-
భూమి ఒకరిది.. పాస్ బుక్ మరొకరిది..
భూమి నకిలీ.. భూమిని నమ్మించే పాస్ బుక్కు నకిలీ.. నగదు నకిలీ.. కాదేదీ నకిలీకి అనర్హం. మోసం చేయాలనే ఆలోచన మెదడులో మెదిలితే చాలు దేన్నైనా నకిలీ చేయొచ్చు.. ఇంకా చెప్పాలంటే నకిలీ గాళ్లదే ఈ నయా లోకం. కొన్నేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుంది ఓ ముఠా. గత ప్రభుత్వాల హయాంలో వెబ్ల్యాండ్ను ఆన్లైన్ చేసేందుకు పూనుకున్నారు. అవకాశాన్ని క్యాష్ చేసుకోవడమే పనిగా ఉన్న కొందరు పొలమే లేకుండా ఓ పాస్ బుక్ను క్రియేట్ చేసి దాంతో బ్యాంక్లను మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఈ కుంభకోణం అప్పట్లో ఓ పెద్ద చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా ఇంకా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయంటూ మోసపోయిన బాధితులు భోరున విలపిస్తున్నారు. తాజాగా కురిచేడు మండలంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలతో ‘సాక్షి’ కథనం. కురిచేడు: రైతులను ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య భూ రిజిస్ట్రేషన్లు.. నకిలీ పత్రాలు. గత టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్లో పేర్ల నమోదు, పాస్ పుస్తకాల జారీలో అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరించడంతో రైతులు ఇరకాట్లలో పడ్డారు. రైతులకు ఇష్టం వచ్చిన సర్వే నంబర్లతో పాస్ పుస్తకాలు జారీ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టాలు తయారు చేయడానికి ఓ ముఠా, బ్యాంకులో ఆ పత్రాలు పెట్టించి రుణాలు ఇప్పించడానికి ఇంకో ముఠా మధ్యవర్తుల అవతారాలెత్తి రైతుల ఖాతాల్లో రుణాలు మాయం చేసిన సంఘటనలు కురిచేడు ఆంధ్రాబ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో గతంలో వెలుగు చూశాయి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ ముఠాల గుట్టు రట్టు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీన్ని అలుసుగా తీసుకుని ఇప్పటికీ అలాంటి ముఠాలు నకిలీలు సృష్టిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇవిగో ఇవే ఇప్పటి సాక్షాలు ►కురిచేడు మండలం కాటంవారిపల్లెకు చెందిన సంగు సుబ్బారెడ్డి తన సాగుభూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వాలని వీఆర్వోను ఆశ్రయించాడు. సుమారు రూ. లక్ష తీసుకుని సుబ్బారెడ్డి భూమికి బదులు వేరొకరి భూమిని పుస్తకంలో నమో దు చేయించి ఇచ్చారని సుబ్బారెడ్డి తెలిపారు. సుబ్బా రెడ్డి ఆ భూమిని వేరే వారికి విక్రయించాడు. తీరా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ పేరుపై పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించగా ఆ భూమి మరొకరి సాగులో ఉంది. కొనుగోలు చేసిన వారు సుబ్బారెడ్డిపై కేసు పెడతామని తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి డబ్బు వెనక్కు ఇచ్చాడు. ►పడమర గంగవరం గ్రామంలో అన్నెం రామిరెడ్డి అదే గ్రామానికి చెందిన అన్నెం పెదపాపిరెడ్డి వద్ద గ్రామ కంఠం సర్వే నంబర్ 331లోని ఎం0–3.1/2 సెంట్లు ఇంటి స్థలం, మట్టిమిద్దెను 1999లో కొనుగోలు చేసి స్వాధీన అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదే స్థలానికి ఓ వీఆర్వో ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2019లో పెదపాపిరెడ్డి భార్య రామలక్ష్మమ్మ, పడమర గంగవరం గ్రామానికి చెందిన చినపాపిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి 2019లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ఆ వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్ నకిలీదని, ఆ గ్రామానికి ఆయన వీఆర్వో కాదని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడంతో కొనుగోలు చేసిన వారు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి నకిలీల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ కార్యాలయంలో గంగవరం వీఆర్వో పై ఇచ్చిన ఎండార్స్మెంట్, పడమర గంగవరం అన్నెం వెంకటరెడ్డికి ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం లక్ష రూపాయిలిచ్చి నకిలీవి తీసుకున్నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం కావాలని వీఆర్వోని అడిగితే డబ్బులు కావాలన్నాడు. ఆయన అడిగినంత ఇచ్చాను. నాకు నకిలీ పుస్తకాలు ఇచ్చి మోసం చేశాడని ఆ పొలాన్ని మళ్లీ అమ్మితేకానీ తెలియలేదు. నాలాగా నష్టపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేసి నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. – సంగు సుబ్బారెడ్డి, రైతు, కాటంవారిపల్లె ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్టాలు, సర్టిఫికెట్ల విషయం బయటకు వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాను. ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ మేరకు నడుచుకుంటాం. – అద్దంకి శ్రీనివాసరావు, తహసీల్దార్, కురిచేడు -
నకిలీ గుట్టు రట్టు..
కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల జిల్లా): నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు కోనరావుపేట మండలం ధర్మారంలో పట్టుకున్నారు. వారి నుంచి 39 నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను, పలు బ్యాంక్ ఖాతా పుస్తకాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ పాస్పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్
ఖానాపూర్: నకిలీ పాస్ పుస్తకాల సాయంతో బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి యత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల పరిధిలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, పహాణీలు సృష్టించి అధికారుల ఫోర్జరీ సంతకాల సాయంతో బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు యత్నించిన ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, పలు ఆఫీసుల స్టాంపులు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల ఆఫీసు ముద్రలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో మీడియాకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. -
‘నకిలీ’ రుణ గ్రహీతలపై చర్యలేవీ?
ఫోర్జరీ సంతకాలతో పాస్ పుస్తకాలు చూపి రుణాల రెన్యూవల్ విచారణ చేపట్టినా చర్యలు తీసుకోని అధికారులు చెన్నారావుపేట : మండల కేంద్రంలోని సహకార సంఘంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలపై పలువురు రుణాలు తీసుకొని ఏడాది కావస్తున్నా.. నిందితులపై నేటికీ చర్యలు చేపట్టలేదు. పైగా పలువురికి కొత్త రుణాలను రెన్యువల్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై గొంతు విప్పిన ఓ రైతుపై సాక్షా త్తూ సొసైటీæకార్యాలయ ఆవరణలో సోమవారం దాడికి పాల్పడటం గమనార్హం. రైతుల కథనం ప్రకారం.. గూడూరు మండలంలోని గుండెంగ, గాజులగట్టు గ్రామాలకు చెందిన పలువురు 2015 డిసెంబర్లో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో రబీ రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో సొసైటీ చైర్మన్ రాదారపు సాంబరెడ్డి నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించారు. వాటిపై గూడూరు తహసీల్దార్, మహబూబాబాద్ ఆర్డీఓల ఫోర్జరీ సంతకాలు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించగలిగారు. దీనిపై విచారణ చేసిన అధికారులు పాస్ పుస్తకాలు తీసుకొని వెళ్లిపోయారు. కానీ ఇప్పటిదాకా చర్య లు మాత్రం తీసుకోలేదు. అంతేకాకుండా సొసైటీ నుంచి పొందిన రుణాలను రికవరీ కూడా చేయలేదు. ఇదిలా ఉండగా లావుడ్యా ఈర్య సోమవారం సొసైటీ కార్యాలయానికి వచ్చి 11 మందికి రుణాలు ఇలా ఇచ్చారు, నాకు కూడా అలాగే ఇవ్వండి అంటూ నిలదీ శారు. దీంతో బోడ భాస్కర్, రాజు, రవిలు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీని గురించి ఈర్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొనుగోడు,గుండెంగ మీ సేవా కేంద్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు రైతుల నుంచి అధిక మెుత్తంలో డబ్బులు తీసుకొని నకిలీ పాస్ పుస్తకాలను అందించారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. రుణం అడిగితే డబ్బులు డిమాండ్ చేశాడు గత సంవత్సరం నకిలీ పాస్ పుస్తకాలపై ఓ పైస్థాయి వ్యక్తి డబ్బులు తీసుకొని రుణాలు ఇప్పించాడు. అలాగే ఈ సంవత్సరం కూడా రుణాలు ఇవ్వమని అడిగితే డబ్బులు డిమాండ్ చేశాడు. నేను ఇవ్వకపోవటంతోనే నాకు రుణాలు ఇవ్వకుండా ఆపాడు. నిలదీసినందుకు నన్ను కొట్టించాడు. – బాధితుడు లావుడ్యా ఈర్య -
పోలీసుల అదుపులో గుర్ల తహశీల్దార్
పార్వతీపురం: నకిలీ పాస్పుస్తకాల వ్యవహారంలో విజయనగరం జిల్లా గుర్ల తహశీల్దారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం కొమరాడ తహశీల్దార్గా ఉమాకాంత్పాండే పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో నకిలీ పాస్పుస్తకాల కుంభకోణం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంతో కోటిపాం వీఆర్వో శారదకు కూడా సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రస్తుతం గుర్ల మండల తహశీల్దారుగా పనిచేస్తున్న ఉమాకాంత్తో పాటు వీఆర్వో శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement