రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిరుత దాడిలో రెండు మేకలు మృతి
Published on Fri, 10/15/2021 - 02:14
పెంబి(ఖానాపూర్): నిర్మల్ జిల్లా తాండ్ర రేంజ్ పరిధిలోని పస్పుల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల మందపై చిరుత దాడిచేసి రెండు మేకలను హతమార్చింది. పెంబి మండలం హరిచంద్తండాకు చెందిన పశువుల కాపరి టేకం రాజేశ్ బుధవారం మేకల మందతో పస్పుల అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మందపై చిరుత దాడి చేసింది. రాజేశ్ కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనపై అటవీ సిబ్బందికి సమాచారం అందించగా ఎఫ్ఎస్వో ప్రభాకర్, ఎఫ్బీవో నరేశ్, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి జీవాల కళేబరాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుత దాడిచేసిన ప్రాంతంలో అటవీ సిబ్బంది సీసీ కెమెరాలను బిగించారు. వాటిని గురువారం పరిశీలించగా, మేకల కళేబరాలను చిరుత ఎత్తుకెళ్లినట్లు నమోదైంది.
#
Tags