మూతపడనున్న నోకియా ప్లాంటు | Nokia all set to suspend operations at Chennai plant tomorrow | Sakshi
Sakshi News home page

మూతపడనున్న నోకియా ప్లాంటు

Oct 31 2014 6:18 PM | Updated on Sep 2 2017 3:39 PM

మూతపడనున్న నోకియా ప్లాంటు

మూతపడనున్న నోకియా ప్లాంటు

శ్రీపెరుంబుదూర్ లో ఉన్న నోకియా ప్లాంటు నవంబర్ ఒకటో తేదీ నుంచి మూత పడనుంది.

చెన్నై: తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో ఉన్న నోకియా ప్లాంటు నవంబర్ ఒకటో తేదీ నుంచి మూత పడనుంది. మైక్రోసాఫ్ట్- నోకియా ఒప్పందంలో భాగంగా దీన్ని మూసివేయనున్నారు. దీంతో ఈ యూనిట్లో ఫోన్ల ఉత్పత్తి ఆగిపోనుంది.

2004లో తమిళనాడు ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు నోకియా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది. శ్రీపెరుంబుదూర్ నోకియా ప్లాంటులో 8 వేల మంది ప్రత్యక్షంగా, 25 వేల మంది పరోక్షంగా పనిచేస్తున్నారు. బెసిక్ జీఎస్ఎం ఫోన్లను ఇక్కడ తయారుచేస్తున్నారు. శనివారం నుంచి ఇక్కడ అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నోకియాను మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement