సీఎం పుట్టినరోజున ‘కోటి వృక్షార్చన’: ఎంపీ సంతోష్‌ 

Published on Sun, 02/07/2021 - 01:52

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ‘కోటి వృక్షార్చన’పేరిట కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ జె.సంతోష్‌కుమార్‌ వెల్లడించారు. ఒకే రోజు ఒకే గంటలో కోటి మొక్కలు నాటడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ‘కోటి వృక్షార్చన’కు సంబంధించిన పోస్టర్‌ను మంత్రులు కేటీ రామారావు, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ మాలోత్‌ కవితతో కలిసి శనివారం సంతోష్‌ ఆవిష్కరించారు. దేశం, రాష్ట్రం హరితమయం కావాలనే సంకల్పంతో గ్రీన్‌ ఇండి యా చాలెంజ్‌లో పాల్గొంటున్న వారికి వృక్షార్చనకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటి ఫొటోలను మొబైల్‌ యాప్‌లో పంపితే సీఎం నుంచి ‘వనమాలి’అనే బిరుదును ఈ–మెయిల్‌/మొబైల్‌కు పంపిస్తామని వివరించారు.   

చదవండి: (నీతి ఆయోగ్‌ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ)

చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్‌!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ