స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మత్స్యకారులకు హెల్త్కార్డులు ఇవ్వాలి
Published on Sun, 02/12/2023 - 03:20
సాక్షి, హైదరాబాద్: తమకు రూ.10 లక్షల కవరేజీతో హెల్త్కార్డులు ఇవ్వాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మత్స్యకారులను ఆదుకోవాలంటూ టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారని చెపుతున్నారు.
అనూహ్యంగా ఆటోలో అసెంబ్లీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, రూ.10 లక్షల కవరేజీతో హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
#
Tags