అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Venkaiah Naidu: రోశయ్యకు అభిమానిని
Published on Thu, 12/09/2021 - 04:33
అమీర్పేట: చిన్నతనం నుంచి కొణిజేటి రోశయ్యను బాగా అభిమానించేవాడినని, ఆయన కూడా తనను అభిమానంతో ఆప్యాయంగా పలకరించేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ రోజుల్లో రాజకీయ విభేదాలున్నప్పటికీ అనేక విషయాలపై తాము తరచూ మాట్లాడుకునేవారమని గుర్తు చేసుకున్నారు. బుధవారం అమీర్పేటలోని రోశయ్య నివాసానికి వచ్చిన ఉపరాష్ట్రపతి.. ముందుగా రోశయ్య చిత్ర పట్టం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆ రోజు తాను ఇక్కడ లేనని, వారి కుటుంబీకులను కలిసి సంతాపాన్ని తెలియజేయాలని వచ్చానని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంపీ కేవీపీ రాంచంద్రారావు, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్త తదితరులు ఉన్నారు.
#
Tags