ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి
Published on Thu, 11/16/2023 - 01:38
● రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రాజారామన్ ● లోతట్టు ప్రాంతాల్లో మరింత నిఘా
తిరువళ్లూరు: జిల్లాకు భారీ వర్షం సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా మానిటరింగ్ అధికారి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి రాజారామన్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజారామన్ జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ప్రభుశంకర్, అన్ని శాఖలకు చెందిఽన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజారామన్ మాట్లాడుతూ జిల్లాకు భారీ వర్ష సూచన వున్న నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ, పీడబ్ల్యూడీ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే అక్కడ వారికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. చెరువుల కరకట్ట బలహీనంగా వున్న ప్రాంతాల్లోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీఏఓలు, అసిస్టెంట్లు తాము పనిచేసే గ్రామాల్లోనే తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు సుఖపుత్ర, ఆయుష్ వెంకట్, షేక్అబ్దుల్ రఘమాన్, డీఆర్వో రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags