పార్లమెంట్‌ ఉంది యుద్ధాలకు కాదు 

Published on Sat, 07/16/2022 - 00:39

సాక్షి, హైదరాబాద్‌: ‘పార్లమెంట్‌ ఉంది యుద్ధాలు చేసేందుకు కాదు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల్లో యుద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వడంపై ఆయనపై ఈ విధంగా స్పందించారు. శుక్రవారం  కిషన్‌రెడ్డి మీడియాతో మా­ట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పీఠం కదిలిపోతోంది కాబట్టే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నా­రని విమర్శించారు.

అందువల్లే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కేసీఆర్‌ మాట్లా­డు­తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌ బలవంతంగా కుటుంబ పాలనను రుద్ది, నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు తమ కేబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌ వద్ద తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దేనని మరోసారి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.

రాష్ట్ర ప్రభు­త్వంతో ఒప్పందం చేసుకున్న మేరకు ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా ధాన్యం తామే కొంటున్నామని చెబుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే బియ్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. భారీవర్షాలు, వరదల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు పర్యటిస్తాయని తెలిపారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)