amp pages | Sakshi

యూఎస్‌లో కారు ప్రమాదం.. ముగ్గురు తెలుగు విద్యార్థుల దుర్మరణం

Published on Thu, 10/27/2022 - 01:42

రామగిరి(నల్లగొండ)/వరంగల్‌ చౌరస్తా/కడియం: ఉన్నత చదువుల కోసం యూఎస్‌ వెళ్లిన ముగ్గురు తెలుగు విద్యార్థులు రెండు నెలల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొనడంతో ముగ్గు రూ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదోరిగూడెం గ్రామానికి చెందిన గోదా ప్రేమ్‌కుమార్‌రెడ్డి(26)తో పాటు వరంగల్‌ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన ఎంఎస్‌ విద్యార్థిని గుళ్లపెల్లి పావని (22), ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన పాటంశెట్టి సాయి నరసింహ (25) ఉన్నారు.

గోదోరిగూడేనికి చెందిన లక్ష్మారెడ్డి, లలిత దంపతు ల పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్‌ అమెరికాలోని న్యూ యార్క్‌ సాక్రెడ్‌హార్ట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతు న్నారు. ఆగస్టు 23న అమెరికాకు వెళ్లారు. ఇదిలా ఉండగా, సోమవారం స్నేహితులతో కలిసి ప్రేమ్‌కుమార్‌ విహారయా త్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు.

దట్టమైన మంచు కురుస్తుండటంతో సరిగా కనిపించక ఎదురుగా వస్తు న్న ట్రక్కును వీరి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఏడుగురి లో ప్రేమ్‌కుమార్, పావని, సాయి నరసింహ అక్కడికక్కడే మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామ న్నపేట మండలం వెల్లంకి గ్రా మానికి చెందిన మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. చదువు కోసం అమెరికా వెళ్లి రెండు నెలలు గడవక ముందే ప్రేమ్‌ మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, అమెరికా నుంచి మృతదేహాలను తీసుకురావడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. స్వదేశానికి రావడానికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. 

కొద్ది నెలల కిందటే అమెరికాకు..
గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేశ్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రమేశ్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. పావని ఎంఎస్సీ కోసం రెండు నెలల కిందట అమెరికా వెళ్లింది. పావని దీపావళి రోజు కుటుంబ సభ్యులతో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు బంధువులు తెలిపారు. కాగా, బుర్రిలంకకు చెందిన సాయి నరసింహ 3 నెలల క్రితమే ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ వెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన ఐశ్వర్య ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతోంది. 

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)