amp pages | Sakshi

పర్యాటకులను ఆకట్టుకునేలా సరికొత్త నినాదం... మీకిదే.. మా ఆహ్వానం..

Published on Sun, 03/06/2022 - 08:10

సాక్షి, హైదరాబాద్‌: ‘రండి.. హైదరాబాద్‌ను సందర్శించండి’ నగరం కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ టూర్‌లను నిర్వహిస్తున్న పర్యాటక సంస్థలు సరికొత్త నినాదంతో పర్యాటక ప్రియులను  ఆకట్టుకొనేందుకు ప్రణాళికలను రూపొందించాయి. వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాలను సందర్శించేందు కు అనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి.  

పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు.. 
రెండేళ్లపాటు కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ రాకపోకలను మార్చి నుంచి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన నేపథ్యంలో వివిధ సంస్థలు, నగరానికి చెందిన పలువురు టూర్‌ ఆపరేటర్లు, నిర్వాహక సంస్థలు, ఇంటాక్‌ తదితర సంస్థలతో జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  

అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో పర్యాటకుల రద్దీ  భారీగా ఉండే అవకాశం ఉందని వివిధ విభాగాలకు చెందిన  ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముచ్చింతల్‌లో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహం, యాదాద్రి, రామప్ప ఆలయం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు జాతీయ స్థాయి పర్యాటకులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో నగరానికి రావచ్చని  భావిస్తున్నారు. ఈ  క్రమంలో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు హైదరాబాద్‌ నుంచి అడ్వెంచర్‌ టూర్‌లు, హైదరాబాద్‌ విహంగ వీక్షణం కోసం బర్డ్‌ ఐ టూర్‌ వంటివి నిర్వహించాలని ఆపరేటర్లు  కేంద్ర, రాష్ట్రాల పర్యాటక సంస్థలను కోరారు.  

నేరుగా విమానాలు నడపండి..  

  • జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతాధికారి ప్రదీప్‌ పాణికర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు నేరుగా  విమానాలను నడిపేందుకు చర్యలు  తీసుకోవాలని పలువురు సూచించారు. సాధారణంగా  హైదరాబాద్‌ నుంచి రోజుకు  60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. వారిలో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు.  హైదరాబాద్‌ నుంచి  నేరుగా వెళ్లే విమానాలు పరిమితంగా ఉన్నాయి. గతంలో  చికాగోకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ ప్రారంభించారు. కానీ కోవిడ్‌ కారణంగా  ఆ సర్వీసు  నిలిచిపోయింది. 
  • హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు  వెళ్లే వాటిలో చాలా వరకు కనెక్టింగ్‌ ఫ్లైట్‌లే ఎక్కువ. ఈ క్రమంలో ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు హైదరాబాద్‌ నుంచి నేరుగా విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఈ  మేరకు స్పైస్‌జైట్, ఇండిగో, ఏఐఆర్, తదితర అన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో త్వరలో ‘హైదరాబాద్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌’ నిర్వహించనున్నారు.  

(చదవండి: ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)