-
హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం
-
కాజీపేట్ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం
సాక్షి, హనుమకొండ: కాజీపేట్ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు. -
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. సెకన్లలో నిండు ప్రాణం బలి
సాక్షి, హన్మకొండ: అతి వేగంగా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. హైస్పీడ్తో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా, ఓ సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నడిరోడ్డుపై ఓ మహిళ మృతిచెందింది. అయితే, ఉన్నతాధికారి కొడుకు నిందితుడు కావడంతో పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద కవిత బైక్ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్లో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఎక్సైజ్ సీఐ శరత్ కొడుకు వంశీ TS03 FA9881 నెంబర్ కారును అధిక వేగంతో డ్రైవ్ చేసి రాంగ్ సైడ్లో బైక్ను ఓవర్టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే మాట్లాడున్న కవితను కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. #JustIn Kazipet road accident!@HiWarangal @TriCityWarangal pic.twitter.com/hY54Ts8LNj — Fasi Adeeb🇮🇳 (@fasi_adeeb) December 1, 2023 అయితే, ఈ ప్రమాదంలో నిందితుడి వంశీపై చర్యలు తీసుకోవాలని కవిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వంశీని ఈ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నాడు. దీంతో, నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేశారు. దీంతో, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక, కవితకు వివాహం కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం. -
రైలుబోగీల్లోనే 10 గంటలు..
మహబూబాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి చెరువు రిజర్వాయర్పై నిర్మించిన రైల్వే వంతెన ట్రాక్పైకి వరద నీరు ఉధృతంగా చేరడంతో గురువారం రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సుమారు 10గంటలపాటు ప్రయాణికులు రైలు బోగీల్లోనే నిరీక్షించారు. వడ్డెపల్లి చెరువు కట్టపై 364/27–25 కి.మీ నంబర్ వద్ద రైల్వే ట్రాక్ డేంజర్గా మారడంతో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో తిరుపతి–కరీంనగర్, ఎర్నాకులం–బిలాస్పూర్, యశ్వంత్పూర్–లక్నో, బెంగళూర్–నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లను ఉదయం 10:30 గంటల నుంచి నిలిపివేశారు. కాజీపేట–ఢిల్లీ, వరంగల్–ఢిల్లీ అప్ అండ్ డౌన్ రూట్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ బ్రిడ్జి, ట్రాక్ ఇంజనీర్స్, కాజీపేట జంక్షన్కు చెందిన అధికారులు వడ్డెపల్లి రైల్వే ట్రాక్ వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ట్రాక్ సామర్థ్యం టెస్టింగ్ కోసం ట్రాక్పై గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. రాత్రి 8 గంటల వరకు ఇదే పరిస్థితిలో రైల్వే అధికారులు సెక్యూరింగ్ చేశారు. కాగా కాజీపేట రైల్వే చరిత్రలో వడ్డెపల్లి చెరువు రైల్వే ట్రాక్పైకి వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. అయితే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ సమీప దుకాణాల వద్దకు వెళ్లి తిను బండారాలు కొనుగోలు ఆకలితీర్చుకున్నారు. వరంగల్ సమీప గ్రామాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోయారు. సుమారు 10గంటల తర్వాత గురువారం రాత్రి రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ కెపాసిటిని పరిశీలించి మొదటి, రెండో లైన్లకు రాత్రి 8:30 గంటలకు క్లీయర్ ఇచ్చారు. ముందుగా లైట్ ఇంజన్ నడిపించి ఆతర్వాత 10 నుంచి 30 కెంఎంపీహెచ్ స్పీడ్తో ఢిల్లీ వైపు యశ్వంత్పూర్– బిలాస్పూర్, తర్వాత రాజధా, లక్నో, తమిళనాడు ఎక్స్ప్రెస్లను పంపించినట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్ జలమయం వర్షపునీరు కాజీపేట జంక్షన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దకు, ఎంట్రెన్స్ ఎదుట, ప్లాట్ఫాం పైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ► న్యూ ఢిల్లీ వెళ్లే ఏపీ, తమిళనాడు ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు గురువారం ఉదయం 11.30 గంట ల సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ రెండు, మూడు ప్లాట్ ఫాంలలో నిలిపివేశారు. రైళ్లలో శు క్రవారం ఐఐటీ ఢిల్లీ కళాశాలలో చేరేందుకు వెళ్తు న్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ) ఎక్స్ప్రెస్కు వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లా ట్ ఫాం రేకు తగలడంతో రైలు ఆగిపోయింది. ► రఫ్తీసాగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (గోర్కపూర్– కొచువేలి) రైలు నెక్కొండ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం 11గంటలకు నిలిచిపోయింది. స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడం.. తినుబండారులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. -
Kazipet Railway Station Floods Video: ఖాజీపేట రైల్వే ట్రాక్పై వరద నీరు
-
విషాదానికి ముందు.. ఎంజీఎంలో చిన్నారి రాజు సరదా క్షణాలు
-
‘నా కొడుకా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయారా’
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది. వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. -
కాజీపేట వ్యాగన్ల పరిశ్రమ రెండో అతిపెద్దది
కాజీపేట రూరల్: భారతీయ రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మాణం కాబోతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామశివారులో ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్న రైల్వే వ్యాగ న్ల తయారీ పరిశ్రమస్థలాన్ని, అక్కడ జరుగుతున్న పను లను గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేతోపాటు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్గా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ పరిశ్రమను నిర్మిస్తుందన్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సంస్థ సహకారంతో రొబొటిక్ సిస్టం ద్వారా నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాప్, రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఆదారంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్లను ఉత్పత్తి చేస్తుంద న్నారు. జిల్లాలో కొత్త పారి శ్రా మిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను ప్రోత్స హి స్తుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందన్నారు. రూ.521 కోట్ల వ్య యంతో 160.4 ఎకరాల విస్థీర్ణంలో నిర్మాణం కానున్న వ్యా గన్ల తయారీ పరిశ్రమలో నెలకు 200 వ్యాగన్ల పీరి యాడికల్ ఓవరాయిలింగ్ (పీవోహెచ్) చేసేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ మంజూరైందని, సంవత్సరానికి 1,200 వ్యాగన్లు, రెండో సంవత్సరానికి 2,400 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మా ణం కానున్న వ్యాగన్ల తయారీ పరిశ్రమను 24 నెలల్లోపూర్తి చేసి 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఏకే గుప్తా, ఆర్వీఎన్ఎల్ సీపీఎం మున్నకుమార్ పాల్గొన్నారు. -
కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు.. వర్క్షాప్ కాదు.. వ్యాగన్ ఫ్యాక్టరీనే!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు రాబోతోంది. కాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్కు బదులుగా నేరుగా వ్యాగన్ల తయారీ ప్రాజెక్టునే రైల్వే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రైల్వే పరోక్షంగా స్పష్టతనిచ్చింది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీలో తొలి ఏడాది 1200 వ్యాగన్లను తయారు చేస్తామని.. తర్వాత ఈ సామర్థ్యాన్ని 2400కు పెంచుతామని శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా మూడు దశాబ్దాల కింద కాజీపేటకు మంజూరై.. ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు దేశంలో రైలు వ్యాగన్లు తయారు చేసేందుకు రైల్వేకు పశ్చిమ బెంగాల్లో ఒక్క సొంత యూనిట్ మాత్రమే ఉండగా.. కాజీపేటలో రెండోది ఏర్పాటుకానుంది. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ‘సాక్షి’ఫిబ్రవరి నెలలోనే కథనం ప్రచురించింది కూడా. ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభం కాజీపేట సమీపంలోని మడికొండలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 160 ఎకరాల స్థలంలో వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. తొలుత ఇక్కడ రూ.269 కోట్లతో ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను నిర్మించాలని నిర్ణయించి.. రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గతేడాది టెండర్లు పిలిచారు. మాదాపూర్కు చెందిన పవర్ మెక్–టైకిషా జెవీ అనే సంస్థ రూ.361.79 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఇప్పుడా ప్రాజెక్టు వ్యాగన్ ఫ్యాక్టరీగా మారిన నేపథ్యంలో.. అదే సంస్థ పనులు చేపట్టనుందని సమాచారం. ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ వ్యాగన్ ఫ్యాక్టరీని అధికారికంగా ప్రకటించి, శంకుస్థాపన చేయనున్నరని అధికారులు చెప్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వ్యాగన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంటున్నారు. విమర్శలకు కౌంటర్గా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాజీపేటలో వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటుకోసం రూ.160 కోట్లు కేటాయించారు. కానీ తర్వాత రాజకీయంగా వస్తున్న విమర్శలను కౌంటర్ చేసేలా కాజీపేట యూనిట్ను వాగన్ ఫ్యాక్టరీగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ యూనిట్ వల్ల 2వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. యూనిట్ను ఫ్యాక్టరీగా మార్చినందున కొత్తగా గ్యాంగ్ డ్రిల్లింగ్ యంత్రం, షీరింగ్ యంత్రం, బెంచ్ ప్రెస్, యూనివర్సల్ అండర్ ఫ్రేమ్ వెల్డింగ్ మ్యానిప్యులేటర్స్, స్ట్రైటెనింగ్ యంత్రం, హుక్ బోల్టింగ్ యంత్రం వంటి పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హన్మకొండ: వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా మల్కాన్ సింగ్, సునీత దంపతుల కుమారుడు చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కాగా పని కోసం మల్కాన్ సింగ్ కుటుంబం గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. వీరు నగరంలో ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ కాజీపేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వంత ఖర్చులతో యూపీకి తరలించారు. నగరంలో ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని, కుక్కలను చంపడం నేరం కావడంతో వాటి సంతతిని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. కుక్కలకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు ఇదిలా ఉంటే గడిచిన 20 రోజుల్లో వరంగల్ జిల్లాలో ఇద్దరు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డడం కలకలం సృష్టిస్తుంది. చదవండి: పైళ్లెన వారం రోజులకే విషాదం నింపిన క్షణికావేశం -
ఖాజీపేట్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు
-
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
కాజీపేటలో రైల్ వ్యాగన్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ (పీఓహెచ్) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్గా మార్చాలని నిర్ణయించింది. వర్క్షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు. ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆ వివాదంతోనేనా.. కాజీపేటకు 1980లలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రైల్వేకు ఇది రెండో యూనిట్.. దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్ అవుతుంది. రైల్వే సొంత యూనిట్గా మారుతుంది. పవర్ మెక్–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్ టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్షాప్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు. -
ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్ ట్విస్ట్
కాజీపేట(హన్మకొండ జిల్లా): మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిచడాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య రూ.4లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సౌత్ జోన్ డీసీపీ అశోక్కుమార్ తెలిపారు. కాజీపేట పోలీస్స్టేషన్లో ఏసీపీ శ్రీనివాస్తో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు. కాజీపేట డీజిల్ కాలనీలో నివాసం ఉండే జిన్నారపు వేణుకుమార్ (34) గిరిగిరి చిట్టిల వ్యాపారం చేసేవాడు. అతడికి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య సుశ్మిత రైల్వేలో ఉద్యోగం చేస్తుంది. భార్యలిద్దరినీ ఒకే ఇంటిలో ఉంచి కాపురం చేస్తున్న వేణుకుమార్ మహబూబాబాద్కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య సుశ్మిత తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్ అనే రౌడీషీటర్కు రూ.4లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది. ఈ క్రమంలో రత్నాకర్ వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కొంగర అనిల్, ఇస్సీపేటకు చెందిన కటిక అనిల్కు సుపారీ విషయం చెప్పి వేణుకుమార్ను హత్య చేసేందుకు ఒప్పించాడు. పథకం ప్రకారం సెప్టెంబర్ 30న సుశ్మిత తన భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్ను గొంతు నులిమి హత్య చేసి పడేసి హనుమకొండకు వచ్చారు. అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్ 2న భర్త వేణుకుమార్ కనిపించడం లేదంటూ సుశ్మిత కాజీపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంథని పోలీసులు వాగులో కనిపించిన మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా ప్రకటించారు. అయితే, సుశ్మిత ప్రతిరోజు పోలీస్స్టేషన్కు వచ్చి ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తూ ఏడుస్తుండడంతో అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి విషయాన్ని ఏసీపీ శ్రీనివాస్, డీసీపీలకు వివరించి కాల్ లిస్ట్ బయటకు తీశారు. ఆమె నిత్యం నిందితులతో మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సుశ్మితను అదుపులోకి తీసుకుని విచారించగా వేణుకుమార్ను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా ఒప్పుకుంది. మంథని పోలీసుల సమకారంతో మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం చేయించిన పోలీసులు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రమోద్కుమార్, రవికుమార్, సిబ్బందిని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ అభినందించారు. చదవండి: మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి.. -
కాజీపేట రైల్వే యూనిట్కు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాజీపేటలో వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రెండు దఫాలు టెండర్లు విఫలమైన తర్వాత మూడో ప్రయత్నంగా బుధవారం టెండర్లను తెరవబోతున్నారు. నిర్మాణసంస్థను గుర్తిస్తే.. సరిగ్గా రెండున్నరేళ్లలో యూనిట్ పని ప్రారంభించనుంది. రూ.383 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ నిర్మిస్తున్న ఈ యూనిట్లో నెలకు 250 వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేలా ఓవర్హాలింగ్ చేయనున్నారు. 2016లో రైల్వే శాఖ రూ.269 కోట్ల అంచనాతో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు, ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. దానికి కావాల్సిన 150 ఎకరాల భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవటం, ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాన్ని రైల్వేకు అప్పగించటంలో జాప్యం చేయటంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. గతేడాదే ఆ భూమి రైల్వేకు అందటంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి యూనిట్ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి. -
కూలింగ్తో ఈ–బైక్స్ ఫైరింగ్కు చెక్
కాజీపేట అర్బన్: విద్యుత్ చార్జింగ్తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎలక్ట్రికల్ బ్రాంచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్బాబు పేర్ల తెలిపారు. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. కూలింగ్తో ఫైరింగ్కు చెక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ–బైక్స్లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్ డిజైన్ లేదని సురేష్బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్ చార్జింగ్ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్ పెట్టాక వాడకపోయినా విద్యుత్శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు. దీనికితోడు ఈ–బైక్స్లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్ మెటీరియల్తో కప్పేసేలా డిజైన్ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్లో ఈ–బైక్స్కు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్ సెంటర్, కేయూసీ, కుమార్పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్ స్టేషన్ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్బాబు వివరించారు. -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్వర్క్లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్బాబు తెలిపారు. -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్ఫోన్కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అది ఓ కీలక ప్రాజెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్ (ట్రిప్లింగ్) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్ ఇది. దక్షిణ భారత్ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు. ఈ మార్గంలోని మాణిక్ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్–కాగజ్నగర్.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్ కారిడార్గా వెలుగొందుతోంది. ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్లో 130 శాతం రైలు ట్రాఫిక్ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు నడపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొగ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. మూడో లైన్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం మూడో లైన్ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి. తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. అప్పట్లోనే గుర్తించి ఉంటే.. సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్ యావత్తు మూడో లైన్ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఈ రోడ్డుపై నీళ్లు నిలవవు!
కాజీపేట అర్బన్: ఏ చిన్నపాటి వాన కురిసినా రోడ్లపై నీళ్లు నిలుస్తాయి. వచ్చిపోయే వాహనాలతోపాటు పాదచారులకూ నరకమే. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు తోడ్పడే ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్లు, పేవ్మెంట్ల నిర్మాణంపై వరంగల్ నిట్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను.. విదేశాల్లో పలుచోట్ల పార్కింగ్ స్థలాలు, ఉద్యానవనాలు వంటి చోట్ల ఇప్పటికే వినియోగిస్తున్నారు. దీనిని మన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై నిట్ సివిల్ విభాగం ట్రాన్స్పోర్ట్ డివిజన్ ప్రొఫెసర్ ఎస్.శంకర్, పీహెచ్డీ స్కాలర్ గుమ్మడి చిరంజీవి పరిశోధన చేస్తున్నారు. ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్లు/పేవ్మెంట్లతో నీరు నిల్వ ఉండకపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందవని.. రోగాలు ప్రబలకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు నీటిని పీల్చేసుకుని.. ♦సురక్షితమైన ప్రయాణానికి వీలు కల్పించే తారు, సీసీ రోడ్డు మాదిరిగానే ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్డు ఉంటుంది. సాధారణంగా తారు, సీసీ రోడ్లను నాలుగు దశల్లో మట్టి, కంకర, తారు లేదా సిమెంట్ వినియోగించి నిర్మిస్తారు. ఇవి పూర్తిగా గట్టి పొరలా ఉండిపోయి.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయి. ♦‘పోరస్ ఆస్ఫాల్ట్’ పేవ్మెంట్/రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే.. పెద్ద సంఖ్యలో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడేలా చూస్తారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారు. ♦వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపేస్తాయి. వెంట వెంటనే నీళ్లు ఇంకిపోవడం వల్ల నిల్వ ఉండటం, ముంపునకు కారణం కావడం వంటివి ఉండవు. ♦పట్టణాల్లో ఇలాంటి రోడ్లు/పేవ్మెంట్లను నిర్మించినప్పుడు వాటి దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. దానితో ఎంతగా వానపడ్డా నీళ్లు నిలవవు. ముంపు నివారణ కోసం.. నిట్ వరంగల్ క్యాంపస్లో తొలుత పోరస్ ఆస్ఫాల్ రోడ్డును 50 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నాం. దానిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తాం. గ్రేటర్ వరంగల్లో వాన ముంపును నివారించేందుకు ఈ విధానాన్ని అందజేస్తాం. సైడ్ డ్రెయిన్స్ లేని ప్రాంతాల్లో, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. – శంకర్, ప్రొఫెసర్, సివిల్ విభాగం -
12 కిలోల ‘బంగారు’ తీగ
కాజీపేట: వరంగల్ నగరం కాజీపేట 62వ డివిజన్ సోమిడి శివారులోని మాటు చెరువులో 12 కిలోలకు పైగా బరువు ఉన్న బంగారు తీగ చేప దొరికింది. సోమవారం ఉదయం మత్స్యకారులు చేపలు పడుతుండగా అధిక బరువు, కడుపు నిండా చెనతో ఉన్న ఈ బంగారు తీగ వలకు చిక్కింది. ఈ చేపను సంఘం అధ్యక్షుడు రఘురాంతోపాటు సభ్యులు పంచుకున్నారు. ఇంతపెద్ద చేప వలలో పడడం ఇది మొదటిసారి అని మత్స్యకారులు తెలిపారు. -
‘కోచ్’ వచ్చే వరకు కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకూ కొట్లాడుతామని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు పునర్విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మోదీ ప్రభుత్వ తీరుతో ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయి. తెలంగాణను మోసగించడంలో గత పాలకులను మోదీ సర్కార్ మించుతోంది. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చినా సానుకూలంగా స్పందించడంలేదు’అని విమర్శించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసమే మహారాష్ట్రలోని లాతూర్కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి రూ.625 కోట్లు విడుదల చేశారని, కేంద్రం చేసిన దగాతో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన ఈ ప్రాంత యువత ఆశలపై నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు. కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే బీజేపీ మంత్రి, ఎంపీలు, నేతలు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమితరిమి కొడతారు’అని కేటీఆర్ హెచ్చరించారు. -
తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ఇళ్లు సీజ్
సాక్షి, హన్మకొండ(కాజీపేట): ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్రావు ఇళ్లు, ఆస్పత్రులపై బుధవారం తెల్లవారుజామున సీబీఐ, ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట రహమత్నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉండే డైరెక్టర్ ఇళ్లపై విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు చెందిన సీబీఐ సీఐ ఎ.సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు) -
తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి
కాజీపేట: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కా ప్లాన్తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడనే అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్కు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. ఇంట్లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి ప్రసాద్ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది. (చదవండి: టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్) బాధితుడి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్ను విడిచిపెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావొద్దని రాయించుకుని వదిలేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా యువకుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన మాచర్ల శేఖర్తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని.. పలుమార్లు లైంగికదాడి చేసి మోసం..)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement