ధాన్యం కొనుగోలు.. రెండ్రోజుల్లో ప్రకటన: కేంద్ర మంత్రి

Published on Tue, 11/23/2021 - 21:35

సాక్షి, ఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలుపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు గంట 23 నిమిషాలపాటు సాగిన భేటీ ఎటూ తేల్చలేదు. మంగళవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ బృందం భేటీ ముగిసింది. ఖరీఫ్, యాసంగి సీజన్లలో 150 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేటీఆర్ బృందం వినతిపత్రం ఇచ్చింది. కొంతమేర అధికంగా కొనుగోలు చేసేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక సమావేశం మధ్యలోనే ధాన్యం పంట విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కేంద్రమంత్రి గోయల్‌ సంభాషించారు.

రెండు రోజుల తర్వాత నిర్దిష్టంగా ఎంత కొనుగోలు చేసే అంశాన్ని చెబుతామని కేంద్రం తెలిపింది. 26వ తేదీన మరోసారి కలవాలని కేంద్ర మంత్రి కోరారు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్ర ప్రకటన చేయాలని తెలంగాణ బృందం విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత తామే రైతులను ఒప్పిస్తామని తెలంగాణ మంత్రులు వెల్లడించారు. భేటీ అనంతరం తెలంగాణ మంత్రుల బృందాన్ని వెంటబెట్టుకొని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కేంద్ర మంత్రి గోయల్ కలిపించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ