హైదరాబాద్: తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్మేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఐదు కోట్ల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, మోదీ వస్తారు, చంద్రబాబు ఒత్తిడి తెస్తారని అనుకున్నారని అన్నారు. మోదీ వచ్చారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని తెచ్చారు, ఢిల్లీ పక్కన ప్రవహించే యమునా నది నుంచి కూడా నీళ్లు తెచ్చారని, గుర్తుచేశారు.
కానీ హోదా విషయంపై రాష్ట్రాన్ని విడగొడుతూ ఇచ్చిన మాట మాత్రం మరిచిపోయారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నోట వెంట వస్తుందనుకున్న ప్రకటన రాలేదని, తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు అమ్మేశారని చెప్పారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలపాలని వైఎస్ జగన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను చంద్రబాబుకు, మోదీకి ఈ నిరసనల ద్వారా తెలియజేయాలని కోరారు. ప్రత్యేక హోదా విషయంలో మనమంతా కలిసి పనిచేద్దామని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రత్యేక హోదాపై నోరు విప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని అన్నారు.
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన అసలు ఆ ఊసే ఎత్తకుండా వెళ్లిపోవడం అందరికీ దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రత్యేక హోదాపై తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా దాదాపు ఏడురోజులపాటు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రంలో ఏమాత్రం చలనం రాకపోగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కనీసం మోదీకి ఆ విషయం గుర్తు చేయకపోవడం పల్ల ఆవేదనను వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రత్యేక హోదా కోసం మరో పోరుకు అందరం సిద్ధం కావాలంటూ ఓ లేఖ విడుదల చేశారు.
'చంద్రబాబు హోదా అమ్మేశారు.. అందరం పోరాడదాం': వైఎస్ జగన్
Published Thu, Oct 22 2015 9:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement