టాలీవుడ్ వారియర్స్ లక్ష్యం 142 | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ వారియర్స్ లక్ష్యం 142

Published Sat, Jan 31 2015 9:08 PM

mumbai heroes set target of 142 runs for telugu warriors

హైదరాబాద్: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్)లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టాలీవుడ్ వారియర్స్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ముంబై హీరోస్ 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టాలీవుడ్ వారియర్స్ తొలుత ముంబై హీరోస్ బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై హీరోస్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది.

 

ఆదిలో తడబడ్డ ముంబై తరువాత తేరుకుని గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ముంబై ఆటగాళ్లలో బెహ్రావానీ(42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేయడం గమనార్హం. టాలీవుడ్ బౌలర్లలో జోషికి రెండు వికెట్లు లభించాయి.

Advertisement
Advertisement