amp pages | Sakshi

10 లక్షలు దాటిన కరోనా టెస్టులు

Published on Wed, 08/26/2020 - 06:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే రోజురోజుకూ ఈ టెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా టెస్టులు 10,21,054 జరిగాయి. అందులో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 52,933 పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతీ 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 27,502కు చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1,08,670 మందికి కరోనా సోకింది. అందులో 84,163 మంది కోలుకోగా, 770 మంది మరణించారు. ప్రస్తుతం 23,737 యాక్టివ్‌ కేసులున్నాయి. వాటిల్లో 17,226 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ఇక సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 2,579 కరోనా కేసులు బయటపడ్డాయి. అలాగే మరో 9 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 1,752 మంది కోలుకున్నారు. ఇదిలావుండగా మొత్తం రాష్ట్రంలో కోలుకున్నవారు 77.44 శాతం ఉండగా, మరణాలు 0.70 శాతంగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో మొత్తం 16 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తుండగా, 1,076 చోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. ఇక ప్రైవేట్‌లో 31 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. 

జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 295 కేసులు..
సోమవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 186, ఖమ్మంలో 161, వరంగల్‌ అర్బన్‌లో 143, నిజామాబాద్‌లో 142, నల్లగొండలో 129, కరీంనగర్‌లో 116, మేడ్చల్‌లో 106, మంచిర్యాలలో 104, జగిత్యాల జిల్లాలో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)