ఎస్తేరు అనూహ్య హత్య కేసు కొలిక్కి..
టాక్సీ డ్రైవర్ చంద్రభానే దోషి
ముంబై కోర్టు తీర్పుతో బందరులో కలకలం
మచిలీపట్నం : బందరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు అనూహ్య (23) హత్యకేసులో చిక్కుముడి వీడింది. 22 నెలల అనంతరం ఈ కేసులో ముంబై కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు నిందితుడిగా అనుమానిస్తున్న టాక్సీ డ్రైవర్ చంద్రభాన్నే దోషిగా తేల్చారు. బుధవారం అతడికి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన శింగవరపు జోనతాన్ ప్రసాద్ కుమార్తె ఎస్తేరు అనూహ్య ముంబైలోని టీసీఎస్ కార్యాలయంలో ఇంజినీరు. ఆమె 2013 డిసెంబరులో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు బందరు వచ్చారు. 2014 జనవరి నాలుగున విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. అక్కడి ఎల్టీటీ స్టేషన్లో రైలు దిగిన ఆమెను ట్యాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి వెంట తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 16వ తేదీన బాండూస్లోని ఈస్ట్రన్ ఎక్స్ప్రెస్ రహదారి సమీపంలో అనూహ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం 18వ తేదీన మృతదేహాన్ని మచిలీపట్నం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత అనూహ్య హత్యకేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ఈ హత్యకేసులో చంద్రభాన్ను ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది.
శిక్ష.. భయం గొలిపేలా ఉండాలి
ముంబై కోర్టు తీర్పు నేపథ్యంలో అనూహ్య తండ్రి జోనతాన్ ప్రసాద్ మంగళవారం బందరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించడం వల్లే పోలీసులు స్పందించారని తెలిపారు. 22 నెలల్లో దోషిని నిర్ధారించడం న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందన్నారు. నిందితుడు చంద్రభాన్కు కోర్టు విధించే శిక్ష నేరప్రవృత్తి ఉన్న వారికి భయం గొలిపేలా ఉండాలని సూచించారు. మీడియా, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే తన కుమార్తె హత్య కేసు ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ముంబైకి చెందిన జోన్-7 డీసీపీ వెంకట్పాటిల్ దర్యాప్తు అంశాలను తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవారని వివరించారు.
- జోనతాన్ ప్రసాద్, అనూహ్య తండ్రి
22 నెలలు!
Published Wed, Oct 28 2015 12:21 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
మీకు ప్రశ్నించే హక్కు ఉందా..?
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
కనిపించని ఏనుగు జాడ
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
ముగ్గురూ ఆడపిల్లలైనా..
తప్పక చదవండి
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
- Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
- Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
Advertisement