అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
FIFA Under-17: అమెరికా చేతిలో భారత్ ఘోర పరాభవం
Published on Wed, 10/12/2022 - 09:40
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆతిథ్య భారత్ పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0–8 గోల్స్ తేడాతో 2008 రన్నరప్ అమెరికా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అమెరికా తరఫున మెలీనా రెబింబాస్ (9వ, 31వ ని.లో) రెండు గోల్స్ చేసింది.
ఆ తర్వాత చార్లోటి కోలెర్ (15వ ని.లో), ఒన్యెకా గమెరో (23వ ని.లో), గిసెలీ థాంప్సన్ (39వ ని.లో), ఎల్లా ఇమ్రి (51వ ని.లో), టేలర్ స్వారెజ్ (59వ ని.లో), మియా భుటా (62వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మరో మ్యాచ్లో బ్రెజిల్ 1–0తో మొరాకోపై నెగ్గింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను 14న మొరాకోతో ఆడుతుంది.
#
Tags