వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. పాకిస్తాన్దే టి20 సిరీస్
Published on Wed, 12/15/2021 - 08:00
కరాచీ: వెస్టిండీస్తో రెండో టి20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది.
#
Tags