-
పురుగుమందుల దుకాణాల్లో సోదాలు
సాక్షి, అమరావతి: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా 77 హోల్సేల్, రిటైల్ ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపుల్లో ఈ–పోస్ యంత్రంలో పేర్కొన్న నిల్వలకు, బుక్ బ్యాలెన్స్లో ఉన్న నిల్వలకు పొంతన లేకపోవడం, ఓ–ఫారం లేకుండా ఎరువుల విక్రయం, స్టాక్ రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయించడం, బిల్లు పుస్తకాలు, స్టాక్ బోర్డులు నిర్వహించకపోవడం తదితర అవకతవకలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు రూ.29.14 లక్షల విలువైన 243.192 టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకుని 18 కేసులు నమోదు చేశారు. అలాగే రూ.7.10 లక్షల విలువైన 92 టన్నుల ఎరువులను సీజ్ చేసి రెండు కేసులు నమోదు చేశారు. రూ.19.37లక్షల విలువైన 965 లీటర్ల పురుగుమందులను స్వాధీనం చేసుకుని 11 కేసులు నమోదు చేశారు. మరో రూ.2.96లక్షల విలువైన 105.95 కేజీల ఘన పురుగుల మందు నిల్వలను సీజ్చేశారు. -
ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
రూ.9 లక్షల పురుగు మందుల అమ్మకాలు నిలిపివేత రూ.3 లక్షల ఎరువుల స్వాధీనం గొల్లప్రోలు : మండలంలోని దుర్గాడ, వన్నెపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల షాపులపై మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు బృందాలుగా దాడులు చేశారు. సుమారు రూ.9.14 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.3 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వన్నెపూడిలోని విజిలెన్స్ సీఐ గౌస్బేగ్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ ఏజెన్సీలోని నిల్వలు, స్టాకు రికార్డులను పరిశీలించారు. షాపు నిర్వహణకు సరైన పత్రాలు లేకపోవడం, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ.7.20 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. స్టాకు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో రూ.1.82 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. మైన్స్ ఏజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాడలో... దుర్గాడలో విజిలెన్స్ సీఐ ఎన్వీ భాస్కరరావు, ఏఓ జి.శ్రీనివాస్ తదితరులు షాపుల్లో తనిఖీలు చేశారు. వేగులమ్మ గుడి సమీపంలో అనుమతి లేకుండా షాపు నిర్వహిస్తున్న గుండ్ర తమ్మయ్య షాపును తనిఖీ చేశారు. ఆ షాపులో రూ.85 వేల విలువైన 144 బస్తాల ఎరువులు, రూ.53 వేల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్టు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. సూర్యాఏజన్సీలో రూ.1.41 లక్షల విలువైన పురుగు మందులు అమ్మకాలను నిలుపుదల చేశామని, రూ.19 వేల విలువైన ఎరువులను సీజŒ æచేసినట్టు తెలిపారు. ఈ షాపులపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు. తనిఖీల్లో సిబ్బంది కోటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందులు, ఎరువుల దుకాణాల తనిఖీ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం) : జిల్లాలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అంతర్ జిల్లా అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. వ్యవసాయ శాఖ విజయనగరం జిల్లా డీడీ ఎస్బీ శవ్యానంద్, శ్రీకాకుళం జిల్లా రాజాం సహాయ వ్యవసాయ సంచాలకుడు సీహెచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో రాజానగరం, రాజమహేంద్రవరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలు, గోదాములపై ఈ దాడులు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలను తగ్గించడంతో దుకాణాదారులు ఏవిధంగా అమ్ముతున్నారనే విషయంపై ఆరా తీశారు. పాతస్టాకును పాత ధరలకే అమ్మాలని, విధిగా కొత్త, పాత ధరల పట్టికను దుకాణాలు ముందు ఉంచాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాల్లో ఎరువుల దుకాణాల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోరుకొండ ఏడీఏ డి.వెంకటకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్, ఏఈవోలు వేణుమాధవ్, పీటర్, రఘుకుమార్ పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
పాచిపెంట : మండల కేంద్రంలో రెండు ఎరువుల దుకాణాలతో పాటు చినబజార్ సెంటర్లోని పెస్టిసైడ్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు, నిల్వలను సరిపోల్చాచరు. రశీదు బుక్ సరిగ్గా లేకపోవడంతో శ్రీ కష్ణా ఎరువుల దుకాణంలో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. భూర త్రినాథ్ ఎరువుల షాపునకు సంబంధించి ప్రత్యేకంగా నిల్వలు ఉంచేందుకు గది నిర్మాణం చేపట్టాలని సూచించారు. చినబజార్ సెంటర్లో గల శ్రీసాయిరాం పెస్టిసైడ్స్ దుకాణానికి సంబంధించి ఓచర్లు సరిగ్గా లేకపోవడంతో రశీదులు వచ్చాక విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీడీ పి.వి.ఎస్.సి హరి, ఏడీఏ విజయకుమార్, ఏడీ చంద్రశేఖర్లతో పాటు పాచిపెంట వ్యవసాయాధికారి వి.వెంకటయ్య, ఎం.బాబ్జిలు పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ దాడులు: విత్తనాలు స్వాధీనం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే బోధన్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి... 1.60 లక్షల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement