Hyderabad: జేబులో ఉన్న డబ్బులు లాక్కున్న హిజ్రాలు.. ఇదేంటని ప్రశ్నిస్తే..

Published on Sat, 05/21/2022 - 08:19

సాక్షి, బంజారాహిల్స్‌: యువకుడి నుంచి డబ్బులు లాక్కోవడమే కాకుండా రాయితో కొట్టి గాయపర్చిన ఘటనలో ఇద్దరు హిజ్రాలపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలివీ... గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మదీనా వద్ద నివసించే సయ్యద్‌ షాబాజ్‌(26) కృష్ణానగర్‌ వైపు నుంచి ఇందిరానగర్‌ వైపు బైక్‌పై వస్తుండగా ఇద్దరు హిజ్రాలు అడ్డగించారు. ఆయనతో మాటా మాటా కలిపారు.

మాటల్లోకి దింపి ఆయన జేబులో ఉన్న రూ. 500లు లాక్కున్నారు. ఇదేమిటని ఆ యువకుడు ప్రశ్నిస్తుండగానే మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారి నుంచి తప్పించుకొని వెళ్తుండగానే ఓ హిజ్రా రాయితో కొట్టడంతో షాబాజ్‌కు గాయాలయ్యాయి. అదే రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రాల కోసం గాలిస్తున్నారు. 
చదవండి: తాత కళ్లముందే దారుణం.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య?

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ