amp pages | Sakshi

ఎంసెట్‌ వాయిదా..!

Published on Mon, 07/11/2022 - 03:45

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ, వైద్య, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్‌ ఎంసెట్‌) విషయమై అధికారులు తర్జనభర్జన పడుతు­న్నారు. అనూహ్యంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా ఎంసెట్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి సోమవారం భేటీ కానుంది.

క్షేత్రస్థాయి పరిస్థితులు, వాతావరణ శాఖ నివేదిక ఆధారంగా వాస్తవ­పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్‌ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే, తాజాగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా స్తంభించింది.

చాలా ప్రాంతాలు జలమయ మయ్యాయి. విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు వెళ్లడం కూడా కష్టమేనని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. అనేకచోట్ల విద్యుత్‌ సరఫరాకు, ఇంటర్నెట్‌ సదుపాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరీక్షాకేంద్రాల్లో కూర్చునే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఎంసెట్‌ను వాయిదా వేయడమే సరైనదని అధికారులు భావిస్తున్నారు.

కొంత సమయం ఇద్దామా?
ఈసారి ఎంసెట్‌కు కూడా విపరీతమైన పోటీ ఉందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు.

ఈ నెల 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగంలో ఎంసెట్‌ చేపట్టాల్సి ఉంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా విద్యుత్, ఇంటర్నెట్‌ సదుపాయాలు తప్పకుండా ఉండాల్సిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు మౌలిక సదుపాయాలకు అంతరాయం ఏర్పడుతోంది. బేటరీలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల సాయంతో పరీక్షలు నిర్వహించినా, చాలామంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవడమే కష్టంగా ఉందని అంటున్నారు. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా పరిస్థితి ప్రతికూలంగానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

పరిస్థితిని అంచనా వేసి నిర్ణయిస్తాం
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్‌ నిర్వహణ సాధ్యమా? కాదా? అన్న విషయాన్ని సోమవారం చర్చిస్తాం. అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని 
అంచనా వేసి ఓ నిర్ణయానికి వస్తాం. ఎంసెట్‌ నిర్వహణకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ సలహా తీసుకుంటాం. 14వ తేదీ నాటికి పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే, పరీక్ష నిర్వహణకు వెనుకాడబోం.  
– ప్రొఫెసర్‌ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)