్యింది. గుజరాత్లో కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో సౌమ్యాద్రి బోస్గా సంతకాలు చేయగా, ఏపీలో ఉన్న ఒప్పందంలో మాత్రం సుమన్ బోస్ పేరిట సంతకాలు చేసినట్టు సదరు కంపెనీ వెల్లడించింది. సదరు కంపెనీ లీగల్ కౌన్సిల్ సైతం ఈ విషయాలను సీఐడీకి నిర్ధారించింది. సాఫ్ట్వేర్ కోసం డిజైన్టెక్ నుంచి రూ.58.80 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలోని రూ.371 కోట్లలో రూ.58.80 కోట్లు జర్మనీలోని తమ సీమెన్స్ కంపెనీకి వచ్చాయని, అయితే ఆ సొమ్ము తమ కంపెనీకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, ఏపీ ఆర్థిక శాఖ నుంచి కానీ రాలేదని ఆ కంపెనీ స్పష్టం చేసింది. డిజైన్ టెక్ సంస్థ కోరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే రూ.58.80 కోట్లు ప్రభుత్వం నుంచి డిజైన్ టెక్ అనే సంస్థకు తొలుత చేరినట్టు రూడీ అవుతోంది. వాస్తవానికి అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ నగదు బదిలీ జరిగినట్టు స్పష్టం అవుతోంది. సీఐటీడీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) ప్రభుత్వానికి ఏ ప్రతిపాదనలు ఇవ్వాలో కూడా సుమన్ బోస్ తయారు చేశారు. ఇంకా లోతుగా పరిశీలిస్తే.. సీఐటీడీ రిపోర్ట్ ఇవ్వకముందే రూ.200 కోట్లకు పైగా నగదు మళ్లించారు. ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ‘దశా’ంశాల ఆధారంగా దర్యాప్తు నకిలీ, కల్పిత ట్రై ప్యాట్రియేట్ అగ్రిమెంట్ ఎలాంటి నిబంధనలు పాటించకుండానే రూ.371 కోట్లు విడుదల నోట్ఫైల్లో రిమార్క్లు పూర్తిగా విస్మరించడమే కాక అధికారులపై తీవ్ర ఒత్తిడి ఈ కుంభకోణంలో తమ కంపెనీ పేరును వాడారని, అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా స్పష్టం చేసింది గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, అమలు తీరుతెన్నులతో పోలిస్తే ఏపీలో జరిగింది వేరు. ఇక్కడ ప్రాజెక్టు అంతా అక్రమాలే. రూ.371 కోట్ల స్కామ్లో షెల్ కంపెనీల పాత్ర ఈ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు, అరెస్టుల వివరాలు, ఈ కేసులో అటాచ్మెంట్లు ప్రాథమిక ఆధారాలు, కోర్టులో సమర్పించిన వివరాలు ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు సీఐటీడీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) థర్డ్ పార్టీ అభిప్రాయం నోట్ ఫైళ్లు మాయం చేశారు ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం బయటపడింది. వెలుగులోకి విస్తుపోయే నిజాలు ఈ కుంభకోణం బయట పడకూడదని నోట్ ఫైల్స్ను సెక్రెటేరియట్లో తగలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఎంతో స్కిల్ఫుల్గా టీడీపీ ప్రభుత్వ హయాంలో దోచేశారు. జర్మనీకి చెందిన సీమెన్స్ ఏజీ అనే కంపెనీ ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.3300 కోట్ల ప్రాజెక్టులో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా అంటే ఉచితంగా ఇస్తామంటూ ముందుకు వచ్చినట్టు ఒప్పందంలో పేర్కొన్నారు. కేవలం 10 శాతం ఏపీ ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కింద ఇస్తే చాలన్నట్టుగా ఒప్పందాల్లో ఉంది. చివరకు ఈ పది శాతం సొమ్ము రూ.371 కోట్లను నాలుగు లేయర్లుగా సృష్టించి పప్పు బెల్లాలుగా ఏపీ ఖజానా నుంచి కొల్లగొట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని అధికారులు అభ్యంతరం పెట్టినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా.. తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు సూచించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ నోట్ఫైల్లో ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపుల కోసం డిజైన్టెక్ చేసిన ప్రయత్నంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పుణేలో జీఎస్టీ అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం రూ.కోటి అయ్యే సాఫ్ట్వేర్ను రూ.250 కోట్లుగా చూపారు. ఇది ఎంతో అన్యాయం. – పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఏఏజీ యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్కు సంబంధాలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైందన్నారు. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారన్నారు. డబ్బులు ఎలా చేర్చారన్న పూర్తి వివరాలు మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. ఇందులో హవాలా జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, సీఐడీ దర్యాప్తుతోపాటు సీమెన్స్ గ్లోబల్ కంపెనీ ఇచ్చిన వివరణలు సైతం వెల్లడించాయని తెలిపారు. ఈ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడి దర్యాప్తు కూడా కొనసాగుతోందని, అవసరం మేరకు ఇంకా అరెస్టులు ఉంటాయన్నారు. ఇందులో అనేక కోణాలు దాగి ఉన్నాయని, చార్జిషీట్కు ఇంకా సమయం పడుతుందని వివరించారు. -
‘స్కిల్’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్ కంపెనీయే ఈ మెయిల్ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్ ఇంకా ఏం చెప్పారంటే.. కుంభకోణం సూత్రధారి చంద్రబాబే ♦ కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు. ♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్ అకౌంటెంట్కు ఏపీఎస్ఎస్డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్ను ఆమోదించారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమెన్స్ కంపెనీ పేరుతో మోసం ♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వాడుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ♦ సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్ఎస్డీసీ, సీఐడీలకు అందించింది. భారత్లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మేరMý ు సుమన్బోస్, ఇతరులు డిలీట్ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు, మెసేజ్లు, ఇతర డాటాను రిట్రైవ్ చేసి సీఐడీకి అందించింది. ♦ డిజైన్ టెక్ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్గా నకిలీ ఒప్పందం ♦ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్ టెక్ అనే కంపెనీని భాగస్వామిని చేశారు. ♦ సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్టెక్ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల ♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్ టెక్ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు ♦ డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్ కంపెనీ నుంచి రూ.58.80 కోట్ల సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్ టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీలకు మళ్లించింది. ♦ వాటిలో షెల్ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. గుజరాత్ మోడల్ కాదు.. ♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్ను పరిశీలించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్ను రూపొందించింది. ♦ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. నోట్ ఫైళ్లు మాయం ♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్ చేసింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది. చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు ♦ షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. ♦ డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా యోగేశ్ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. ♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కే అందించామని మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్’ కుంభకోణం బట్టబయలు ♦ ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్బోస్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. ♦ డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్ కూడా చేసింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. ♦ ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్ వినాయక్ ఖన్వేల్కర్తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసింది. ♦ సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
మార్గదర్శి ఫైనాన్సియల్ పెద్ద స్కాం: ఏపీసీఐడీ
-
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ
టైటిల్: స్లమ్ డాగ్ హజ్బెండ్ నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి నిర్మాణ సంస్థ:మైక్ మూవీస్ దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో విడుదల తేది: జులై 29, 2023 కథేంటంటే.. హైదరాబాద్లోని పార్శీగుట్టకు చెందిన లక్ష్మణ్ అలియాస్ లచ్చి(సంజయ్ రావు), మౌనిక(ప్రణవి మానుకొండ) ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే... ఇద్దరి జాతకాలు ఉండవు. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే ఇరు కుటుంబాలలో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతాడు పంతులు. ఈ గండం పోవాలంటే లచ్చి ముందుగా ఓ కుక్కను లేదా చెట్టును పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు. స్నేహితుడు సంతోష్(యాదమ్మ రాజు)సలహాతో లచ్చి ఓ కుక్క(బేబీ)ని పెళ్లి చేసుకుంటాడు. వారం రోజుల తర్వాత ప్రియురాలు మౌనికతో పెళ్లి జరుగుతుండగా పోలీసులు లచ్చిని అరెస్ట్ చేస్తారు. బేబీ(కుక్క) ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. బేబీతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం నేరమని, విడాకుల కోసం రూ.20లక్షలు భరణంగా ఇవ్వాలని కుక్క ఓనర్ డిమాండ్ చేస్తారు. ఈ కేసు కోర్టుకెక్కుతుంది. మరి ఈ కేసులో ఎవరు గెలిచారు? బేబీ ఓనర్ ఎందుకు రూ.20లక్షలు డిమాండ్ చేస్తాడు? మౌనికతో లచ్చి పెళ్లి జరిగిందా లేదా? బేబీతో లచ్చి ఎలా ప్రేమలో పడ్డాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కుక్కతో పెళ్లి.. ఇది వినడానికే కాస్త వింతగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు మనం టీవీల్లో చూస్తుంటాం. జంతువులపై ప్రేమతోనో లేదా దోషం పోవాలనో కొంతమంది ఇలాంటి వింత పనులు చేస్తుంటారు. అదే పాయింట్ని కథగా మలిచి స్లమ్ డాగ్ హజ్బెండ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీధర్. మూఢనమ్మకంతో ఓ కుక్కను పెళ్లి చేసుకున్నాక..అతనికి ఏర్పడిన ఇబ్బందులు ఏంటనేది కామెడీగా చూపిస్తూనే..అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. నా అనుకున్నవారే అవసరాన్ని బట్టి మోసం చేస్తుంటారు. కానీ జంతువులకు అలాంటివేవి తెలియదు. ఒక్కపూట తిండి పెడితే చాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయని అనేది ఈ సినిమాలో చూపించారు. బస్తీకి చెందిన లచ్చి తన ప్రియురాలు మౌనికతో ఫోన్లో సెక్సీ స్పీకింగ్ చేస్తున్న సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కూడా కాసేపు ఆ తరహా సన్నివేశాలే ఉంటాయి.ఇవి యాత్ని బాగా ఆకట్టుకుంటాయి. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్కి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఇక కుక్కతో పెళ్లి కాస్సెప్ట్ ప్రారంభమై తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే కుక్కతో పెళ్లి జరిగే వరకు కాస్త ఎంటర్టైనింగ్ సాగుతుంది. ఆ తర్వాత కథ కోర్టు చుట్టు తిరుగుతుంది. కోర్డు రూమ్ సీన్స్ ఫేలవంగా ఉంటాయి. కామెడీ పండించడానికి ఆస్కారం ఉన్నా..దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కుక్కకు ‘వెన్నెల’కిశోర్ వాయిస్ పెట్టడం..దాని వెనుక సీక్రెట్ని రివీల్ చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. కోర్టులో జంతువుల విశ్వాసం గురించి చెప్పే సీన్స్ కాస్త ఎమోషనల్గా ఉంటుంది. దర్శకుడు రొమాంటిక్ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ కామెడీపై కూడా పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. బస్తీకి చెందిన లచ్చి అలియాస్ లక్ష్మణ్గా సంజయ్ రావు జీవించేశాడు. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించాడు. ఇక మౌనికగా ప్రణవి మానుకొండ అదరగొట్టేసేంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే తనదైన నటన, మాటలతో యువతకు మత్తెకించేసింది. ఈ సినిమాలో యాదమ్మ రాజుకు మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు సంతోష్గా యాదమ్ రాజు కామెడీ సినిమాకు ప్లస్. అంతేకాదు క్లైమాక్స్ అతని పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. కుక్క ఓనర్గా నటించిన వేణు కొలసాని తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో అందరికి గుర్తిండిపోయేలా చేశాడు. ఇక లాయర్లుగా బ్రహ్మాజీ, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భీమ్స్ సంగీతం సినిమాకు చాలా ప్లస్. 'లచ్చి గాని పెళ్లి' సాంగ్ థియేటర్స్లో విజిల్స్ వేయిస్తుంది. రెట్రోసాంగ్తో పాటు మిగతావి కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
ఆర్జీవీకి కథ చెబితే ‘కుక్క మొగుడు’ అని టైటిల్ పెట్టాడు : బ్రహ్మాజీ
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ స్టోరీని రామ్ గోపాల్వర్మకు వినిపించి టైటిల్ అడిగితే ‘కుక్క మొగుడు’అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారు. కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’అని సీనియర్ నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం. ►సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు. ►మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా ఇందులో కనిపిస్తాను. ► సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్గా నిలుస్తుంది. ► జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అదే టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం. ► భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది. ► సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు. ► ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్నాను. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్లోనే ఎక్కువగా కనిపిస్తాను. -
బన్నీని చూసి ఇండస్ట్రీలోకి వచ్చా: యంగ్ హీరో సంజయ్ రావు
మా నాన్న(బ్రహ్మాజీ)ను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత బన్నీ(అల్లు అర్జున్)ని ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన జర్నీ నాకు తెలుసు. ఓ పెద్ద నిర్మాత కొడుకు ఈజీగా సినిమాల్లోకి వచ్చాడు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. సినిమాల కోసం బన్నీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. నేను కూడా బన్నీలాగే కష్టపడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను’అని యంగ్ హీరో సంజయ్ రావు అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా హీరో సంజయ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ కథ మా నాన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే ఒకే చేశా. ►రెగ్యూలర్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్.. హీరోయిన్ పెట్టాలని పెడతారు. కానీ ఈ సినిమాలో ప్రణవి రోల్ ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. ఈ సినిమాలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్గా రాత్రి పూట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది. అదే రియాలిటీ ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతోంది. ►ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది.నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా. ►సెట్స్లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. కో యాక్టర్గానే కలిసి నటిస్తా. పుష్ప షూటింగ్లో అల్లు అర్జున్ గారు నాన్నతో మాట్లాడారు. 'బ్రహ్మాజీ మీ కొడుకు సినిమా ట్రైలర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది..' అని బన్నీ గారు అన్నారు. కారు ఎక్కే ముందు ఫయాద్ ఫజిల్ గారికి ఈ ట్రైలర్ను కచ్చితంగా చూడాలని చెప్పారు. ►నాకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు. నేను ఎవరి అయినా కలవాలంటే వాళ్ల ఇంటి బయట నిల్చుంటా. భీమ్లా నాయక్ సినిమా సమయంలో త్రివిక్రమ్ను కలిసేందుకు ఐదు రోజులు అక్కడ జనాల మధ్య లైన్లో నిలబడ్డా. ఒక బౌన్సర్ నన్ను చూసి ఏంటి సార్ అక్కడ నిల్చున్నారని అన్నాడు. తరువాత రెండు నిమిషాలు త్రివిక్రమ్ గారితో మాట్లాడా. ►నేను నావీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చా. ఆ తరువాత యాక్టింగ్లో శిక్షణ కోసం ముంబై వెళ్లా. ఆళ్ల పురుషోత్తం గారి దగ్గరకు వెళ్లా. లావణ్య త్రిపాఠి గారు అక్కడే శిక్షణ తీసుకున్నారు. ఆమె మా నాన్నతో చెప్పి అక్కడికి రికమెండ్ చేశారు. అక్కడ వెళితే.. స్టూడెంట్స్ అంతా నార్త్ వాళ్లే ఉన్నారు. నాది హైదరాబాద్ అని చెబితే.. హైదరాబాదా..? సౌత్ ఇండియానా..? అని ఒక రకంగా చూశారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ ముందుకు వెళుతోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెడితే మనకు ఇచ్చే గౌరవమే వేరు. ►హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. అవి హోల్డ్లో పెట్టా. ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఓ పిట్టకథ చిత్రం కో డైరెక్టర్గా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. నాకు వెబ్సిరీస్ అని.. సినిమా అని వేరే క్యాటగిరీలు ఉండవు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. రిలయ¯Œ ్స ఎంటర్ౖటెన్మెంట్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తోంది. ‘‘మ్యారేజ్ బ్యాక్డ్రాప్లో ఓ కొత్త పాయింట్ను ఈ సినిమాలో చర్చించబోతున్నాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఐటీఆర్ గడువు పొడిగింపు పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ. -
స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!
సినిమా రంగంలో వారసుల తెరంగేట్రం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పటికే చాలామంది వారసులు వివిధ శాఖల్లో రాణిస్తున్నారు. తాజాగా ఒక కొత్త కాంబినేషన్కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటుడు విజయ్ తన తండ్రి దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ ద్వారా కథానాయకుడుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) అదేవిధంగా నటి దేవయాని. ఈమె బహుభాషా నటి. తొట్టాల్ సీణుంగి చిత్రం ద్వారా తమిళంలో కథానాయకగా పరిచయమైన దేవయాని ఆ తర్వాత కాదల్ కోట్టై వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. నీ వరివాయ్ ఎన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజకుమార్. ఆ చిత్రంలో అజిత్, దేవయాని హీరో హీరోయిన్గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు రాజకుమార్కు, నటి దేవయానికి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె ఇనియ కుమార్ను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.రాజకుమార్ దర్శకత్వం వహించిన నీ వరువాయ్ ఎన్ చిత్రం 1999లో విడుదలైంది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇందులో విజయ్ కుమారుడు సంజయ్, తన కూతురు ఇనియకుమార్తోను, హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన కూతురు ఇనియాకు నటించాలని కోరిక ఉందని దీంతో సంజయ్కు జంటగా ఆమెను నటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు అయితే విజయ్ వారసుడు సంజయ్ తెరవెనుక బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఆయన కథానాయకుడిగా నటిస్తారా వేచి చూడాల్సిందే. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి
-
విజయ్ తనయుడు హీరోగా ఉప్పెన రీమేక్!
తెలుగు చిత్రం ఉప్పెన పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి కృతి శెట్టి నైతిక ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. కాగా తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్ వారసుడు సంజయ్ను హీరోగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించినా, ప్రస్తుతం దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. విదేశాల్లో దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన ఈయన ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నాడు. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పెన చిత్ర రీమేక్లో సంజయ్ని హీరోగా నటింప చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఆ చిత్రంలో నటించిన కృతి శెట్టినే తమిళంలోనూ ఎంపిక చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే ది వారియర్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా టాలీవుడ్ నటుడు నాగచైతన్య నటిస్తున్న ద్విభాషా చిత్రం కస్టడీలో కూడా ఈమెనే నాయకి. ఇకపోతే ఉప్పెన చిత్ర రీమేక్లో నటించడానికి సంజయ్ ఊ అంటాడా? ఊహూ అంటాడా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
800 రకాల ఔషధాల 'ధరలు పెరుగుదల'
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 800 రకాల అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులన్నింటి ధరలు 12.12 శాతం పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతారని, ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులపై భారం పడుతుందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ సంజయ్రెడ్డి అన్నారు. రక్త హీనత, మధుమేహం, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, టీబీ, వివిధ రకాల కేన్సర్లకు రోగులు ఉపయోగించే మందుల ధరలు పెరుగుతాయని చెపుతున్నారు. అలాగే మెడికల్ డివైజ్ల ధరలు కూడా భారీగా పెరుగుతాయని, జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) వీటి ధరలను పెంచిందని సంజయ్ పేర్కొన్నారు. అసలే కరోనా తర్వాత అనేకమంది పలు సైడ్ఎఫెక్ట్స్కు గురయ్యారు. దీంతో అనేకమంది నిత్యం పలు రకాల మందులు వాడుతున్నారు. మందుల ధరల పెంపువల్ల ఆదాయంలో కొంత భాగం వాటికి అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం పెంచింది. కాగా, ఏయే మందుల ధరలు పెరిగాయో వాటి జాబితాను కేంద్రం ఒకటిరెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని సంజయ్రెడ్డి తెలిపారు. -
Maharashtra: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ..
సాక్షి, ముంబై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది సూచనప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చామని, వచ్చే ఎన్నికల్లో శిండే వర్గంతో కలిసే పోటీచేయనున్నట్లు బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావన్కుళే వెల్లడించారు. ఇరువురం కలిసి 200 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున సీట్ల పంపకాలు, సర్దుబాట్లపై పలు చర్చలు జరుపుతామని ఆ తర్వాతే తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని భావన్ కుళే శనివారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా అందులో బీజేపీ 240, శివసేన (శిండే వర్గం) 48 స్థానాల్లో పోటీ చేస్తుందని బావన్కుళ్లే తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్న నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం సమయం అన్ని పారీ్టలకు ఉండగా...శిందే, బీజేపీ శిబిరంలో మాత్రం ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఎంవీఏ ఒప్పందంతో మొదలైన వేడి మహా వికాస్ ఆఘాడి నేతలు లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఫార్మూలా రూపొందించిన విషయం తెలిసిందే. మొత్తం 48 లోక్సభ స్థానాల్లో శివసేన 21, ఎన్సీపీ 19, కాంగ్రెస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిండే, ఫడ్నవీస్ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన మొదటి ప్రసంగంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మేం, బీజేపీ కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు. ఇరువురం కలిసి 200 స్థానాల్లో గెలుస్తామని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. వైరల్ అవుతోన్న భావన్ కుళే వ్యాఖ్యలు ఇదిలాఉండగా చంద్రశేఖర్ భావన్ కుళే మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో పోటీ చేస్తుందని, దీంతో కార్యకర్తలందరూ ఇప్పటి నుంచి అప్రమత్తమై, పనుల్లో నిమగ్నం కావాలని సూచించినట్లు ఉంది. అంటే శిండే వర్గానికి కేవలం 48 స్థానాలు లభిస్తాయని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. భావన్ కుళే వ్యాఖ్యలపై శిండే వర్గానికి చెందిన సంజయ్ శిర్సాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎంత వరకు మాట్లాడే అధికారముందో అంతే మాట్లాడాలని అంతకుమించి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ సీట్ల పంపకంపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని, ఇది కేవలం భావన్ కుళే అభిప్రాయమని స్పష్టం చేసి ఈ అంశానికి అక్కడితో తెరదించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించామని శిర్సాట్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీట్ల పంపకంపై పలుమార్లు చర్చలుంటాయని, ఆ తర్వాత తుది నిర్ణయానికి రాగానే అధికారికంగా జాబితా వెల్లడిస్తామని తెలిపారు. అప్పటివరకు అసెంబ్లీ, లోక్సభ సీట్లు సర్దుబాటు ఫార్మూలాపై వచ్చిన ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. -
రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో జరిగిన దారుణ ఘటనపై స్థానికులు రగిలిపోతున్నారు. పెట్రోల్ బంక్లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేసి.. అకారణంగా ఒకరిని పొట్టనబెట్టుకున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగలకు నేర చరిత్ర ఉన్నట్లు ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. మరోవైపు సంజయ్ మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని అతని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఏం జరిగిందంటే.. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడలోని ఓ పెట్రోల్ పంప్ వద్దకు కారులో ముగ్గురు యువకులు చేరుకున్నారు. అయితే.. సమయం దాటిపోవడం, పైగా వాళ్లు మద్యం మత్తులో ఉండడంతో పెట్రోల్ లేదని చెప్పారు కార్మికులు. అయితే.. తాము చాలా దూరం వెళ్లాలని ఆ యువకులు బతిమాలారు. దీంతో.. పెట్రోల్ పోశారు కార్మికులు. ఆపై వాళ్లు కార్డు పని చేయట్లేదని యువకులు బుకాయించారు. దీంతో.. క్యాష్ ఇవ్వమని సిబ్బంది కోరడంతో గొడవకు దిగారు. మాకే ఎదురు మాట్లాడుతారా? అంటూ ఆ మగ్గురు రెచ్చిపోయి బంక్ క్యాషియర్పై దాడికి దిగారు. అక్కడే పని చేసే సంజయ్ అది గమనించి.. వాళ్లను అడ్డుకోబోయాడు. దీంతో సంజయ్పై పిడిగుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది చూసి యువకులు పారిపోగా.. సంజయ్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పెట్రోల్ బంక్లో అమర్చిన సీసీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదు అయ్యాయి. కేసు నమోదు.. వెతుకులాట ఇదిలా ఉంటే.. సంజయ్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి.. ట్రాఫిక్ను అడ్డుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తపుణ్యానికే సంజయ్ ప్రాణం పోవడంతో అతని కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. మరోవైపు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూక్గా గుర్తించారు. ప్రస్తుతం వాళ్లను పట్టుకునే యత్నంలో ఉన్నారు. ఇక నిందితులు నిందితులు అనూప్, నరేందర్, మల్లేష్ పై నార్సింగిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారంతో పాటు దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ కంత్రీగాళ్లు. గత నెలలో స్థానికంగా ఓ విలేకరిపైనా దాడి చేశారు వీళ్లు. -
బిగ్బాస్ ఫేం వీజే సన్నీ హీరోగా కామెడీ చిత్రం
‘బిగ్ బాస్’ తెలుగు 5 సీజన్ విజేత వీజే సన్నీ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది.టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. ‘‘చక్కని వినోదం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. శుక్రవారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం.. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్పై రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: మదీన్, దర్శకత్వ పర్యవేక్షణ: వి. జయశంకర్.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement