దండెత్తిన డ్వాక్రా మహిళలు

Published on Sat, 02/04/2023 - 02:19

కామారెడ్డి టౌన్‌ : స్త్రీ నిధి, అభయహస్తం, వడ్డీలేని రుణాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన 7 వేల మంది మహిళా సభ్యులు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్‌ నుంచి ర్యాలీ ప్రారంభమై సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, రైల్వే బ్రిడ్జి మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు.

కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రావలసిన రూ.6 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం త్వరలోనే చెల్లించాలన్నారు. రెండ్రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకుంటే 10 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ