♦ ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలి: ముద్రగడ పద్మనాభం
♦ మీరు ఆ కిటుకేదో చెబితే మా జాతి కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది
♦ అప్పుడు ఏటా రూ.వేయి కోట్లూ అడగం
♦ సీఎం మొండి అయితే.. నేను జగమొండిని
♦ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకే వైద్య పరీక్షల పేరిట సర్కారు హడావుడి
♦ అవేవో బాబుకు చేయిస్తే ఎన్నికల హామీలు గుర్తుకొస్తాయన్న ముద్రగడ
కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి / సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘సీఎం గారూ... మీరు రెండెకరాల రైతు స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్ల రాజకీయ నేతగా ఎలా ఎదిగారో చెప్పండి..’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు తన ఎదుగుదల గురించి పత్రికాముఖంగా చెప్పాలి. ఆయన ఆ కిటుకేదో పదిమందికీ చెబితే, మా జాతి కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఏటా బడ్జెట్లో కేటాయించాల్సిందిగా కోరుతున్న రూ.1,000 కోట్లు కూడా అడగం..’ అని ముద్రగడ అన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది పోలీసులను దించినా దీక్షను విరమించేది లేదని తేల్చిచెప్పారు. కాపులకు రిజర్వేషన్లు, కాపు కమిషన్కు నిధులు, కాపు నేతలపై కేసుల ఎత్తివేత తదితర డిమాండ్లతో సతీసమేతంగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారానికి మూడోరోజుకు చేరింది. ఉదయం 9 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మొండి అయితే తాను జగమొండినన్నారు. జైల్లో పెట్టినా, సెలైన్ కట్టినా దీక్షను విరమించే ప్రశ్నే లేదన్నారు. ‘నీరసించి, కృశించి పోయి నేను దీక్షను ఆపుతానన్న భావన ప్రభుత్వంలో కనబడుతోంది.
అది ఎన్నటికీ జరగదు. సీఎం ఇచ్చిన హామీలన్నింటిపైనా సానుకూలంగా స్పందించాలి...’ అని ముద్రగడ స్పష్టం చేశారు. తమ ఆరోగ్యం బాగానే ఉందనీ, ప్రజానీకంలో తప్పుడు సంకేతాలు పంపేందుకే ప్రభుత్వం వైద్య పరీక్షల పేరిట హడావుడి చేస్తోందని విమర్శించారు. దీక్షలో ఉన్న తమ ఆరోగ్యం పాడవుతోందంటూ తప్పుడు బులెటిన్లు చెప్పించి తమను అభాసుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పంజాబ్, గుజరాత్ లలో ఒక సిక్కు వ్యక్తి 66 నుంచి 70 రోజుల వరకు దీక్ష చేసినట్లు విన్నా. పొట్టి శ్రీరాములు కూడా చాలా రోజులు దీక్ష చేశారు. అలాగే మేము కూడా ఆహారం లేకుండా ఉండగలం. దాన్ని చంద్రబాబు మెడికల్ హిస్టరీలో రాయించవచ్చు..’ అని వ్యాఖ్యానించారు. వైద్య పరీక్షల పేరిట అంబులెన్సు తెచ్చి ప్రతిసారీ హడావుడి చేయొద్దని, పదేపదే డిస్టర్బ్ చేయొద్దని కోరారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వైద్యులను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు.
బాబుకు వైద్య పరీక్షలు చేయించండి
‘నేను, నా శ్రీమతి ఇద్దరం బాగానే ఉన్నాం. మా ఆరోగ్యం బాగుంది. వైద్య పరీక్షలు అస్సలు వద్దు..’ అని ముద్రగడ తేల్చి చెప్పారు. వైద్యపరీక్షలకు అనుమతించాలని కోరిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో ఆయన పది నిమిషాల పాటు మాట్లాడారు. ‘మాకు చేయాలనుకుంటున్న వైద్య పరీక్షలేవో ముఖ్యమంత్రికి చేయించండి. ఆయన ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడన్నా ఆయనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయి. ఇదేదో వ్యంగ్యం కాదు. నిజంగానే చెబుతున్నాను. దయచేసి ముందు ఆ పని చేయించండి’ అని అధికారులను ముద్రగడ ప్రాధేయపడ్డారు.
ఒక సామాజిక ప్రయోజనం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడే తాను చావు గురించిన భయం వదిలేశానన్నారు. తన భార్యకు కూడా అలాంటి భయమేమీ లేదన్నారు. తన జాతి ప్రయోజనం కోసం అంకితం కావాలనుకున్న తనకు మరణం పెద్దలెక్క కాదన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందలేక భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న తమ జాతి బిడ్డల కోసం ఈ ఉద్యమం చేస్తున్నానని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఈ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించే బదులు... రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన కిటుకేదో చెబితే తమ జాతి కూడా ఆ విధంగా వృద్ధి చెందుతుందని ముద్రగడ వ్యాఖ్యానించారు.
2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లా?
Published Mon, Feb 8 2016 1:59 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement