విద్యుత్‌ బకాయిలపై కేంద్రం ఆదేశాలు.. రాష్ట్రంపై కక్ష సాధింపు

Published on Tue, 08/30/2022 - 01:29

సాక్షి, హైదరాబాద్‌:  ఏపీకి నెల రోజుల్లో విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఏకపక్షంగా ఆదేశించడం దుర్మార్గమని, కక్షసాధింపు చర్య అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. జాతీయ ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని కుట్రలు పన్నుతోంది.

విద్యుత్, బకాయిలు, పీపీఏల విషయంలో తెలంగాణకు ఏపీ తీవ్ర నష్టం చేసినా ఎప్పుడూ కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఏపీ నుంచి రూ.12,900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మొర పెట్టుకున్నా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది’’ అని పేర్కొన్నారు. గుజరాత్‌ సహా అన్నిరాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం నెలకొని ఉందని, ఎడాపెడా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని.. కానీ తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తుండటం కేంద్రానికి కంటగింపుగా మారిందని ఆరోపించారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ