amp pages | Sakshi

టీకాల సమస్య పరిష్కరించండి: మంత్రి ఈటల రాజేందర్‌

Published on Mon, 04/19/2021 - 02:54

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు శనివారంతో ఖాళీ కావడం వల్ల వ్యాక్సినేషన్‌ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు సరాసరి లక్షన్నర టీకా డోసులు వేస్తున్నామని, రోజుకు 10 లక్షల టీకాలు వేసే సామర్థ్యం కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌  సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 

ప్రాణవాయువు కొరత లేదు... 
కరోనా తీవ్రత పెరుగుతున్నందున ఆక్సిజన్‌  కొరత లేకుండా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు 260 టన్నుల ఆక్సిజన్‌  అవసరం పడుతోందని, రోగుల సంఖ్య పెరిగితే మున్ముందు 360 టన్నులు అవసరం అవుతుందన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్‌ కు కొరత లేదన్నారు. రోగుల కోరిక మేరకు కాకుండా అవసరాన్ని బట్టి ప్రైవేట్, ప్రభుత్వ డాక్టర్లు ఆక్సిజన్‌  ఇవ్వాలన్నారు. కొందరైతే రక్తంలో ఆక్సిజన్‌  స్థాయిలు 95–96 శాతం ఉన్నా ఆక్సిజన్‌  పెట్టాలని కోరుతున్నారన్నారు. మరోవైపు కొందరు రోగులే రెమిడిసివీర్‌ ఇంజెక్షన్‌  ఇవ్వాలని కోరుతున్నారన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రెమిడెసివిర్‌ పంపినట్లు వివరించారు.

గత 4 నెలలుగా కరోనా కేసులు తగ్గినందున డిమాండ్‌ లేకపోవడంతో కంపెనీలు రెమిడెసివీర్‌ తయారీని తగ్గించాయన్నారు. వాటిని తయారు చేశాక 15 రోజుల పాటు పరిశీలించాలి. ఈ నేపథ్యంలో 15 రోజుల ప్రొటోకాల్‌ను కొన్ని దేశాలు వారానికి తగ్గించాయి. ఆ ప్రకారమే ఇక్కడ చేయాలని కేంద్రాన్ని కోరామని, అలా అనుమతి వస్తే త్వరలో 3 లక్షల ఇంజెక్షన్లు తెలంగాణకు వస్తాయన్నారు. రెమిడెసివర్‌ తయారీ కంపెనీలతో సీఎం కేసీఆర్‌ నిత్యం మాట్లాడుతున్నారన్నారు. పారిశ్రామిక అవసరాలకు వాడకం తగ్గించి ఆస్పత్రులకు ఆక్సిజన్‌  సరఫరా చేయాలని కూడా సీఎం సూచించారన్నారు. ఎవరికైనా అవసరమైతే రోగుల చిటీ తీసుకొస్తే డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు రెమిడెసివిర్‌ ఇస్తారన్నారు. అయినా అది సర్వరోగ నివారిణి కాదన్నారు. 

ఎక్కడా పడకల కొరత లేదు... 
కొన్ని ఆసుపత్రులు మినహాయిస్తే రాష్ట్రంలో ఎక్కడా పడకల కొరత లేదని మంత్రి ఈటల అన్నారు. ప్రతి రోగికీ స్పెషలిస్టులు అవసరంలేదని, సాధారణ ఎంబీబీఎస్‌ డాక్టర్లు కూడా కరోనా చికిత్స చేయవచ్చని ఆయన చెప్పారు. 95 శాతం మంది కరోనా రోగులకు లక్షణాలు ఉండట్లేదని, కాబట్టి వారికెవరికీ ఆస్పత్రుల అవసరం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 63 వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నా సీరియస్‌ కేసులు తక్కువగా ఉంటున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని, అందుకే మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖను అప్రమత్తం చేశారన్నారు. శానిటైజేషన్‌  పెంచుతామన్నారు. లాక్‌డౌన్, కరŠూప్య పెట్టబోమని, అటువంటి అవసరం లేదని ఈటల స్పష్టం చేశారు. కరోనా రాకుండా చూసుకోవడంలో మాస్క్‌లే శ్రీరామరక్ష అన్నారు. 

కరోనా కట్టడిలో దేశంలోనే ముందున్నాం... 
కరోనా కట్టడిలో రాష్ట్రం దేశంలోనే ముందుందని ఈటల చెప్పారు. తెలంగాణలో మరణాలు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. కరోనా నియంత్రణకు అవసరమైతే రూ. వందల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, తాను ఇప్పటివరకు సాధారణ మాస్కే పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నానన్నారు. 

గాలి ద్వారా వైరస్‌ వదంతే... 
గాలి ద్వారా కరోనా వైరస్‌ సోకుతుందని వదంతులు వస్తున్నాయని, అయితే దీన్ని ఎలా చెప్పగలమని ఈటల ప్రశ్నించారు. వైరస్‌ ఏ విధంగా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదన్నారు. ఇప్పటివరకు 99.5 శాతం మందికి కరోనా సోకినా నయమైందని, మిగిలినవారిలో కొందరు మరణించారన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సీరియస్‌ కేసులను గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నాయన్నారు. సెకెండ్‌ వేవ్‌ దేశాన్ని, రాష్ట్రాన్ని వణికిస్తుందన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు బాగా పెరిగాయన్నారు. 45 ఏళ్లు పైబడిన వారంతా టీకా తీసుకోవాలన్నారు. యువత కూడా వైరస్‌ బారిన పడుతున్న దృష్ట్యా 25 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌  దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు స్పందించలేదని ఈటల పేర్కొన్నారు. గతంలో 10–12 రోజులకు కరోనా లక్షణాలు కనిపించేవనీ, కానీ సెకండ్‌ వేవ్‌లో 2–3 రోజులకే తీవ్రత పెరుగుతోందన్నారు. 

     

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)