రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్రీమీలేయర్తో ఓబీసీ విద్యార్థులకు నష్టం
Published on Sat, 11/27/2021 - 02:48
సాక్షి, హైదరాబాద్: క్రీమీలేయర్ విధానంతో వేలాదిమంది ఓబీసీ విద్యార్థులకు యూపీఎస్సీలో తీవ్ర నష్టం జరుగుతుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జరుగుతున్న నష్టం గురించి తనను శుక్రవారం కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు మంత్రి వివరించారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉండి రూ. 8 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వారి కుటుంబాలకు క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయాలనే నిబంధలున్నా.. ఎక్కడా అమలు కావడం లేదన్నారు.
దీనిపై రాష్ట్ర బీసీ కమిషన్ సమగ్రమైన నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కృష్ణమోహన్కు మంత్రి సూచించారు. ఈ భేటీలో మహబూబ్నగర్ జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు గిరిగౌడ్, తిరుపతి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags