amp pages | Sakshi

80 మోటార్లతో ఎత్తిపోతలు

Published on Wed, 09/30/2020 - 05:23

సిరిసిల్ల: కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశామని, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించామని రాష్ట్ర ప్రభుత్వం సగౌరవంగా చెబుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే 9వ ప్యాకేజీ పనులకు ఇప్పుడు భూగర్భంలో ఉబికి వస్తున్న నీటి ఊటలు ప్రతిబంధకంగా మారాయి. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించే ఈ ప్యాకేజీ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ సొరంగంలో నీటి ఊటలతో లక్ష్యం నీరుగారుతోంది. కాంట్రాక్టర్లు 900 హెచ్‌పీల సామర్థ్యంతో 80 మోటార్లను అమర్చి రేయింబవళ్లు సొరంగంలోని నీటిని బయటకు ఎత్తిపోస్తున్నా..ఉబికి వస్తున్న ఊటలు తగ్గడం లేదు. సొరంగంలో లైనింగ్‌ పనులు సాగడం లేదు. 

ఇదీ లక్ష్యం.. 
జిల్లాలోని మధ్యమానేరు బ్యాక్‌ వాటర్‌ సిరిసిల్ల పట్టణాన్ని తాకి ఉన్నాయి. ఈ నీటిని అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా సిరిసిల్ల నుంచి కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ వరకు సొరంగం ద్వారా మళ్లించాల్సి ఉంది. ఇందు కోసం 13 కిలోమీటర్ల సొరంగం పనులు 2013 నుంచి కొనసాగుతున్నాయి. సొరంగంలోని లైనింగ్‌ కెనాల్‌తో గ్రావిటీ ద్వారా మల్క పేట వరకు గోదావరి జలాలు చేరుతాయి. మల్కపేట వద్ద పంపింగ్‌ స్టేషన్‌లో రెండు 30 మెగావాట్ల మోటార్లతో నీటిని ఎత్తి మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గంభీరావు పేట మండలం సింగసముద్రం చెరువులోకి అక్కడ ఏర్పాటు చేసిన రెండు 2.25 మెగావాట్ల మోటార్లతో నీటిని ఎత్తిపోస్తారు.

గ్రావిటీ ద్వారా ముస్తఫానగర్‌ బట్టలచెరువు నింపి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నర్మాల ఎగువ మానేరు నింపుతారు. 2.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎగువ మానేరు నిండితే.. సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.996.01 కోట్లతో 9వ ప్యాకేజీ పనులు చేపట్టారు. కానీ ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలోని కూడెల్లి, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగులు పారడంతో సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ఎగువ మానేరు నిండి మత్తడి దూకుతోంది. మంత్రి కేటీఆర్‌ కాళేశ్వరం నీటితో ఎగువ మానేరు నింపాలని భావించగా.. సమృద్ధిగా వర్షాలు పడి అప్పర్‌ మానేరు నిండడం విశేషం. కాగా, 9వ ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఆర్థికంగా నీటిని ఎత్తిపోయడం అదనపు భారమే.  

సమాంతరంగా ఇతర పనులు చేయిస్తున్నాం.. 
సొరంగంలో నీటి ఊటల కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. సొరంగంలో లైనింగ్‌ పనులు సాగడం లేదు. సమాంతరంగా ఇతర పనులు చేయిస్తున్నాం. సింగసముద్రం వద్ద పంపు, మోటారు ఏర్పాటు, గ్రావిటీ కెనాల్‌ పనులు చేయిస్తున్నాం. నీరు తగ్గగానే సొరంగంలో లైనింగ్‌ పనులు పూర్తి అవుతాయి. టాప్‌ ప్రయార్టీగా 9వ ప్యాకేజీ పనులు చేస్తున్నాం.
– గంగం శ్రీనివాస్‌రెడ్డి, 9వ ప్యాకేజీ ఈఈ    

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)