అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నదిలో దూకి ఉద్యోగి ఆత్మహత్య
Published on Fri, 06/02/2023 - 01:00
తిరువొత్తియూరు: అడయారు తిరువిక వంతెన వద్ద నదిలో దూకి బుధవారం రాత్రి ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె మందవెల్లి మొదటి వీధికి చెందిన రామచంద్రన్ (36) వేళచ్చేరిలో వున్న ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. అతను బుధవారం రాత్రి అడయారు తిరువికా వంతెన వద్ద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న అడయారు పోలీసులు తిరువాన్మియూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలించారు. గురువారం ఉదయం 6.45 గంటలకు నదిలో రామచంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో తీవ్ర ఒత్తిడికి గురై నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags