ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్-1 పనులకు శంకుస్థాపన
హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ..?
జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేజ్-1లో భాగంగా నూతనంగా నిర్మించనున్న 8, 9 యూని ట్లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 5న రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానిని కలుసుకుని తెలంగాణ స్టేజ్-1 ప్రారంభానికి హాజరుకావాలని కోరగా, మార్చి మొదటి వారంలో వస్తానని హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 5వ తేదీన ప్రధానమంత్రి పర్యటన ఖరారుకానున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ నెల 13న మోడీ రానున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఇటీవల కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు రామగుండం సందర్శించి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కానీ 13న నరేంద్రమోడీ పర్యటన ఖరారు కాలేదు. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ మేరకు రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు
4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ సంస్థ అంగీకరించింది. దానిలో భాగంగా తెలంగాణ స్టేజ్-1లో 2x800=1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు బోర్డు ఆఫ్ డెరైక్టర్లు రూ.10,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. పర్యావరణ అనుమతులు, కోల్లింకేజీ, పవర్ పర్చేజ్ ఒప్పందం ఇప్పటికే పూర్తయ్యూరుు. ఈనెల 18న ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్సింగ్ రామగుండలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 5న శంకుస్థాపన చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం పనులను వేగవంతం చేస్తోంది.
మార్చి 5న ముహూర్తం?
Published Sun, Feb 14 2016 1:11 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement