♦ సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ముందు నల్లగొండ పేరెంట్స్
♦ భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ: మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపడం లేదు?
తల్లిదండ్రులు: సార్లను సరిగ్గా పంపండి, మేము కూడా పిల్లలను పంపుతాం.
కమిటీ: ఇప్పటినుంచి సక్రమంగా నడిపితే సర్కారు బడికి పిల్లలను పంపిస్తారా?
తల్లిదండ్రులు: హాయిగా పంపుతాం.. ప్రైవేట్లో చదివించాలంటే ఏటా రూ. 30 వేల వరకు ఖర్చవుతోంది. అన్నీ ఉంటే ప్రభుత్వ పాఠశాలలే మేలు కదా.!
ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఎదుట నల్లగొండ జిల్లాలోని తల్లిదండ్రులు వ్యక్తపరిచిన ఆవేదన. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిల్పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు కమిటీని నియమిం చింది. సీనియర్ న్యాయవాదులు అశోక్కుమార్ గుప్తా, టి.వి. రత్నం, వెంకటేశ్వరరావులతో కూడిన ఈ కమిటీ శుక్రవారం జిల్లాలోని ఆలేరు, భువనగిరి, తుర్కపల్లి మండలాల్లోని ఐదు పాఠశాలలను సందర్శిం చి చదువు మాన్పించిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడింది.
పాఠశాలలకు టీచర్లు టైమ్కు రావడం లేదని, కొన్ని పాఠశాలల్లో అసలు టీచర్లే లేరని, ఎప్పుడో వచ్చిన టీచర్లు విద్యార్థులను పట్టించుకోవడం లేదని త్రిసభ్య కమిటీకి విన్నవించారు. ఓ పాఠశాలలో అయితే ఫలానా ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు వస్తే తాము పిల్లలను పంపేది లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కొన్ని చోట్ల విద్యార్థులను కొడుతున్నారని, అందుకే సర్కార్ బడికి వెళ్లడంలేదని వివరించారు. చాలాచోట్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం పెట్టించాలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తే తాము పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని చెప్పారు. అయితే, కమిటీ వస్తున్న సందర్భంగా ఓ పాఠశాలలో అప్పటివరకు పేరుకుపోయిన చెత్తను శుక్రవారం ఉదయం హడావుడిగా తొల గించగా, మరోచోట బురదను కప్పేందుకు హడావుడిగా మట్టిని ట్రాక్టర్లో తెచ్చి పోయడం కన్పించింది. ఈ కమిటీతోపాటు పిటిషనర్ తరఫు న్యాయవాది కె. శ్రావణ్కుమార్, తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సాగర్రావు ఉన్నారు.
టీచర్లను పంపండి... పిల్లలను పంపుతాం
Published Sat, May 7 2016 4:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement