యాషెస్‌ సిరీస్‌లో తెలంగాణ బిడ్డ.. 

Published on Tue, 12/14/2021 - 17:42

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో(2021-22) తెలంగాణ కుర్రాడు రాకేశ్ దేవారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్‌ 16 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు సంబంధించిన తెలుగు కామెంటరీ బాక్స్‌లో రాకేశ్‌ వ్యాఖ్యాతగా కనిపించనున్నాడు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రాకేశ్.. మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, సబా కరీం, లక్ష్మణ్ శివరామకృష్ణన్‌లతో పాటు విశ్లేషకులు వెంకటేష్ సుధీర్‌లతో కలిసి కామెంట్రీ బాక్స్‌ని షేర్ చేసుకోబోతున్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాకేశ్‌కు ఈ గౌరవం దక్కడం తెలంగాణ ప్రాంతానికే గౌరవమని ఆ ప్రాంత ప్రజలు ముచ్చట పడిపోతున్నారు. 

సింగరేణి నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్‌.. చిన్నతనం నుంచి క్రికెట్‌ ఆడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు. చదువుల్లో రాణిస్తూనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన ఎన్నో లీగ్‌ల్లో పాల్గొని రాణించాడు. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డ రాకేశ్‌.. ఉద్యోగం చేసుకుంటూనే క్రికెట్‌ విశ్లేకుడిగా, వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.
చదవండి: గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్‌ మజాక్‌.. వీడియో వైరల్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ