-
శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా విజయంతో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో కీలక పాత్ర పోషించాడు. నజ్ముల్ హుస్సేన్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో శాంటో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 122 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముస్తిఫికర్ రహీమ్(73 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మధుషాన్, కుమారా తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో లియాంగే(67) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కుశాల్ మెండిస్(59) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం, టాన్జిమ్ హసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఛటోగ్రామ్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే? -
BAN vs SL: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ లాహిరు కుమార పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో కుమారకు చోటు దక్కింది. అతడితో పాటు బంగ్లాతో టీ20 సిరీస్లో అకట్టుకున్న కమిందు మెండిస్కు వన్డే జట్టులో కూడా చోటు దక్కింది. అదే విధంగా ఆల్రౌండర్ చమికా కరుణరత్నేకు ఛాన్నాళ్ల తర్వాత సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. ఇక వన్డే సిరీస్కు సైతం స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే బంగ్లాదేశ్తో ఆఖరి టీ20లో ఐదు వికెట్లతో చెలరేగిన నువాన్ తుషారాకు వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. మార్చి 13 నుంచి ఛటోగ్రామ్ వేదికగా ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్ను 2-1తో లంక సొంతం చేసుకుంది. శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, కమిన్నన్ల దస్సన, దిల్షన్ మదుషాన, దిల్షాన్ మదుషాన , సహన్ అరాచ్చిగే, చమిక కరుణరత్నే. -
SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్.. క్లీన్స్వీప్ చేసిన లంక
Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్లో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో అఫ్గాన్పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 48.2 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌటైంది. రహ్మత్ షా (65; 7 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (54; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి గెలిచింది. 25 ఏళ్ల పాతుమ్ నిసాంక (101 బంతుల్లో 118; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగా...అవిష్క ఫెర్నాండో (91; 10 ఫోర్లు, 5సిక్స్లు) శతకం చేజార్చుకున్నాడు. నంబర్వన్ ఆల్రౌండర్గా నబీ... ఐసీసీ వన్డే ఆల్రౌండర్స్ కొత్త ర్యాంకింగ్స్లో అఫ్గాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ నంబర్వన్ స్థానాన్ని అందుకున్నాడు. అతి పెద్ద వయసులో (39 ఏళ్ల ఒక నెల) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నబీ నిలిచాడు. 1739 రోజులు (మే 7, 2019నుంచి) నంబర్వన్ ఆల్రౌండర్ ర్యాంక్లో కొనసాగిన షకీబ్ అల్ హసన్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!.. టీమిండియా తర్వాత
వెస్టిండీస్తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్లో తమ 1000వ మ్యాచ్లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం. కాగా మంగళవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్ విండీస్తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇదే మొదటిసారి ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. టీమిండియా తర్వాత అదే విధంగా 2013లో వెస్టిండీస్తో మ్యాచ్లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్బెర్రా మ్యాచ్ ఆసీస్కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం. వెస్టిండీస్తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు. జేక్ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ 3-0తో వైట్వాష్ చేసింది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్ను ముంబై కెప్టెన్గా తప్పించాం.. కోచ్పై రితిక విమర్శలు -
ODI: ఆసీస్ బ్యాటర్ల విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం
వెస్టిండీస్పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రతాపం చూపించారు. మూడో వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డేల్లో మాత్రం కంగారూల చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రెండు వన్డేల్లో వరుసగా 8 వికెట్లు.. 81 పరుగులతో పరాజయం పాలైన షాయీ హోప్ బృందం.. తాజాగా ఆఖరి మ్యాచ్లోనూ ఓడి వైట్వాష్కు గురైంది. కాన్బెర్రా వేదికగా మనుకా ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పర్యాటక విండీస్ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. యువ పేసర్ జేవియర్ బ్రాట్లెట్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఏకంగా నాలుగు వికెట్లు తీయగా.. లాన్స్ మోరిస్, ఆడం జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. సీన్ అబాట్కు ఒక వికెట్ దక్కింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆసీస్కు ఓపెనర్లు జేక్ ఫ్రాసెర్ మెక్గర్క్, జోష్ ఇంగ్లిస్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విండీస్ బౌలింగ్లో పరుగుల విధ్వంసం సృష్టించారు. జేక్ 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్లతో 41 రన్స్ చేయగా.. ఇంగ్లిస్ 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్) సాధించాడు. ఇక జేక్ జోరుకు అల్జారీ జోసెఫ్ బ్రేకులు వేయగా.. వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2)ని ఒషానే థామస్ పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో ఇంగ్లిస్కు జతైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో 6.5 ఓవర్లలోనే 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆసీస్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. -
మొన్ననేమో సంచలనం.. ఇప్పుడు 86 పరుగులకే ఆలౌట్!
వెస్టిండీస్.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటుంది. అయితే మరోసారి వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కరేబియన్ బ్యాటర్లు ఘెరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ ఆథ్నాజ్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి చవిచూసిన విండీస్ ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయింది. అంతకుముందు గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో విండీస్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ అద్బుత ప్రదర్శనతో 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచారు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్లో రేణుక సింగ్తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం సాధ్యమే. -
ఆస్ట్రేలియాతో వన్డే.. భారత స్టార్ బౌలర్కు గాయం!
ఆస్ట్రేలియాతో మ్యాచ్ మధ్యలోనే భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా మైదానాన్ని వీడింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ప్లేయర్ పూజా వస్త్రాకర్ను ఢీకొట్టిన ఆమె తలనొప్పి కారణంగా ఫీల్డ్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్ను కన్కషన్ సబ్స్టిట్యూట్గా ప్రకటించింది బీసీసీఐ మేనేజ్మెంట్. కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో విజయం సాధించి చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ సిరీస్లో తొలి వన్డేను ఆసీస్ గెలిచింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శనివారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇతర స్పిన్నర్లు స్నేహ్ రాణా, శ్రెయాంక పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. పేస్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్కు ఒక వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వద్ద ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ బంతిని గాల్లోకి లేపగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న స్నేహ్ రాణా.. పూజా వస్త్రాకర్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో తలకు దెబ్బ తగలడంతో స్నేహ్ రాణా నొప్పితో విలవిల్లాడింది. ఈ క్రమంలో తీవ్ర తలనొప్పితో బాధపడిన ఆమెను స్కానింగ్కు పంపించగా.. హర్లిన్ డియోల్ ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అయితే, రాణా తిరిగి రావడంతో ఆమె అవసరం లేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో గాయపడటానికి ముందు నాలుగు ఓవర్లు బౌల్ చేసిన స్నేహ్ రాణా.. తిరిగి వచ్చిన తర్వాత తన కోటాలో మిగిలిన మిగిలిన ఆరు ఓవర్లు పూర్తి చేసి ఓ వికెట్ ఖాతాలో వేసుకుంది. కాగా ఐసీసీ నిబంధన ప్రకారం.. ఎవరైనా బ్యాటర్/బౌలర్ కన్కషన్(తలకు దెబ్బ తగలడం/బ్రెయిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసేలా గాయపడటం) కారణంగా దూరమైతే వారి స్థానంలో అవే నైపుణ్యాలున్న ప్లేయర్ను బరిలోకి దించాలి. అయితే, ఆల్రౌండర్తో సదరు ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేస్తే బ్యాటర్ ప్లేస్లో వేస్తే బ్యాటింగ్, బౌలర్ ప్లేస్లో వస్తే బౌలింగ్ మాత్రమే చేయాలి. ఇక్కడ స్నేహ్ రాణా స్పిన్నర్ కాగా.. హర్లిన్ డియోల్ పార్ట్టైమ్ స్పిన్నర్. ఇక ఈ మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచా ఘోష్ అద్భుత అర్ధ శతకంతో మెరిసింది. దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్కప్లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
‘టీమిండియాకు మరో నయా ఫినిషర్’.. దుమ్ములేపిన ఆల్రౌండర్.. కానీ
Update: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వాంఖడేలో 46.3 ఓవర్లలోనే టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్ వుమెన్ టీమ్. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దుమ్ములేపిన భారత ఆల్రౌండర్ ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ తొలి వన్డేలోనూ సత్తా చాటింది. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్ కేవలం 46 బంతుల్లోనే 62 పరుగులతో దుమ్ములేపింది. దీంతో టీమిండియా తరఫున మరో నయా ఫినిషర్ వచ్చేసిందంటూ అభిమానులు పూజా వస్త్రాకర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతగడ్డపై ఆసీస్తో ఏకైక టెస్టులో గెలుపొంది చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడేలో టాస్ గెలిచిన ఆతిథ్య టీమిండియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్లో ఓపెనర్ యస్తికా భాటియా 49 పరుగులతో రాణించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటైంది. ఇక వన్డౌన్లో వచ్చిన రిచా ఘోష్ 21 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న హర్మన్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా జెమీమా రోడ్రిగ్స్ పట్టుదలగా నిలబడి సంచలన ఇన్నింగ్స్తో మెరిసింది. 77 బంతుల్లో 82 పరుగులు సాధించింది. జెమీమా తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ 21, అమన్జోత్ కౌర్ 20, స్నేహ్ రాణా 1 పరుగులు చేశారు. దీంతో స్వల్ప స్కోరుకే భారత్ను కట్టడి చేయగలమన్న ఆస్ట్రేలియా ఆశలపై పూజా వస్త్రాకర్ నీళ్లు చల్లింది. ధనాధన్ ఇన్నింగ్స్తో.. రేణుకా ఠాకూర్ సింగ్(5- నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సత్తా చాటింది. యస్తికా, జెమీమా, పూజా అద్భుత బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డారిస్ బ్రౌన్, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్ ఒక్కో వికెట్ తీయగా.. ఆష్లే గార్డ్నర్, వెరెహాం తలా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. Pooja Vastrakar a fighter and new finisher for team India She scored 62 of 46 balls.Brilliant 👏#AUSvPAK #INDvSA #Dhoni #SENA #BBL13 #INDvAUS #BabarAzam #Shami #Abdullah #Prasidh #CricketTwitterpic.twitter.com/OaXDuyiXpx — Sujeet Suman (@sujeetsuman1991) December 28, 2023 -
తొలి సిరీస్ విజయం లక్ష్యంగా...
ముంబై: ఇటీవల టెస్టు ఫార్మాట్లో ఆ్రస్టేలియాపై తొలి విజయం అందుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్పై తొలిసారి సిరీస్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య గురువారం జరిగే తొలి మ్యాచ్తో మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. గతంలో ఆ్రస్టేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లలో భారత్కు నిరాశ ఎదురైంది. అయితే సొంతగడ్డపై ఈసారి టీమిండియా సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు ఆ్రస్టేలియాతో 50 వన్డేలు ఆడిన భారత్ కేవలం 10 మ్యాచ్ల్లో నెగ్గి, 40 మ్యాచ్ల్లో ఓడిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో ఈ సీజన్లో భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ గెలుపు రుచి చూసింది. అదే జోరు కొనసాగిస్తూ వన్డేల్లోనూ టీమిండియా సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్... బౌలింగ్లో రేణుక సింగ్, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా రాణిస్తే భారత్కు సిరీస్ విజయం దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు వరల్డ్ చాంపియన్ ఆ్రస్టేలియా ఏకైక టెస్టులో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో వన్డే సిరీస్లో బరిలోకి దిగనుంది. యాష్లే గార్డ్నర్, అలీసా హీలీ, తాలియా మెక్గ్రాత్, ఎలీస్ పెరీ, బెత్ మూనీ ఆటతీరుపై ఆసీస్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
నలుగురికి తొలిసారి చోటు
ముంబై: ఈనెల 28 నుంచి ముంబైలో ఆ్రస్టేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు సైకా ఇషాక్ (బెంగాల్), మన్నత్ కశ్యప్ (పంజాబ్), ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (కర్ణాటక), మీడియం పేస్ బౌలర్ టిటాస్ సాధు (బెంగాల్)లకు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు లభించింది. ఇంగ్లండ్తో ఇటీవల జరిగిన టి20 సిరీస్లో తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన 21 ఏళ్ల శ్రేయాంక, 28 ఏళ్ల సైకా ఇషాక్ మూడు మ్యాచ్ల్లో ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టి ఆకట్టుకున్నారు. మన్నత్, టిటాస్ సాధు ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఆ్రస్టేలియాతో మూడు వన్డేలు డిసెంబర్ 28, 30, జనవరి 2న వాంఖెడె స్టేడియంలో... మూడు టి20 మ్యాచ్లు జనవరి 5, 7, 9 తేదీల్లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు సిరీస్లలో భారత జట్లకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన వ్యవహరిస్తారు. వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది బృందంలో రెండు మార్పులతో టి20 జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో ఉన్న స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ స్థానాల్లో టి20 జట్టులో కనిక అహూజా, మిన్ను మణి వచ్చారు. భారత మహిళల వన్డే జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుక సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్. -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్!.. కెప్టెన్ దూరం! -
వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. ఒత్తిళ్ల కారణంగా: సంజూ
తన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల మీద మాత్రమే తాను దృష్టి పెడతానని టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. అంతేతప్ప తనకు తగిలిన ఎదురుదెబ్బల గురించి ఆలోచిస్తూ.. అందుకు కారణమైన వాళ్ల గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండిపోనని స్పష్టం చేశాడు. కాగా వన్డే ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్తో పోలిస్తే మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ సంజూకు వన్డే వరల్డ్కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. అంతకు ముందు కీలక సిరీస్లలోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్కు అన్యాయం జరుగుతోందంటూ బీసీసీఐపై ఇప్పటికే అనేకసార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు ఈ కేరళ బ్యాటర్. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన మూడు మ్యాచ్ల సిరీస్లో సంజూ కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాడు. అయితే, మొదటి రెండు వన్డేల్లో ప్రభావం చూపలేకపోయిన సంజూ శాంసన్.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. తద్వారా సిరీస్ టీమిండియా సొంతమైంది. ఇక ఎనిమిదేళ్ల కెరీర్లో సంజూకు ఇదే తొలి శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా క్రికెటర్గా.. మీడియా ఒత్తిడి, మైదానం లోపల.. వెలుపలా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కోల్పోకుండా ఉండటమే ముఖ్యం. నా మనసును ఎలా నియంత్రించుకోవాలన్న విషయం మీదే దృష్టి పెడతాను. బయట చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు. కానీ.. నేను మాత్రం ఎల్లప్పుడూ నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తాను. నా లోటుపాట్లు సరిదిద్దుకోవడం, వైఫల్యాలను అధిగమించడంపై ఫోకస్ చేస్తా. అంతేకానీ.. నేను మిస్సైన ఈవెంట్ల గురించి ప్రస్తావిస్తూ.. అందుకు కారణమైన వారి గురించి ఫిర్యాదులు చేస్తూ కూర్చోను. నా నైపుణ్యాలకు ఎలా సానపెట్టాలి? నేను ఓపికగా ఉండగలుగుతున్నానా? స్థాయికి తగ్గట్లు ఆడుతున్నానా? అన్న విషయాల గురించే ఆలోచిస్తా. విజయ్ హజారే ట్రోఫీలో కేరళ సారథిగా నేను ఎంతో కఠిన శ్రమకోర్చాను. ఆలోచనలను నియంత్రించుకుంటూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికలను అమలు చేశాను’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2023లో సంజూ ఎనిమిది మ్యాచ్లు ఆడి 293 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్కు ఎంపికయ్యాడు. చదవండి: టీమిండియాకు ఊహించని షాక్.. సూర్యకుమార్ గాయం తీవ్రం! నెలల పాటు.. -
పాట మొదలుకాగానే రాహుల్ అలా.. బదులిచ్చిన కేశవ్ మహరాజ్! వైరల్
KL Rahul-Keshav Maharaj stump-mic chat over 'Ram Siya Ram': టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, ప్రొటిస్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ జరిగిన సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది. కాగా సిరీస్ సొంతం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పర్ల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది భారత జట్టు. సంజూ సెంచరీతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ శతకం(108) బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించింది. అయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సౌతాఫ్రికా తడ‘బ్యా’టుకు లోనైంది. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి ప్రొటిస్ బ్యాటర్లు బెంబేలు పేసర్లు అర్ష్దీప్ సింగ్ నాలుగు, ఆవేశ్ ఖాన్ రెండు, ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ రెండు, అక్షర్పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 218 పరుగులకే సౌతాఫ్రికా కథ ముగియగా.. 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. మరో వీడియో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ అందులో ఏముందంటే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా 33.2 ఓవర్ వద్ద స్కోరు 177 ఉన్నపుడు టెయిలెండర్ కేశవ్ మహరాజ్ బ్యాటింగ్కు వచ్చాడు. రామ్ సీతా రామ్ ఆ సమయంలో స్టేడియం వద్ద బోలాండ్ పార్కులో.. ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేశారు. ఇది విన్న రాహుల్ వెంటనే మహరాజ్ వైపు చూస్తూ... నువ్వు బ్యాటింగ్కు వచ్చిన ప్రతిసారీ ఇలాగే చేస్తారు కదా అన్న ఉద్దేశంలో నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందనగా మహరాజ్ సైతం అవును అంటూ నవ్వుతూ క్రీజులో కుదురుకున్నాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్.. ‘‘సూపర్ జెయింట్స్ మధ్య సరదా సంభాషణ’’ అంటూ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. కాగా ఐపీఎల్లో లక్నో ఫ్రాంఛైజీకి రాహుల్ కెప్టెన్ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్(లక్నో)కు కేశవ్ మహరాజ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: టీమిండియాకు షాకులు.. స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లి? Super Giants banter 😂😂😂 >>>>>pic.twitter.com/k0DxIrRqLN — Lucknow Super Giants (@LucknowIPL) December 21, 2023 Watch Full Video 🕉️❤️👇👇 pic.twitter.com/U2pnTRAZWR — अर्पित 🇮🇳🕉️ (@arpitdealer) December 21, 2023 -
ఎనిమిదేళ్ల కెరీర్లో తొలి సెంచరీ.. దీని వల్ల సంజూ: గావస్కర్
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్పై క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. సౌతాఫ్రికాతో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని.. ఇకపై అతడి కెరీర్ ఊపందుకుంటుందని పేర్కొన్నాడు. కాగా 2015లో జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కేరళ బ్యాటర్ సంజూ శాంసన్కు టీమిండియాలో తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. అడపాదడపా ఛాన్స్లు వచ్చినా వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న అపవాదూ అతడిపై ఉంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ వికెట్ కీపర్కు సౌతాఫ్రికా పర్యటన రూపంలో సువర్ణావకాశం దక్కింది. ప్రొటిస్తో వన్డే సిరీస్కు ఎంపికైన సంజూ శాంసన్కు తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. రెండో మ్యాచ్లో 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, ట్రోఫీ కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. పర్ల్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో బ్యాటింగ్కు అనుకూలంగా లేని పిచ్పై.. సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ సంజూ శతక్కొట్టాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 108 పరుగులు సాధించాడు. ఇక సంజూ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 218 పరుగులకే ఆలౌట్ అయిన ప్రొటిస్ జట్టు వన్డే సిరీస్ను 1-2తో టీమిండియాకు సమర్పించుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా సంజూ ఎనిమిదేళ్ల కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీ.. అది కూడా సఫారీ గడ్డపై నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సెంచరీ అతడి కెరీర్ను మలుపు తిప్పుతుంది. నిజానికి సంజూ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. అయితే.. తనను తాను నిరూపించుకోవడంలో ఇన్నాళ్లు విఫలమయ్యాడు. సరైన సమయంలో తనలోని నైపుణ్యాలను బయటకు తీసి అద్భుతం చేశాడు. ఇతరులతో పాటు తనకు తానేంటో కూడా చూపించుకోగలిగాడు’’ అని సంజూను కొనియాడాడు. A dream realised, a landmark breached!#SanjuSamson batted out of his skin to bring up his maiden ODI 💯 in a crucial series decider! How important in this knock in the greater scheme of things? Tune-in to the 3rd #SAvIND ODI, LIVE NOW on Star Sports Network#Cricket pic.twitter.com/OjR5qN8aXZ — Star Sports (@StarSportsIndia) December 21, 2023 -
#INDvsSA : దక్షిణాఫ్రికా ఓటమి భారత్దే వన్డే సిరీస్ (ఫొటోలు)
-
భారత్దే వన్డే సిరీస్
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్లో సమంగా నిలిచిన భారత జట్టు వన్డే సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్లో విజయంతో 2–1తో సిరీస్ రాహుల్ బృందం సొంతమైంది. గురువారం జరిగిన మూడో వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (114 బంతుల్లో 108; 6 ఫోర్లు, 3 సిక్స్లు) వన్డేల్లో తొలి సెంచరీ సాధించగా, తిలక్ వర్మ (77 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 22.4 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టోనీ డి జోర్జీ (87 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మినహా మిగతా వారంతా విఫలం కావడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు. తిలక్ అర్ధ సెంచరీ... అరంగేట్ర మ్యాచ్లో వరుస బౌండరీలతో రజత్ పటిదార్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, సాయి సుదర్శన్ (10) విఫలమయ్యాడు. అయితే వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... రాహుల్ (21) కూడా ప్రభావం చూపలేకపోవడంతో భారత్ స్కోరు 101/3కి చేరింది. ఈ దశలో సామ్సన్, తిలక్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేయగా... సఫారీ బౌలర్లు పూర్తిగా కట్టిపడేయడంతో భారత్ ఒక్కో పరుగు కోసం శ్రమించాల్సి వచ్చింది. సామ్సన్ ఫర్వాలేదనిపించగా... హైదరాబాద్ బ్యాటర్ తిలక్ బాగా ఇబ్బంది పడ్డాడు. తొలి 38 బంతుల్లో కేవలం 9 పరుగులే చేసిన అతను ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఆ తర్వాత మెరుగ్గా ఆడిన అతను తర్వాతి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 43 పరుగులు సాధించి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నిలకడ కొనసాగించిన సామ్సన్ 110 బంతుల్లో కెరీర్లో తొలి శతకాన్ని (తన 16వ వన్డేలో) అందుకున్నాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో భారత్ మంచి స్కోరు సాధించగలిగింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: పటిదార్ (బి) బర్జర్ 22; సుదర్శన్ (ఎల్బీ) (బి) బ్యూరాన్ 10; సామ్సన్ (సి) రీజా (బి) విలియమ్స్ 108; రాహుల్ (సి) క్లాసెన్ (బి) ముల్దర్ 21; తిలక్ (సి) ముల్దర్ (బి) మహరాజ్ 52; రింకూ (సి) రీజా (బి) బర్జర్ 38; అక్షర్ (సి) ముల్దర్ (బి) బ్యూరాన్ 1; సుందర్ (సి) మార్క్రమ్ (బి) బ్యూరాన్ 14; అర్‡్షదీప్ (నాటౌట్) 7; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 22; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 296. వికెట్ల పతనం: 1–34, 2–49, 3–101, 4–217, 5–246, 6–255, 7–277, 8–293. బౌలింగ్: బర్జర్ 9–0–64–2, విలియమ్స్ 10–0–71–1, బ్యూరాన్ హెన్డ్రిక్స్ 9–0–63–3, ముల్దర్ 7–0–36–1, మహరాజ్ 10–2–37–1, మార్క్రమ్ 5–0–19–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెన్డ్రిక్స్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 19; జోర్జి (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 81; డసెన్ (బి) అక్షర్ 2; మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సుందర్ 36; క్లాసెన్ (సి) సుదర్శన్ (బి) అవేశ్ 21; మిల్లర్ (సి) రాహుల్ (బి) ముకేశ్ 10; ముల్దర్ (సి) రాహుల్ (బి) సుందర్ 1; మహరాజ్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 14; బ్యూరాన్ (సి) సామ్సన్ (బి) అవేశ్ 18; విలియమ్స్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 2; బర్జర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–59, 2– 76, 3–141, 4–161, 5–174, 6–177, 7–192, 8–210, 9–216, 10–218. బౌలింగ్: ముకేశ్ 9–0 –56–1, అర్‡్షదీప్ 9–1–30–4, అవేశ్ 7.5–0–45– 2, సుందర్ 10–0–38–2, అక్షర్ 10–0–48–1. -
రుతురాజ్ స్థానంలో ఎంట్రీ.. అరంగేట్రంలో ఇలా! అదే హైలైట్
One for future: Rajat Patidar Cameo: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు భారత బ్యాటర్ రజత్ పాటిదార్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం కావడంతో అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చీ రాగానే మెరుగైన ఇన్నింగ్స్తో తన మార్కు చూపించాడు. కాగా పర్ల్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఉన్నది కాసేపే అయినా ఈ క్రమంలో రజత్ పాటిదార్.. సాయి సుదర్శన్తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని 22 పరుగులు సాధించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన పాటిదార్.. రెండో ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు. అదే ఓవర్లో ఐదో బాల్కు మరో ఫోర్తో అలరించాడు. ఇక ఐదో ఓవర్ మొదటి బంతికి అద్భుత రీతిలో పాటిదార్ సిక్స్ బాదడం హైలైట్గా నిలిచింది. అయితే అదే ఓవర్లో మూడో బంతికి మరో బౌండరీ బాదిన రజత్ పాటిదార్.. ఆ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. ప్రొటిస్ పేసర్ నండ్రే బర్గర్ బౌలింగ్లో బిగ్ షాట్కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అరంగేట్రంలో మొత్తంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 22 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడంటూ రజత్ పాటిదార్పై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లలో కూడా రజత్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు. 30 ఏళ్ల వయసులో అరంగేట్రం మధ్యప్రదేశ్కు చెందిన రైట్హ్యాండ్ బ్యాటర్ రజత్ పాటిదార్. దేశవాళీ క్రికెట్లో గత ఎనిమిదేళ్లుగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యాభై ఓవర్ల క్రికెట్లో పాటిదార్కు మంచి రికార్డు ఉంది. లిస్ట్- ఏ క్రికెట్లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్లు ఆడిన అతడు రెండు వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. టీ20లలోనూ అతడికి మెరుగైన రికార్డు ఉంది. మధ్యప్రదేశ్ తరఫున 148.55 స్ట్రైక్రేటుతో 1640 పరుగులు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో అదరగొడుతున్న పాటిదార్ను ఐపీఎల్ వేలం-2021 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్లు ఆడిన రజత్ పాటిదార్ 404 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఐపీఎల్2024లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగనున్నాడు. What a shot from #RajatPatidar for his 1st ODI boundary! Another fearless debutant shows supreme confidence 👏 Tune-in to the 3rd #SAvIND ODI LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/CdtklTD9bs — Star Sports (@StarSportsIndia) December 21, 2023 -
సమష్టిగా రాణిస్తేనే...
పార్ల్: సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్ సాధించాలనే లక్ష్యంతో... నేడు దక్షిణాఫ్రికాతో జరిగే చివరిదైన మూడో మ్యాచ్లో భారత్ బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమిండియా తొలి వన్డేలో ఘనవిజయం సాధించినా... రెండో వన్డేలో మాత్రం తడబడింది. బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ రెండు మ్యాచ్ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆకట్టుకోలేకపోయారు. తొలి మ్యాచ్లో అర్‡్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ అదరగొట్టగా... ముకేశ్ కుమార్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడో మ్యాచ్లో భారత్ గెలవాలంటే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఫామ్ కోల్పోయిన తిలక్ వర్మ స్థానంలో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు రెండో వన్డేలో సాధించిన విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్ టోని జోర్జి సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చాడు. మార్క్రమ్, రీజా హెన్డ్రిక్స్, క్లాసెన్, డసెన్, మిల్లర్ కూడా రాణిస్తే ఆ జట్టు మరో విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. మూడో మ్యాచ్ వేదికైన పార్ల్లో భారత్పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. గత ఏడాది ఈ వేదికపై భారత్తో జరిగిన రెండు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. -
‘సిక్సర్ల’ కింగ్ రింకూ.. 26 ఫోర్లు, 14 సిక్స్లు! తనకు తానే పోటీ
India vs South Africa ODI Series 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20లలో అదరగొట్టిన టీమిండియా ‘నయా ఫినిషర్’ రింకూ సింగ్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో రెండో వన్డే సందర్భంగా ఈ యూపీ కుర్రాడు ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైపోయింది. టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యే క్రమంలో అయ్యర్ సౌతాఫ్రికాతో రెండు, మూడు వన్డేలకు దూరం కానున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని రింకూతో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ ఫిక్సైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రొటిస్తో తొలి వన్డే సందర్భంగా తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అజేయ అర్ద శతకంతో రాణించి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కాబట్టి రెండో వన్డేలోనూ ఓపెనర్గా సాయి తన స్థానం సుస్థిరం చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ కారణంగా రింకూకు కూడా మార్గం సుగమైనట్లు తెలుస్తోంది. రింకూకు తెలిసిందిదే ఈ నేపథ్యంలో రింకూ సింగ్ గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు దక్కించుకున్నాడు. బాల్ను చూడటం, బలంగా బాదడం.. రింకూకు తెలిసిందిదే. ఇలాంటి దూకుడైన ఆటతో దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ఎన్నో విజయాలు అందించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అండర్–19 జట్టులోనూ చోటు సంపాదించాడు. అప్పటి నుంచి తన కెరీర్ మరో మలుపు తిరిగింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీ షాట్లు కొట్టడం, ప్రత్యర్థి బౌలర్ ఏ స్థాయి వాడైనా.. అతడిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రింకూ బలాలు. ఇలాంటి అద్భుత నైపుణ్యాలున్న బ్యాటర్ను వదులుకోవడానికి ఏ జట్టు మాత్రం ఇష్టపడుతుంది? యూపీ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రింకూ సింగ్ 17 ఏళ్ల వయసులోనే సీనియర్ వన్డే, టీ20 టీమ్లో చోటు సంపాదించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఈ క్రమంలో త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు సాధించడం అతడి ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచింది. ఈ మ్యాచ్ జరిగిన రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కింది రింకూకు! ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.. దేశవాళీ వన్డే, టీ20, ఫస్ట్క్లాస్ ఫార్మాట్లలో ఈ లెఫ్టాండర్ ప్రధాన ప్లేయర్గా మారిపోయాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రింకూ సింగ్పై ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టి పడింది. సెలక్షన్ క్యాంపులలో తన టాలెంట్ నిరూపించుకున్న రింకూను తొలుత 2017లో పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. రూ. 10 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అయితే ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో 2018 ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో బరిలో దిగిన రింకూను కోల్కతా నైట్రైడర్స్ ఎవరూ ఊహించని రీతిలో రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. రింకూ కెరీర్ను మార్చివేసే ఘట్టానికి పునాది అక్కడే పడింది. అప్పటి నుంచి సిక్సర్ల కింగ్గా కేకేఆర్ కొనుగోలు చేసిన తర్వాత మూడు ఎడిషన్ల పాటు రింకూ అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అడపాదడపా అవకాశాలు వచ్చినా వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రింకూ.. గతేడాది నుంచి ఫినిషర్గా రాటుదేలాడు. లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్ను గెలిపించడం రింకూ కెరీర్లో హైలైట్గా నిలిచింది. ఈ సంచలన ప్రదర్శన రింకూను సిక్సర్ల కింగ్గా మార్చడమే గాకుండా.. టీమిండియాలో టీ20 జట్టులో అడుగుపెట్టే సువర్ణావకాశాన్నీ ఇచ్చింది. ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ సందర్భంగా 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. 8 ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 262 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు: 68. మొత్తం 26 ఫోర్లు, 14 సిక్సర్లు ఇక రింకూ ఇప్పటి వరకు సాధించిన మొత్తం పరుగుల్లో 26 ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న రింకూ టీ20లలో తనను తాను నిరూపించుకున్నాడు. కఠిన సవాళ్లు విసిరే సఫారీ గడ్డపై తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇక ప్రొటిస్ జట్టుతో మంగళవారం రెండో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ రింకూ ఎంట్రీ ఇవ్వడం లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్బై... ముంబై ఇండియన్స్లో ఏమవుతోంది? -
ముఖం మీదే డోర్ వేసేశాడు! పాపం రుతురాజ్.. వీడియో వైరల్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. టీమ్ బస్ డ్రైవర్ అతడి పట్ల వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సఫారీ గడ్డపై టీ20 సిరీస్ను సమం చేసిన భారత జట్టు.. వన్డేలను విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. జొహన్నస్బర్గ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టీమిండియా యువ పేసర్ల ధాటికి ప్రొటిస్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫాస్ట్బౌలర్లు అర్ష్దీప్ సింగ్ ఐదు, ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 27.3 ఓవర్లనే సఫారీల కథ ముగిసింది. భారత బౌలర్ల విజృంభణతో ఆతిథ్య జట్టు కేవలం 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పది బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, అరంగేట్ర ఓపెనర్ సాయి సుదర్శన్ 55(నాటౌట్), శ్రేయస్ అయ్యర్(52) అర్ధ శతకాలు బాదడంతో 16.4 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ను ఛేదించింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసిన రాహుల్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో.. తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యాన్ని టీమ్ బస్ డ్రైవర్తో ముడిపెడుతూ చేస్తున్న మీమ్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ఫోన్లో మాట్లాడుతూ.. రుతురాజ్ బస్ ఎక్కేందుకు సిద్ధం కాగా డ్రైవర్ డోర్ను మూసేశాడు. అంతేకాదు.. బయటే ఉండు అన్నట్లు సైగ కూడా చేసినట్లుగా కనిపించింది. దీంతో రుతు బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘రుతురాజ్ ఈరోజు మ్యాచ్లో బాగా ఆడడని తెలిసే.. ఇక బస్సెక్కాల్సిన పనిలేదని డ్రైవర్ ఇలా చేశాడు’’ అంటూ కొందరు.. ‘‘చెత్తగా ఆడాడు కాబట్టే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇలా డోర్లు మూయించాడు’’ అని మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. కాగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెయింట్ జార్జ్ పార్కులో మంగళవారం రెండో వన్డే జరుగనుంది. Meme got real 😂😂 Bus driver mistakenly closes the door when Ruturaj Gaikwad was about to enter. 😁 pic.twitter.com/y2KFfGtScb — All About Cricket (@allaboutcric_) December 17, 2023 When you are 5 seconds late and bus driver is Shakib Al Hasan pic.twitter.com/7x1JbXvjgR — Sagar (@sagarcasm) December 17, 2023 -
అర్ష్దీప్, అవేశ్ అదుర్స్
వాండరర్స్ వేదికపై ఆఖరి టి20లో ధనాధన్ మెరుపులతో సునాయాసంగా 200 పైచిలుకు పరుగులు చేసిన భారత్... తర్వాత సఫారీ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి మ్యాచ్ గెలిచింది. సిరీస్ను సమం చేసింది. మారని వేదికపై మారిన ఫార్మాట్లో అలాంటి విజయంతోనే టీమిండియా వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. అయితే ఇందులో ముందు దక్షిణాఫ్రికాను కుప్ప కూల్చేసి తర్వాత సులువైన లక్ష్యాన్ని టీమిండియా చకచకా ఛేదించేసింది. ఈ గెలుపుతో భారత్ మూడు వన్డేల సిరీస్లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే రేపు పోర్ట్ ఎలిజబెత్లో జరుగుతుంది. జొహన్నెస్బర్గ్: పేస్ బౌలర్లు అర్ష్ దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27)ల అసాధారణ స్పెల్... అరంగేట్రం మ్యాచ్లోనే సాయి సుదర్శన్ (43 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), సీనియర్ శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు.. వెరసి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో వరుసలో బ్యాటింగ్కు దిగిన ఫెలుక్వాయో (49 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్! అనంతరం భారత్ 16.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. కెరీర్లోని తొలి మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అర్ష్ దీప్ తన నాలుగో వన్డేలో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్ బౌలర్గా అర్ష్ దీప్ గుర్తింపు పొందాడు. ఆ నలుగురితోనే... ముందు బౌలింగ్లో ఆ తర్వాత బ్యాటింగ్లో ఇద్దరిద్దరు చేసిన ప్రదర్శనతో టీమిండియా గర్జించింది. టాస్ గెలవగానే బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాపై అర్ష్ దీప్ తన తొలిఓవర్ (ఇన్నింగ్స్ రెండో)లోనే చావుదెబ్బ తీశాడు. వరుస బంతుల్లో హెన్డ్రిక్స్ (0), డసెన్ (0)లను డకౌట్ చేశాడు. అడపాదడపా ఫోర్లు, సిక్స్లు కొడుతున్న మరో ఓపెనర్ టోని డి జోర్జి (28; 2 ఫోర్లు, 2 సిక్స్లు)ని కూడా అర్ష్ దీప్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కుదేలైంది. ఆ తర్వాత పదో ఓవర్ ఆఖరి బంతికి క్లాసెన్ (6)నూ అతనే పెవిలియన్ చేర్చితే... 11వ ఓవర్ తొలి రెండు బంతుల్లో అవేశ్... మార్క్రమ్ (12), ముల్డర్ (0)లను పడగొట్టడంతో 52 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఫెలుక్వాయో చేసిన ఆ కాస్త పోరాటంతో సఫారీ వంద పైచిలుకు స్కోరు చేయగలిగింది. సాయి, అయ్యర్ ఫిఫ్టీ–ఫిఫ్టీ రుతురాజ్ (5) విఫలమైనా... సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఆతిథ్య బౌలర్లపై పరుగుల భరతం పట్టడంతో ఏ దశలోనూ భారత్కు ఇబ్బందే ఎదురవలేదు. ఇద్దరు బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే భారత్ 8.4 ఓవర్లో 50 పరుగుల్ని, 15.1 ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. 16వ ఓవర్లోనే సుదర్శన్ 41 బంతుల్లో... అయ్యర్ 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. లక్ష్యానికి చేరువయ్యాక అయ్యర్ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తిలక్ వర్మ (1 నాటౌట్)తో సాయి సుదర్శన్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. 253 భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 253వ ప్లేయర్గా తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల సాయి సుదర్శన్ గుర్తింపు పొందాడు. 116 స్వదేశంలో వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుకిదే అత్యల్ప స్కోరు. 2018లో సెంచూరియన్లో భారత్పైనే దక్షిణాఫ్రికా 118 పరుగులకు ఆలౌటైంది. 17 భారత్ తరఫున అరంగేట్రం వన్డేలోనే అర్ధ సెంచరీ చేసిన 17వ ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. 6 వన్డే మ్యాచ్లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు నాలుగు అంత కంటే ఎక్కువ వికెట్ల చొప్పున తీయడం ఇది ఆరోసారి మాత్రమే. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; టోని (సి) రాహుల్ (బి) అర్ష్ దీప్ 28; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (బి) అవేశ్ 12; క్లాసెన్ (బి) అర్ష్ దీప్ 6; మిల్లర్ (సి) రాహుల్ (బి) అవేశ్ 2; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; ఫెలుక్వాయో (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 33; కేశవ్ (సి) రుతురాజ్ (బి) అవేశ్ 4; బర్గర్ (బి) కుల్దీప్ 7; షమ్సీ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 13; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–42, 4–52, 5–52, 6–52, 7–58, 8–73, 9–101, 10–116. బౌలింగ్: ముకేశ్ 7–0–46–0, అర్ష్ దీప్ 10–0–37–5, అవేశ్ 8–3–27–4, కుల్దీప్ 2.3–0–3–1. భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముల్డర్ 5; సాయి సుదర్శన్ (నాటౌట్) 55; అయ్యర్ (సి) మిల్లర్ (బి) ఫెలుక్వాయో 52; తిలక్వర్మ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 117. వికెట్ల పతనం: 1–23, 2–111. బౌలింగ్: బర్గర్ 5.4–1–35–0, ముల్డర్ 4–0–26–1, కేశవ్ 3–0–19–0, షమ్సీ 3–0–22–0, ఫెలుక్వాయో 1–0–15–1. -
న్యూజిలాండ్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాదేశ్ ఓటమి
బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. బంగ్లా కెప్టెన్ షాంటో టాస్ గెలచి తొలుత న్యూజిలాండ్ను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 30 ఓవర్లకు కుదించాడు. నిర్ణీత 30 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(84 బంతుల్లో 105, 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ లాథమ్(92) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం రెండు, మెహది హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మిగితా నాలుగు వికెట్లు కూడా రనౌట్లే కావడం గమనార్హం. అనంతం డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్ను 30 ఓవర్లలో 245 పరుగులగా నిర్ణయించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో అనముల్ హక్(43) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో సోధీ, మిల్నీ, క్లార్క్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ENG vs WI: ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
Anchor Sreemukhi: ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement