amp pages | Sakshi

జీతం రూ.7,500.. అయితేనేం మనసు పెద్దది!

Published on Mon, 03/08/2021 - 08:45

ఒకరు అంగన్‌వాడి టీచర్‌.. ఇందులో ప్రత్యేకతేమిటంటారా? ఏడు పదుల వయసులోనూ ఈమె చెప్పే పాఠాలు వినడానికి పిల్లలు చెవికోసుకుంటారు. ఇక మరొకరు.. అరుణ. కాటికాపరి. శ్మశానమంటేనే భయపడే పరిస్థితుల్లో.. ఆమె మాత్రం మృతదేహానికి అంతిమ సంస్కారాల దగ్గరి నుంచి దహనం అయ్యే వరకు ఒంటిచేత్తో పనులు చక్కబెడుతుంది. ప్రత్యేకించి అనాథ శవాలకు ఆమె ఆత్మబంధువు.

భద్రాచలం: శవం, శ్మశానం.. ఈ పేర్లు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.. ఆ చోటునే తన జీవనాధారంగా చేసుకున్న కథ అరుణది. అనాథ శవాలకు, కోవిడ్‌ మృతులకు అన్నీ తానై అంతిమ సంస్కారాలను నిర్వహించిన ‘సంస్కారం’ ఆమెది. కాటికాపరిగా ఓ మహిళ.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అరుణ నిజం చేసి చూపిస్తోంది. భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణకు రాజమండ్రికి చెందిన శ్రీనివాస్‌తో 12 ఏళ్లప్పుడే పెళ్లయింది. 16 ఏళ్లొచ్చేసరికి ఇద్దరు కుమారులు జన్మించారు. శ్రీనివాస్‌ భద్రాచలంలోని వైకుంఠఘాట్‌లో పనిచేస్తూ, అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందాడు.

దీంతో అరుణ జీవితంలో అంధకారం.. ఏం చేయాలో తెలియని స్థితిలో గుండె ధైర్యం తెచ్చుకుని భర్త చనిపోయిన 16 రోజులకే శ్మశానవాటికలో అడుగుపెట్టింది. కాటికాపరిగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తీసుకుంది. అంత్యక్రియలకు కట్టెలు తదితర సామగ్రి, ఇతర ఖర్చుల నిమిత్తం మృతుడి కుటుంబసభ్యులు ఎంతో కొంత ఇస్తారు. కానీ అనాథ శవాలకు ఎవరూ చిల్లిగవ్వ ఇవ్వరు. అయినా అనాథ శవాలకు అన్నీ తానే అయి అంత్యక్రియలు నిర్వహిస్తోందీమె. రూ.7,500 జీతమే తన జీవనాధారమని చెబుతోంది.  అయినవారెవరూ కడచూపునకు రాకున్నా.. 15 మంది కరోనా మృతుల ఖనన కార్యక్రమాలను నిర్వహించింది అరుణ. వీరి అస్థికలను  తానే గోదావరిలో కలిపింది.

అవ్వ చెప్పే పాఠం.. ఎంతో ఇష్టం
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): భూలక్ష్మికి 70 ఏళ్లు. అంగన్‌వాడీ టీచర్‌గా ఇప్పటికీ చురుకుగా సేవలందిస్తున్నారు. పిల్లలకు తనదైన శైలిలో బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా అవార్డులూ పొందారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఈమె 1989 ఫిబ్రవరిలో అంగన్‌వాడీ కార్యకర్తగా విధుల్లో చేరారు. 32 ఏళ్లుగా నగరంలోని పూసలగల్లిలో అంగన్‌వాడీ టీచర్‌గా సేవలందిస్తున్నారు. చిన్నారులకు ఆట పాటలతో విద్యనందిస్తున్నారు. తనదైన శైలిలో చిన్నారులకు ప్రీస్కూల్‌ పాఠాలు చెబుతున్నారు.

దీంతో ఈ కేంద్రంలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు. కేంద్రంలో ఎప్పుడూ 20–30 మంది చిన్నారులు ఉంటారు. వయసు మీదపడినా.. ఆమె విధి నిర్వహణలో మాత్రం ఆ ఛాయలే కనిపించవు. దీంతో ఆమె పనితనానికి మెచ్చిన ఐసీడీఎస్‌ అధికారులు 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. చిన్నచిన్న బోధనోపకరణాలను ఉపయోగించి పిల్లలకు పూసగుచ్చినట్టు చెప్పడం, వారి వయసుకు తగ్గ రీతిలో బోధనాంశాలను మలచడం భూలక్ష్మి ప్రత్యేకత.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)