అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేసు కుక్క.. పెరిగిన లెక్క
Published on Tue, 04/12/2022 - 04:53
రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లాలోని అటవీప్రాంతంలో వైల్డ్డాగ్స్ (రేసు కుక్కలు) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పదులలో ఉన్న రేసుకుక్కల సంఖ్య ఈ రెండేళ్లలో రెండు వందలకుపైగా పెరిగింది. ఈ మేరకు రామాయంపేట, నర్సాపూర్, పోచారం అభయారణ్యం పరిధిలో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోల ఆధారంగా అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
రేసుకుక్కలు గుంపులుగా సంచరిస్తాయని, ఒక్కో గుంపులో కనీసం ఎనిమిది నుంచి పదిహేను వరకు ఉంటాయని అధికారులు అంటున్నారు. వీటి దాడి భయానకంగా, వేటాడే విధానం ప్రత్యేకంగా ఉంటుందని, వీటి బారిన పడిన ఏ జంతువైనా బతకడం అసాధ్యమని చెబుతున్నారు.
#
Tags