కొలంబో: ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్కు చివరి నిమిషంలో చోటు దక్కిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ అయిన మురళీ విజయ్ గాయం ఇంకా నయం కాలేకపోవడంతో శిఖర్ ధావన్ కు జట్టులో చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టులో ఉన్నాడు. దాంతో కేఎల్ రాహుల్ తో కలిసి ఆ ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే దానిపై కొంతవరకూ సందిగ్ధత ఉంది. ఆ విషయంపై స్పందించిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆ ఇద్దర్నీ సందర్భాన్ని బట్టి రాహుల్ కు జతగా పంపిస్తామన్నాడు. ఆ ఇద్దర్నీ తుది జట్టులోకి తీసుకునే విషయం అప్పటి పరిస్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగినా ఒత్తిడిగా కాకుండా ఓ అవకాశంలా భావించాలని కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు.
'ప్రతీ ఒక్క ఆటగాడు జాతీయ జట్టులోకి సత్తా చాటేందుకు ఆరాటపడటమనేది సర్వసాధారణం. ఆటగాళ్లను ఎంపిక తరువాత అందరికీ అవకాశం కల్పించడానికే యత్నిస్తాం. అది అప్పటి పరిస్థితిని బట్టే ఉంటుంది. మురళీ విజయ్ పూర్తిగా ఫిట్ గా లేడని ఆఖరి నిమిషంలో తెలిసింది. ఆటగాళ్ల గాయాలనేవి గేమ్ లో దురదృష్టపు భాగం. అభినవ్ ముకుంద్ చాలా దేశవాళీ మ్యాచ్లు ఆడాడు. మరొకవైపు ఇక్కడ చివరిసారి శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. అదే సమయంలో చటేశ్వర పుజారా ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఓపెనింగ్ చేశాడు. ఇలా ప్రతీ ఒక్కరూ అందుబాటులో ఉన్నారు. దాంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లను ఉపయోగించుకుంటాం'అని కోహ్లి పేర్కొన్నాడు.
వారిని సందర్భాన్ని బట్టి పరీక్షిస్తాం: కోహ్లి
Published Fri, Jul 21 2017 3:55 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
సీఎం జగన్ ధీమా.. ఏపీలో టీడీపీ ఖతం
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement