ఎనిమిదేళ్లలో ఎంతో సాధించాం 

Published on Fri, 06/03/2022 - 02:49

సిరిసిల్ల: దేశంలో 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ గత ఎనిమిదేళ్లలోనే సాధించిందని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు పేర్కొన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అస్తిత్వం కోసం 60ఏళ్లు పోరాడిన తెలంగాణ నేల.. ఇప్పుడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు.

ఎనిమిదేళ్ల స్పల్ప కాలంలోనే ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం కల్పన, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకుంటూ 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

కేసీఆర్‌ నాయకత్వంలో జలవిప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవాలతో దేశానికి ఆదర్శంగా నిలిచామని కేటీఆర్‌ చెప్పారు. పల్లె ప్రగతికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ