-
నితిన్ను పెళ్లికి ఆహ్వానించిన యంగ్ హీరో..!
త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు మన యంగ్ హీరో. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్లో జరగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరీకీ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. -
నితిన్ రాబిన్ హుడ్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘రాబిన్ హుడ్’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారట. శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. మేకర్స్. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది.. అన్నట్టే చేసింది... దేశమంత కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు... ఆభరణాలేసుకున్నోళ్లంత నా అక్క చెల్లెళ్ళు... అవసరం కొద్ది వాళ్ల జేబుల్లో చేతులు పెడితే... ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు... అయినా నేను హర్ట్ అవ్వలేదు... ఎందుకంటే అయినవాళ్ల దగ్గర తీసుకోవడం నా హక్కు... మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
'నా వాళ్లే అనుకుంటే కేసులు పెడుతున్నారు'.. ఆసక్తి పెంచుతోన్న గ్లింప్స్!
గతేడాది ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకించాడు నితిన్. ఈ చిత్రంలో అతనికి జోడీగా శ్రీలల నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నితిన్ ప్రస్తుతం మరో చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిస్తున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు టైటిల్ కూడా రివీల్ చేసేశారు. గ్లింప్స్ చూస్తే ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాబిన్హుడ్ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥 Say hello to your new family member - #ROBINHOOD ❤️🔥 Title reveal glimpse out now! - https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD — Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024 -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
టార్గెట్ 2024.. ఈ సారైనా హిట్ కొడతారా?
గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే...ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి..హిట్ ట్రాక్ మీదికి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు..? యంగ్ హీరో నితిన్..2022 లో మాచర్ల నియోజక వర్గంతో వచ్చి నిరాశ పడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు .. ఇది బెడిసికొట్టింది. అందుకే తనకు అచ్చోచ్చిన ఎంటర్టైనర్ నమ్ముకొని గత ఏడాది..ఎక్ట్రా ఆర్డనరి మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కాని ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. (చదవండి: క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?) అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పొతినేని రామ్...ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూల్లు రాబట్టాడు.దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్తో వచ్చాడు. 2022 లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కంద తో గత ఏడాది మరోసారి మాస్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియోలో ట్రోల్స్ కు గురి అయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదికి వస్తాడేమో చూడాలి. (చదవండి: దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!) నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావటం లేదు.థాంక్యూ మూవీతో పాటు..కస్టడీతో ..ప్లాపులు చూశాడు.ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తున్నాడు. చందు మోండెటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ హీరోలతో పాటు..విజయ్ దేవరకొండ,నిఖిల్,మంచు విష్ణు లాంటి కథాయకులతో పాటు...కుర్ర హీరోలు..వైష్ణవ్ తేజ్ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న నితిన్ కొత్త సినిమా..స్ట్రీమింగ్ అప్పుడే!
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 8న థియేటర్స్లో రిలీజై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. దర్శకుడు వక్కంతం వంశీ కమర్షియల్స్ ఎలిమెంట్స్ మెండుగా ఉండేలా జాగ్రత్త పడ్డప్పటికీ.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. కామెడీ బాగున్నా.. కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకయింది. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి చివరివారం లేదా సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని తొలుత భావించారట. కానీ సినిమాకు హిట్ టాక్ రాకపోవడంతో.. అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి మొదటి వారంలోనే ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి వీక్ ప్రారంభంలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. -
Extra Ordinary Man Movie Wallpapers: నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ స్టిల్స్
-
సలార్తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా'. ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ తేదీని మొదట డిసెంబర్ 23న ప్రకటించారు. కానీ ఆ తర్వాత విడుదల తేదీ మార్చారు. దీనిపై నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడారు. సలార్ రావడం వల్లే రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..'నాని హాయ్ నాన్న సినిమా మొదట డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఉంది. మా సినిమా కూడా 23న అనుకున్నాం.. కానీ అదే సమయంలో ప్రభాస్ సలార్ వచ్చింది. అందుకే మేం రిలీజ్ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా రావడంతోనే మేం తప్పుకున్నాం. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. అందుకు అనుగుణంగానే సర్దుకున్నాం. ఒక రోజు ముందు నాని 7వ తేదీన వచ్చేస్తున్నాడు. మేం 8న వస్తున్నాం. అంతే కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ తర్వాత డేట్స్ కుదరవని ముందే రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. -
ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్
టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్ట్లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్ టాక్. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో ఒక్క డైలాగ్తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. (చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు. -
నితిన్ ‘ఎక్స్ట్రా’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆ హీరోయిన్స్ తో బాగా కంఫర్ట్ గా ఉంటుంది: హీరో నితిన్
-
టాలీవుడ్ హీరోకు ఎంఎస్ ధోని గిఫ్ట్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ హీరో నితిన్ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్ట్రార్డీనరీ మ్యాన్ అంటూ అభిమానులను పలకరించునున్నారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే హీరో నితిన్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. తాజాగా ట్విటర్లో ఓ ఫోటోను నితిన్ పంచుకున్నారు. అందులో ఓ టీ షర్ట్ను చేతిలో పట్టుకుని కనిపించారు. ఎక్స్ట్రార్డీనరీ మ్యాన్ నుంచి ఎక్స్ట్రార్డీనరీ గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ టీ షర్ట్ను టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పంపించారంటూ ట్వీట్ చేశారు. కాగా.. నితిన్ నటించిన ఎక్స్ట్రార్డీనరీ డిసెంబర్ 8న థియేటర్లలో సందడి చేయనుంది. EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu @msdhoni sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe — nithiin (@actor_nithiin) November 29, 2023 -
Extra - Ordinary Man Trailer Launch: నితిన్ ‘ఎక్స్ట్రా’ మూవీ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
ఆ నెలలోనే వరుణ్- లావణ్య పెళ్లి.. అతిథుల లిస్ట్లో టాలీవుడ్ జంట!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేడుక మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి. ఇప్పటికే పెళ్లి తేదీపై చాలా ఇంటర్వ్యూల్లో వరుణ్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. పెళ్లి తేదీ ఇంకెప్పుడు ప్రకటిస్తారంటూ ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీని అమ్మ నిర్ణయిస్తుందని ఇటీవల ఓ ఇంటరాక్షన్ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్-లావణ్య వివాహాం జరిగేలా కనిపిస్తోంది. (ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!) అయితే ఇప్పుడు వేదికతో పాటు ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖుల ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. వరుణ్, లావణ్యకు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, స్నేహితులు చాలామందే ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథుల లిస్ట్లో హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్తో పాటు ఇతర నటీనటులు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖుల గెస్ట్ లిస్ట్ గురించి మరిన్నీ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి వేదికతో పాటు తేదీ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ పెళ్లికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 9న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. (ఇది చదవండి: లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్! ) -
దిల్ రాజు నయా ప్లాన్.. నాని ప్లేస్లో నితిన్, వర్కౌట్ అయితే కాసుల వర్షమే!
టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసి సక్సెస్ అందుకుంటున్నారు హీరోలు..దర్శకులు. అందుకే ఈ మధ్య దర్శకులు సీక్వెల్ కి లీడ్ ఉండేలా క్లైమాక్స్ ప్లాన్ చేసున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సీక్వెల్ మూవీ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సినిమాలో నటించింది ఒక హీరో అయితే...సీక్వెల్ లో నటించబోయేది మరో హీరో అని తెలుస్తుంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన సినిమా ఎం.సి.ఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమాలో నాని, సాయిపల్లవి జంటగా నటించగా...భూమిక ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లు వసూళ్లు చేసింది. నాని కెరీర్ లో ఎం.సి.ఎ బెస్ట్ మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లో వకీల్ సాబ్ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఫుల్ బిజీ అయిపోతాడనుకుంటే...సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పలేదు. అయితే ఈ గ్యాప్ లో వేణు శ్రీరామ్ స్టోరీస్ తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నాడనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ తన దర్శకత్వంలో హిట్ అయిన ఎం.సి.ఎ మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కబోతుందని తెలిసింది. అయితే ఈ ఎం.సి.ఎ సీక్వెల్ లో నాని బదులు యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడట. దిల్ రాజు ముందుగా హీరో నానికి ఈ సీక్వెల్ మూవీ ఆఫర్ చేశాడట. అయితే ఇతర సినిమాలతో బిజిగా ఉండటం వల్ల చేయలేనని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎం.సి.ఎ సీక్వెల్ ఆఫర్ నితిన్ కి చేరింది. ప్రస్తుతంనితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మాస్ హీరోగా ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకి తీసుకువెళ్లాడు నితిన్. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా ఓ మూవీలో నటించనున్నారు. భీష్మ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన నితిన్...దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ..డైరెక్టర్ వేణుశ్రీరామ్ కి నితిన్ తో మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్...నితిన్ కి ఎం.సి.ఎ మూవీ సీక్వెల్ స్టోరీ చెప్పి ఎస్ అనిపించుకున్నాడట. వక్కంతం వంశీ సినిమా అయిపోయాక.. నితిన్-వేణు శ్రీరామ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే మాట టి.టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ మరో వారం రోజుల్లో అవకాశం ఉంది. -
మ..మ..మాస్ అంటున్న యంగ్ హీరోలు
చిత్రపరిశ్రమలో మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు, ఆ హీరోలకు ఉండే క్రేజే వేరు. మాస్ హీరోల సినిమాలు విడుదలయితే థియేటర్స్లో దద్దరిల్లిపోవాల్సిందే. క్లాస్ మూవీస్ ఎన్ని చేసినా రాని ఇమేజ్ ఒక్క మాస్ మూవీతో వస్తుంది. ఆ హీరో మార్కెట్తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా డబుల్ అయిపోతుంది. అందుకే ఏ హీరో అయినా మాస్ హీరో అనిపించుకోవడానికే ట్రై చేస్తాడు. ఇప్పుడు మన టాటీవుడ్ యంగ్ హీరోలంతా మాస్ ఇమేజ్పై ఫోకస్ చేశారు. ఊరమాస్ కథలను ఎంచుకుంటూ క్లాస్ నుంచి మాస్కు షిఫ్ట్ అవుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉన్నాడు. అష్టాచమ్మా నుంచి అంటే సుందరానికి.. వరకు నాని చేసిన సినిమాలన్ని క్లాస్ కథలకు సంబంధించినవే. ఇప్పటి వరకు నాని ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ చేయలేదు. కృష్ణార్జున యుద్దంలో మాస్ గెటప్లో కనిపించినా.. అది వర్కౌట్ కాలేదు. ఈ సారి నాని తన రూటుని మార్చాడు. ప్రేక్షకులకు తనలోని ఊరమాస్ని పరిచయం చేసేందుకు ‘దసరా’తో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్లో నాని గెటప్ అదిరిపోయింది. తెలంగాణ భాషలో నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే నాని మాస్ సినిమాల కౌంట్ పెంచే చాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు కేరీర్ స్టార్టింగ్లో మాస్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని.. మధ్యలో క్లాస్కి షిఫ్ట్ అయ్యాడు. ఆయన హీరోగా తెరకెక్కిన క్లాస్ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ మాస్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత వరుసగా రెడ్, ది వారియర్ అనే మాస్ సినిమాలు చేశాడు. అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సారి మాస్లో మాస్టర్స్ చేసిన బోయపాటితో రామ్ జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఓ మాస్ మూవీ తెరకెక్కుతుంది. ఇక హీరో నితిన్ కూడా మాస్ సినిమాలవైపే మొగ్గు చూపుతున్నాడు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో మాస్ ఫ్లేవర్ చూపించిన నితిన్.. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో కంప్లీట్ మాస్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా పిరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోయే సినిమా కూడా పక్కా మాస్ మూవీ అనే మాట ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ కూడా మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్తో అఖిల్.. ‘కస్టడీ’తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. హీరో నితిన్ న్యూ లుక్
స్టార్ హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. నితిన్కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది. అయితే తాజాగా హీరో నితిన్ న్యూ లుక్లో దర్శనమిచ్చాడు. అంజనేయస్వామి స్వామి దీక్ష ధరించి కనిపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీక్ష ధరించిన దుస్తుల్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. బాబాయ్ హోటల్ ప్రారంభించిన నితిన్ హైదరాబాద్లో బాబాయ్ హోటల్ బ్రాంచ్ను నితిన్ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్ను హైద్రాబాద్లోని మణికొండకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ పాల్గొన్నారు. Sri Anjaneyam 🙏🙏 Sarvadha Jayam..!! Enjoy ur Aadhivaaram 🤗🤗 pic.twitter.com/JUn0zNnsHi — nithiin (@actor_nithiin) January 22, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో నితిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, కేథరిన్ థ్రేసా జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. తొలి షో నుంచే ఫ్లాప్టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (చదవండి: కలెక్టర్గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ అందుకున్న హీరో ఫ్యాక్షన్ను తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ నటించారు. ఈ చిత్రం ఓటీటీలో చాలా ఆలస్యంగా వచ్చింది. -
Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖు లను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో శనివారం మధ్యాహ్నం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్తో, సాయంత్రం సినీ నటుడు నితిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారు బీజేపీలో చేరుతారా, లేక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ, సాంస్కృతిక అంశాలపై... శనివారం రాత్రి నోవాటెల్కు వచ్చిన సినీ నటుడు నితిన్ జేపీ నడ్డాతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ హీరోగా నితిన్ ఎదగడాన్ని జేపీ నడ్డా అభినందించారని.. సినిమా శక్తివంతమైన మాధ్యమమని, ప్రజల్లో మార్పునకు ఒక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారని తెలిపాయి. తాను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొంది అభిమానిగా మారానని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని నితిన్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణలో ఈ రోజు ప్ర ముఖ నటుడు నితిన్ను కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించీ చెప్పారు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను..’’అని తన ట్వీట్లో నడ్డా పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం: మిథాలీరాజ్ ప్రధాని మోదీ హయాంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని నడ్డాతో భేటీలో మిథాలీరాజ్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో శిక్షణ, మౌలిక వసతుల కల్పన పెరిగిందని.. క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. 20ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న తనకు క్రీడారంగంలో గత 8 ఏళ్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మునుగోడు’పై పకడ్బందీ కార్యాచరణ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచించారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీకి ప్రజా మద్దతును కూడగట్టాలని ఆదేశించారు. ప్రచారానికి ఓకే అన్న మిథాలీరాజ్, నితిన్: కె.లక్ష్మణ్ నితిన్, మిథాలీరాజ్లతో నడ్డా జరిపిన భేటీల్లో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారని కె.లక్ష్మణ్ చెప్పారు. మోదీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని.. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని వారు కోరారని.. దీంతో వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని నడ్డా తనకు సూచించారని తెలిపారు. చదవండి: (జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ) -
‘మాచర్ల నియోజకవర్గం’మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ సాంగ్లో నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘మాచర్ల నియోజకవర్గం’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్ట్ 12)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ► సినిమా వేరే లెవల్లో ఉందని.. మాస్ ఎంటర్టైనర్ అని ఓ అభిమాని ట్విటర్లో కామెంట్ చేశాడు. #MacherlaNiyojakavargam Vere level 💥💥 — Sanjay Saahu 🦅 💎 (@MikePanja) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్ సినిమాకు చాలా కీలకమని ఓ అభిమాని పేర్కొన్నాడు. 1 hr into the movie… Not much going on story wise but @vennelakishore comedy keeps up the movie 👍… Interval and second half will be crucial #MacherlaNiyojakavargam — Rakita (@Perthist_) August 12, 2022 ► సినిమాలో కొత్తదనం లేదని, రొటీన్ స్క్రిప్ట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఫస్టాఫ్ మరీ యావరేజ్గా ఉందని చెప్పాడు. #MacherlaNiyojakavargam Strictly Below Average 1st Half! Other than a few Vennela Kishore scenes nothing really works so far. Probably one of the most routine scripts and screenplays in recent times. Need a big 2nd half! — Venky Reviews (@venkyreviews) August 12, 2022 ► సినిమా బ్లాక్బస్టర్ హిట్ అని ఓ అభిమాని హర్షం వ్యక్తం చేశాడు. #MacherlaNiyojakavargam block buster no .1 telangana megastar @actor_nithiin ..... andhra's jealous of megastar of telangana... common telangana support our megastar — vinc go (@vincgo2) August 12, 2022 ► పాటలు, బీజీఎం పెద్దగా ఆకట్టుకోలేదని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. నితిన్ గత సినిమా భీష్మలో 50 శాతం కూడా మాచర్ల నియోజకవర్గం ఆకట్టుకోలేదని అన్నాడు. Songs and BGM as well not good , bheeshma lo not even 50% #MacherlaNiyojakavargam — NTR30 (@kiran_nine) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ పండిందని ఓ అభిమాని ట్విటర్లో వెల్లడించాడు. #MacherlaNiyojakavargam poor first half 🙃 Vennala Kishore comedy ✅ worked in some parts 👍#nithin #KrithiShetty#MacherlaNiyojakavargamreview — tollywood_united (@united_tolly) August 12, 2022 ► సినిమా బాగుందని ఓ నెటిజన్ హార్ట్ ఎమోజీ ట్వీట్ చేశాడు. ST: #MacherlaNiyojakavargam @actor_nithiin ❤️ — #TheLegendSarvana Fan 🤗 (@MedaramSampath) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ బాగుందని, ఫస్టాఫ్ యావరేజ్ అని ఓ అభిమాని ట్విటర్లో వెల్లడించాడు. సినిమాకు కీలకమైన ‘అసలు కథ’ ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చాడు. 1st half : VENNELA KISHORE COMEDY BIG PLUS 👍 SONGS OKAYISH 😌 ROUTINE DRAMA.. INTERVAL BAGUNDI👍 IPPUDEE ASALU KATHA MODALAINDI.. OVERALL AVG 1ST HALF ✅️ @tollymasti #tollymasti . .#MacherlaNiyojakavargam #MacherlaNiyojakavargamReview #Nithin #MacherlaNiyojakavargamUsa — Tollymasti (@tollymasti) August 12, 2022 -
Macherla Niyojakavargam Movie: ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ స్టిల్స్
-
మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మాచర్ల కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం.. మాచర్ల ధమ్కీ
నితిన్, కృతీశెట్టి జంటగా ఎంఎస్ రాజశేఖర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాచర్ల ధమ్కీ’అంటూ ఓ వీడియోని వదిలారు మేకర్స్. ‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలారి మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం’అంటూ నితిన్ చేప్పే పవర్ఫుల్ డైలాగ్లో ఈ స్పెషల్ వీడియో ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నితిన్..సిద్ధార్థ్ రెడ్డి అనే యంగ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. జులై 30న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి ఓ స్పెషల్ సాంగ్లో నటించించింది. -
యూట్యూబ్లో దూసుకెళ్తున్న ‘రారా రెడ్డి’ సాంగ్
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ పాటకి 20 మిలియన్స్ పైగా వ్యూస్, 3లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకొని యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. ఇక పాటలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ పల్లవికి లక్షలాది సంఖ్యలో రీల్స్ వచ్చాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రా రా రెడ్డి.. . అంజలి స్పెషల్ సాంగ్ ప్రోమో అదిరింది!
నితిన్, కృతీశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ చేస్తుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’) ‘రారా రెడ్డి.. ’అంటూ సాగే ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా మహతి స్వరసాగర్ లైవ్లీ బీట్లతో ఊర మాస్ ట్రాక్ని స్కోర్ చేశారు. లిప్సిక అద్భుతంగా ఆలపించారు. ఇక నితిన్, అంజలి కలిసే వేసే స్టెప్పులు పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఫుల్ సాంగ్ జులై 9న విడుదల కానుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement