దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
Breaking News
విద్యా రుణాలు ఇచ్చేందుకు సిద్ధం
Published on Thu, 11/16/2023 - 01:38
వేలూరు: విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యా రుణాలను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అన్నారు. వేలూరు అరియూరులోని నారాయణి నర్సింగ్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు రుణమేళా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రుణ చెక్కులను అందజేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన రుణాలను అందజేసేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయమన్నారు. ప్రస్తుతం 15 నర్సింగ్ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పొందడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది విద్యార్థులకు విద్యా రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుందని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఆర్ఒ మాలతి, విద్యా రుణాల రాష్ట్ర ఆర్గనైజర్ వనంగాముడి, లీడ్ బ్యాంకు మేనేజర్ జమిలుద్దీన్, ఉన్నత విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎయువలన్, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ భానుమతి, సబ్ కలెక్టర్ కవిత పాల్గొన్నారు.
Tags