వామ్మో.. కొంపముంచిన సేవా కార్యక్రమం..

Published on Mon, 04/12/2021 - 09:16

సాక్షి, లంగర్‌హౌస్‌: లంగర్‌హౌస్‌లో ఓ సంఘం వారు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు శాపంగా మారాయి. నిర్వాహకులతో పాటు అక్కడికి వచ్చిన వారు కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజుల క్రితం గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. కాగా లంగర్‌హౌస్‌కు చెందిన ఓ సంఘం వారు వీరికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది అభ్యర్థులు భోజనాలు చేశారు.

కాగా వారం తరువాత సేవా కార్యక్రమాలు నిర్వహించిన పలువురి సుస్తి చేసింది. కాగా వీరిలో చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వీరిలో చాలా మంది వైద్యుల సలహాలతో మందులు తీసుకుని హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. కాగా ఈ సంఘటనలో పదుల సంఖ్యలో వైరస్‌ బారినపడ్డారని తెలిసింది.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ