-
ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు
నటుడిగానే కాకుండా రాజకీయాల పరంగానూ వార్తల్లో నిలుస్తున్న స్టార్ హీరో విశాల్. ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడుతుంటారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన లత్తీ చార్జ్ (తెలుగులో లాఠీ) చిత్రం ఈ నెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు విషయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం ప్ర: లత్తీ చార్జ్ చిత్రం గురించి? జ: నేను ఇంతకు ముందెన్నడూ చేయని కథా, కథనాలతో కూడిన చిత్రం ఇది. తొలిసారిగా పోలీస్ కానిస్టేబుల్గా నటించాను. సమాజంలో పోలీస్ కానిస్టేబుళ్ల పాత్ర కీలకం. అయితే వారి వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాల కడలే. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా పరుగులు తీయాల్సిన పరిస్థితి. అలాంటి ఒక కానిస్టేబుల్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం లత్తీ చార్జ్. ఈ చిత్రం కోసం శక్తికి మించి శ్రమించాల్సి వచ్చింది. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి క్లైమాక్స్ సన్నివేశాలను ఇందులో చూస్తారు. ప్ర: లత్తీ చార్జ్ను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడంపై? జ: పాన్ ఇండియా చిత్రాలు అనడాన్ని నేను సమరి్ధస్తాను. తమిళ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్నాయి. తెలుగు, మలయాళం చిత్రాలు తమిళనాడులో ఆడుతున్నాయి. కన్నడ చిత్రాలు తమిళనాడులో ఎక్కువగా విడుదల కాకపోయినా, ఆ చిత్ర పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే పాన్ ఇండియా అనే చట్రంలో ఇరుక్కుపోతే బయట పడటం కష్టం. ప్ర: మెగాఫోన్ ఎప్పుడు పట్టబోతున్నారు? జ: లత్తీ చార్జ్ తరువాత మార్క్ ఆంటోని చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తండ్రీకొడుకులుగా చేస్తున్నాను. నటుడు ఎస్జే సూర్య కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రంలో విశాల్ కనిపించడు.. పాత్రలే కనిపిస్తాయి. తదుపరి నేను దర్శకత్వం చేసే చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. యానిమల్స్ ఇతివృత్తంతో సాగే కథా చిత్రం. దీని తరువాత తుప్పరివాలన్ 2 చిత్రానికి దర్శకత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్ర: మళ్లీ మిష్కిన్ దర్శత్వంలో నటిస్తారా? జ: కచ్చితంగా నటిస్తాను. ఆయన ఇప్పుడు ఫోన్ చేసినా ఆయన ఆఫీస్కు వెళ్తాను. మిష్కిన్ అద్భుతమైన దర్శకుడు. అయితే ఒక నిర్మాతగా మాత్రం నేను ఆయన్ని క్షమించను. నాకు అంత ద్రోహం చేశారు. ప్ర: త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ తరుఫున కుప్పం నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారట? జ: ఒసామా (చిరునవ్వు) అలాంటి ప్రచారం నా దృష్టికి వచ్చింది. విశేషం ఏమిటంటే కుప్పం నియోజకవర్గంతో నాకున్న అనుబంధాన్ని, అక్కడి ప్రజలతో సత్సంబంధాలు వంటి వివరాలు సేకరించి కుప్పంలో చంద్రబాబు నాయుడుకు గట్టి పోటీ ఇచ్చే సత్తా విశాల్కే ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావించినట్లు ప్రచారం జరిగిన మాట నిజమే. నిజంగానే కుప్పంతో నాకు అనుభవం ఉంది. మా నాన్న అక్కడ గ్రానైట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలో నేను మూడేళ్ల పాటు కుప్పంలో తిరిగాను. అక్కడ ప్రతి వీధి నాకు పరిచయమే. అక్కడి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కుప్పం నియోజకవర్గంలో 40 శాతం తమిళులు ఉన్నారు. అయితే కుప్పంలో నేను పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ప్ర: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? జ: రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. అసలు రాజకీయం అంటే ప్రజాసేవ. అలా మీరు కూడా ఏదో ఒక అనాధాశ్రమానికి సాయం చేసే ఉంటారు. అదీ రాజకీయ సేవే. తుపాన్ సమయంలో నేనూ నా మిత్రులం కలిసి సహాయ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజాసేవ చేయడానికి ఇన్ని రాజకీయ పార్టీలు అవసరమా? ప్ర: మీ కాలేజ్ మేట్ ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీని గురించి మీ స్పందన? జ: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడం సంతోషంగా ఉంది. సినీ రంగం అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెన్నైలో ఫిలిం సిటీని అభివృద్ధి చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఫిలిం సిటీలు ఉన్నాయి. చెన్నైలో లేకపోవడం బాధాకరం. -
వైఎస్ జగన్ అంటే అభిమానం: తమిళ స్టార్ విశాల్
సాక్షి, తిరుచానూరు (తిరుపతి జిల్లా): రాజకీయ నేతల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే తనకు అభిమానమని తమిళ సినిమా స్టార్ విశాల్ తెలిపారు. లాఠీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సోమవారం తిరుపతిలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో విశాల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తిరుç³తి ఎస్డీహెచ్ఆర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ నటుడు మంచు మోహన్బాబు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ పలు ఆసక్తికర విషయాలను వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎవరంటే ఇష్టమని అడిగిన విద్యార్థికి తనకు జగన్ అంటే అభిమానమన్నారు. కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయని, అయితే అక్కడ నుంచి తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదన్నారు. సినిమాల్లో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. మోహన్బాబు మాట్లాడుతూ తాను హీరోగా నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ సినిమాకు విశాల్ తండ్రి నిర్మాత అని, ఆ కుటుంబంతో ఎప్పటి నుంచో ఉన్న అనుబంధంతోనే లాఠీ ప్రమోషన్ ఫంక్షన్కు వచ్చినట్టు తెలిపారు. -
THE BIG STORY : ప్రగతి పథంలో కుప్పం
-
‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. బాబుకు నాగార్జున సవాల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో జన ప్రభంజనాన్ని చూసిన చంద్రబాబు, ఆయన తాబేదార్లకు మతి తప్పిందని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఈసారి కుప్పంతో సహా 175 స్థానాల్లోనూ ఓడిపోతారనే విషయం వారికి అర్థమైందని అన్నారు. జగన్ జన ప్రభంజన రథ చక్రాల కింద చంద్రబాబు, ఆయన అనుయాయులు నలిగిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికీ టీడీపీకి గెలుస్తామనే నమ్మకం ఉంటే కుప్పం ఎమ్మెల్యే సీటుకు చంద్రబాబు రాజీనామా చేసి వస్తే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కుప్పంలో మీరైనా, మీ కొడుకైనా సరే మా సత్తా చూపిస్తామన్నారు. మంత్రి నాగార్జున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ సీఎం వైఎస్ జగన్ ఉజ్వల భవిష్యత్తుపై మాట్లాడిన మాటలను కూడా ఎల్లో గ్యాంగ్ వక్రీకరిస్తోందని చెప్పారు.14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ప్రశ్నించారు. ఆయన మార్కు పథకం ఒక్కటైనా చెప్పగలరా అని నిలదీశారు. ఎన్టీఆర్ 2 రుపాయలకు కిలో బియ్యం పథకాన్ని పెడితే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన లాంటి లెక్కలేనన్ని పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడే వైఎస్ జగన్ను ఆదరించిన ప్రజలు ఆయనకు కంచుకోటలా అండగా నిలిచారన్నారు. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ను అస్సలు వదులుకోరని చెప్పారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఎన్ని వేషాలేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సత్తా చూపిస్తారన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబును ఈసారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ స్థాయికి దిగజారి మాట్లాడలేమని ఓ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున చెప్పారు. -
బాబు తరఫున లోకేష్ నామినేషన్
కోడ్ ఉల్లంఘించిన తమ్ముళ్లు కుప్పం, న్యూస్లైన్: చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు తరఫున ఆయన తనయుుడు లోకేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయుం 11.30 గంటలకు చీవునాయునపల్లె వరదరాజస్వామి ఆలయుంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. పోలీసుల సాక్షిగా చీవునాయునపల్లె వరదరాజస్వామి దేవాలయూన్ని పార్టీ జెండాలతో పసుపువుయుం చేసి అధినేత కుమారుడికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోకేష్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేని కారణంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో అదనపు ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.ఉషాకిరణ్ ఎదుట ప్రమాణపత్రం చదివారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement