-
బెదిరింపుల బాబులు
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : నరసాపురం తీరప్రాంతంలో సంచలనం సృష్టించిన సెక్స్ వీడియో కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసు వెలుగులోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా కీలక నిందితుడి ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పేరుపాలెం గ్రామంలో సెల్ పాయింట్ నడిపే ఆగిశెట్టి సాయి అనే యువకుడు ఓ యువతిని వలలో వేసుకుని ఆమెతో రాసలీలలు సాగించిన దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియోను సాయికి తమ్ముడు వరసయ్యే ఆగిశెట్టి గోపీనాథ్ దొంగిలించాడు. గోపీనాథ్ సదరు అశ్లీల వీడియోను కటికల బాబులు, గుత్తుల నాగసత్తిబాబుకు ఇవ్వడం వారు సాయిని రూ.5 లక్షలు ఇవ్వమని బెదిరించారు. సాయి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియోను వాట్సాప్, ఫేస్బుక్ల్లో పెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కేసులో కటికల బాబులు మినహా మిగతా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాబులు అత్యంత కీలకమైన వ్యక్తి. అతడి ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు. అంతేకాక కేసులో అతడిని ఏ–4గా నమోదు చేశారు. దీనిపై స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం కేసును నిష్పక్షపాతంగానే దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చాలాకాలంగా బాబులు లీలలు శృంగార బలహీనతలు ఉన్న వారిని టార్గెట్గా చేసుకుని కటికల బాబులు చాలాకాలంగా లీలలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. మహిళలను మోసగించడం, అతని ట్రాప్లో పడ్డ మహిళలను ఉపయోగించుకుని బెదిరింపు వ్యవహారాలు నడిపి, లక్షలకు లక్షలు చాలామంది వద్ద గుంజినట్టుగా వార్తలు వస్తున్నాయి. భీమవరంలో ఓ వైద్యుడు వద్ద రూ.50 లక్షలపైనే వసూలు చేశారని చెపుతున్నారు. అలాగే బాబులు బారిన పడి సాక్షాత్తూ అతడి సమీప బంధువులే డబ్బులు పోగొట్టుకుని ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తోంది. ఇతని వ్యవహారాలపై గ్రామంలో కథలు, కథలుగా చెప్పుకుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇతని బారిన పడి రోడ్డునపడ్డ బాధితుల జాబితా పెద్దగానే ఉంటుందని సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు గతంలో నరసాపురంలో జరిగిన శ్రీగౌతమి హత్య కేసులో పోలీసుల ప్రతిష్ట పూర్తిగా మసక బారింది. యాక్సిడెంట్ మాటున శ్రీగౌతమిని పక్కా స్కెచ్తో హత్య చేస్తే, పోలీసులు మాత్రం 15 రోజుల్లోనే కేసును యాక్సిడెంట్గా క్లోజ్ చేశారు. గౌతమి సోదరి పావని సీబీసీఐడీని ఆశ్రయించి పోరాటం చేయడంతో చివరికి అది హత్యకేసుగా తేల్చారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలా ప్రస్తుతం పరిస్థితులులేవు. నేరాల అదుపు విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. బాబులు స్కెచ్తోనే వీడియోలు నెట్లో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు బాబులు మొత్తం వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి బయటకు చెప్పలేని బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం. మొత్తంగా బాబులు దొరికితేనే గానీ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. -
మాల్ప్రాక్టీస్ దర్యాప్తులో పురోగతి
సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా వెల్లడవుతున్న నిజాలు పరీక్షకు ముందు నుంచే ఇచ్ఛాపురం ఎంఈవో, భాస్కరరావుల సంభాషణ ? చురుకుగా సాగుతున్న పోలీస్ దర్యాప్తు శ్రీకాకుళం : జిల్లాలో డీఎస్సీ పరీక్షకు సంబంధించి జరిగిన మాల్ప్రాక్టీస్ వ్యవహారంపై డీఎస్పీ ఆద్వర్యంలో జరుగుతున్న పోలీసుల దర్యాప్తులో పురోగతి సాధించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అనుమానితుల అందరి సెల్ఫోన్ కాల్డేటా పోలీసులకు అందడంతో విచారణలో పురోగతి సాధించగలిగినట్లు సమాచారం. డీఎస్సీ పరీక్షకు పదిరోజుల ముందునుంచే ఇచ్ఛాపురం ఎంఈవో లక్ష్మీనారాయణ మాల్ప్రాక్టీస్కు పాల్పడిన అభ్యర్థిని భర్త భాస్కరరావు పలుసార్లు సంభాషించినట్లు పోలీసులు గుర్తించినట్లు బోగట్టా. పరీక్ష రోజున కూడా వీరిద్దరూ సంభాషించడంతో పాటు పరీక్ష సమయంలో కొందరితో మాట్లాడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ నంబర్లు ఎవరివన్న దానిపై విచారణ కొనసాగుతోంది. వీరిద్దరూ ఓ అధికారితో కూడా మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అధికారికి ప్రభుత్వపరంగా వచ్చిన సెల్నంబర్తో కాకుండా ప్రైవేట్నంబర్తో మాట్లాడినట్లు పోలీసులు సందేహపడుతూ ఆ దిశగా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల్లోగా ఈ కేసు ఓ కొలిక్కి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇచ్ఛాపురం ఎంఈవో ఇచ్చిన సంజాయిషీ పత్రాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీకి జిల్లా విద్యాశాఖాధికారి నివేదించారు. దీంతోపాటు ఎంఈవో వ్యవహారశైలి డీఎస్సీ పరీక్ష సమయంలో అనుమానాస్పదంగా ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికారుల అదేశాల మేరకు ప్రాధమిక విచారణ చేపట్టిన ఆర్జేడీకి ఈ వ్యవహారంపై అవగాహన ఉండడంతో పాటు డీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఈవోను సస్పెండ్ చేసే వీలున్నట్లు తెలిసింది. అయితే పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకోవాలా, వెంటనే చర్యలు తీసుకోవాలా అనే విషయమై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా మాల్ప్రాక్టీస్లో ఎంఈవో, అభ్యర్థి భర్త కీలక భూమిక పోషించారని అన్ని కోణాల్లోనూ తేటతెల్లమవుతోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement