ప్రచారానికి రాని మధురిమ | Sakshi
Sakshi News home page

ప్రచారానికి రాని మధురిమ

Published Wed, Mar 4 2015 2:40 AM

ప్రచారానికి రాని మధురిమ - Sakshi

చిత్ర ప్రచారానికి రావడం లేదని దర్శకుడు నటి మధురిమపై ఆరోపణ చేశారు. వినయ్, మధురిమ జంటగా నటించిన చిత్రం సేందిపోలామా. అనిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శశినంబీశన్ నిర్మించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 6న విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే చిత్ర ప్రమోషన్‌కు హీరో వినయ్, హీరోయిన్ మధురిమ సహకరించడం లేదని దర్శకుడు అనిల్‌కుమార్ ఆరోపించారు. సేంది పోలామా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో నిర్వహించినట్లు తెలిపారు. 20ఏళ్ల తరువాత కలుసుకున్న స్నేహితులు న్యూజిలాండ్ నుంచి సౌత్ ఐర్లాండ్ వెళుతుం డగా ఒక హత్య జరుగుతుందన్నారు.
 
 ఆ తరువాత జరిగే ఆసక్తికరమైన సంఘటనలే చిత్రం అన్నారు. న్యూజి లాండ్ హైవేలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కారు నడపాల్సి వుంటుందన్నారు. అలా కాకుండా కాస్త వేగం పెంచినా, తగ్గించినా పోలీసులు అపరాధం విధిస్తారన్నారు. ఇక కారును సడన్‌గా నిలిపితే ఆత్మహత్యా నేరం కేసు నమోదుచేస్తారని తెలిపారు. అలా తాము కొంత జరిమానా చెల్లించాల్సి వచ్చిందన్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని,ప్రచార కార్యక్రమాలకు హీరో, హీరోయిన్లు సహకరించడం లేదన్నారు. మధురిమతో పారితోషికం సమస్య మొదలైంది. హీరో వినయ్‌ది తన ఉచ్ఛారణ సరిగా ఉండని కారణంగా ఆయన పాత్రకు వేరే అనువాద కళాకారుడితో డబ్బింగ్ చెప్పించ డం లాంటి సమస్య కావచ్చన్నారు.  ఈ చిత్రాన్ని ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు దర్శకుడు అనిల్‌కుమార్ వెల్లడించారు.

Advertisement
Advertisement