-
ఆటో, కారు ఢీ : ఇద్దరు దుర్మరణం
♦ మరో ఇద్దరికి గాయాలు ♦ మృతుల్లో ఇంటర్ విద్యార్థి, ఆటో డ్రైవర్ ♦ ఎంఆర్ఎఫ్ పరిశ్రమ ఎదుట ప్రమాదం సదాశివపేట : ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సదాశివపేట మండలం ఎంఆర్ఎఫ్ పరిశ్రమ వద్ద చోటు చేసుకున్న సంఘటనపై సదాశివపేట సీఐ శ్రీనివాస్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కల్గోడ గ్రామానికి చెందిర రఫీయుద్దీన్ తన ఆటోలో సదాశివపేటకు వస్తున్నాడు. మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్ వద్ద అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థులు విక్రమ్గౌడ్, జావేద్ ఆటోలో ఎక్కారు. ఆటో ఆరూర్ చేరుకున్నాక పదవ తరగతి విద్యార్థి మధు ఆటోలో చేరాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో సదాశిపేటలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమవద్దకు రాగానే హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో సదాశివపేట ఉజ్వల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విక్రమ్గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ రఫీయుద్దీన్, జావేద్, మధును చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వీరిలో రఫీయుద్దీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జావేద్ సదాశివపేటలోని ప్రగతి కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా, మధు ఇండో బ్రిటీష్స్కూల్లో పదవ తరగతి విద్యార్థి. కాగా ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ తెలియలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. -
‘ఎంఆర్ఎఫ్’ ఎన్నికల్లో హరీష్రావు ఘన విజయం
సదాశివపేట, న్యూస్లైన్: ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరిష్రావు బీఎంఎస్ అభ్యర్థి మల్లేశంపై 576 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా హరీష్రావు, బీఎంఎస్ తరఫున మల్లేశం పోటీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో పరిశ్రమ పర్మినెంట్ కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిశ్రమలో మొత్తం 1524 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1471 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో వచ్చిన హరీష్రావు తనను గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కార్మికులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇస్తూ బస్సు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వెళ్లిపోయారు. హరీష్రావు గెలుపునకు సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాగౌడ్, అల్లం బస్వరాజ్, రాధాకృష్ణ దేశ్పాండే, రాచిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతగోపాల్, కోడూరి అంజయ్య పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు సుకుమార్, ఉల్లిగడ్డల శాంత్కుమార్తో పాటు ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయుసీ నాయకులు తదితరులు హరీష్రావుకు ఓటు వేసి గెలిపించాలని పరిశ్రమ వద్ద కార్మికులను కోరారు. మల్లేశం తరఫున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, సత్యనారాయణ, బీఎంఎస్ నాయకులు శంకర్, అంబయ్య, శ్రీనివాస్,ఆశోక్, వీరేందర్, బీఎంఎస్ కాగడా గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను అభ్యర్ధించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. లెక్కింపులో హరీష్రావుకు 1023 ఓట్లు రాగా మల్లేశంకు 447 ఓట్లు వచ్చాయి. దీంతో హరీష్రావు ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోటేశ్వర్రావు అధికారికంగా ప్రకటించారు. హరీష్రావు గెలుపు సందర్భంగా కార్మికులు పరిశ్రమ ఎదుట భారీగా టపాసులు కాలుస్తూ నినాదాలు చేశారు. ఎంఆర్ఎఫ్ కార్మికులు టీఆర్ఎస్, టీఎంఎస్ నాయకులు నినాదానాలు చేశారు. ఓటు వేసి గెలిపించిన ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయుసీ నాయకులకు ఎంఆర్ఎఫ్ కార్మికులకు టీఆర్ఎస్, టీఎంఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు చేసుకొన్న టీఆర్ ఎస్ శ్రేణులు జహీరాబాద్ టౌన్: ఎంఆర్ఎఫ్ కర్మాగారంలో గురువారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హరీష్రావు గెలుపొందడంతో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారు. నాయకులు, కార్మికులు రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాకు టీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని పెద్ద పెట్టున నినాదాలు చే శారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు,మాజీ ఎమ్మెల్యే హరీష్రావు అందరివాడన్నారు. సామాన్య ప్రజలతో పాటు కార్మికులు,కర్షకుల కష్టాలు తెలిసిన నాయకుడన్నారు. ఎంఆర్ఎఫ్లో చేపట్టిన కార్యక్రమాలే ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే బాగన్న, పట్టణ అధ్యక్షుడు యాకూబ్, జిల్లా కార్యదర్శి నామ రవికిరణ్ గుప్తా, నాయకులు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, కౌన్సిలర్ రాములు నేత, మురళీకృష్ణ గౌడ్,విజయ్కుమార్, కలీం, టీఆర్ఎస్వీ తాలుకా అధ్యక్షుడు ఖాజా, పట్టణాధ్యక్షుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement