amp pages | Sakshi

దివ్యాంగులకు కావాల్సింది మద్దతు

Published on Fri, 12/04/2020 - 05:51

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగులు సమాజం నుంచి సానుభూతిని కాకుండా మద్దతును కోరుకుంటారని, వారికి సమాజం అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అసిస్టివ్‌ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన ‘అసిస్టివ్‌ టెక్నాలజీ సదస్సు 2020’లో ఆయన మాట్లాడుతూ ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు సాంకేతికతను ఉపయోగించుకుని దివ్యాంగులకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని సూచించారు. స్టార్టప్‌లు తయారు చేసే పరికరాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా అడుగు పడాలని, బధిరులు, అంధులతో పాటు అంగవైకల్యం కలిగిన వారికి అవసరమైన పరికరాలు తయారు కావాలని కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయం, మహిళల రక్షణతో పాటు సమాజంలో అవసరమైన రంగాలన్నింటిలో శాస్త్రీయ ఆవిష్కరణలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ఎగ్జిబిషన్‌ పరిశీలన 
దివ్యాంగులు నిత్యం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం స్టార్టప్‌లు రూపొందించిన ఆవిష్కరణలతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొటోటైప్‌ ఇంక్యుబేటర్‌ టీ వర్క్స్‌లో తమ ఆలోచనలకు రూపం ఇవ్వాలని స్టార్టప్‌లకు సూచించారు. ఆవిష్కర్తలు, విద్యార్థులు, స్టార్టప్‌లు రూపొం దించిన 30కి పైగా ఆవిష్కరణలను కేటీఆర్‌ పరిశీలించారు. ఐఐటీ హైదరాబాద్, టీ వర్క్స్, సోషల్‌ ఆల్ఫా, ఆర్ట్‌లాబ్‌ ఫౌండేషన్, అసిస్టెక్‌ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్‌ నేత్రవిజ్ఞాన సంస్థలు ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డా.వాసుదేవరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, దివ్యాంగుల సం క్షేమశాఖ కార్యదర్శి దివ్య, కమిషనర్‌ శైలజ, టీఎస్‌ఐసీ సీఈఓ రవి నారాయణ్‌ పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు: ఎంపీ సంతోష్‌కుమార్‌
సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో ఎంతోకాలం అవమానాలు, అసమానతలకు గురైన దివ్యాంగులు ఇటీవల అవకాశాలను అందిపుచ్చుకుని అనేక రం గాల్లో ప్రతిభ చూపుతున్నారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సంతోష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాం గుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, వారు ఆత్మగౌరవంతో బతికేలా ఆసరా పథకం ద్వారా ఆదుకుంటోందని పేర్కొన్నారు. దివ్యాంగులతో ముచ్చటించిన ఎంపీ సంతోష్‌ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. త్వరలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, అంధులకు లాప్‌టాప్స్, బధిరులకు 4జి స్మార్ట్‌ఫోన్లు, బ్యాటరీ వీల్‌చైర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాసుదేవరెడ్డి వెల్లడించారు.

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా రూ.3,016 పెన్షన్‌ అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు గురువారం కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు రూ.500 పెన్షన్‌ ఇవ్వగా, టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్‌ మొత్తాన్ని రూ.3,016కు పెంచిందన్నారు.

గత ఆరేళ్లుగా వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఉపయోగపడే వాహనాలు, అనేక ఇతర పరికరాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ కృషికి గత ఏడాది డిసెంబర్‌ 3న రాష్ట్రపతి అవార్డు దక్కిందని కవిత గుర్తు చేశారు. కవితను కలసిన వారిలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, 21 దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)