amp pages | Sakshi

మరికొందరికీ గాలం?

Published on Sat, 11/05/2022 - 03:22

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని మూడో కంటికి తెలియకుండా ముగించాలని బీజేపీ ప్రయత్నించిందని.. అయితే తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో గుట్టురట్టయిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఫామ్‌హౌజ్‌ వ్యవహారంలో ఉన్న నలుగురేగాకుండా మరికొందరు ఎమ్మెల్యేల ను లక్ష్యంగా ప్రయత్నాలు జరిగాయని, ఆ సమా చారం కూడా తమ వద్ద ఉందని అంటున్నాయి.

ఇందులో బీజేపీ కీలక నేతల ఆదేశాలతోనే ఎమ్మె ల్యేలతో భేటీ తదుపరి కార్యక్రమాన్ని హైదరాబా ద్‌లో కాకుండా ఢిల్లీకి మార్చేందుకు సిద్ధమయ్యా రని వెల్లడిస్తున్నాయి. అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌజ్‌లో జరిగిన సంభాషణల కంటే ముందు జరిగిన సంభాషణల్లో మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయ ని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. గతనెల 26న ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తూ ముగ్గురు వ్యక్తులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా.. అంతకు నెల రోజుల ముందు నుంచే ‘ఎమ్మెల్యేలకు ఎర’ పని కొనసాగిందని గుర్తు చేస్తున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వచ్చేలా చేయడంలో క్రియాశీల పాత్ర పోషించిన తిరుపతికి చెందిన సింహయాజి తెలంగాణలో అదే తరహా ప్రయత్నా లు ప్రారంభించారని.. పార్టీ మారే అవకాశమున్న ఎమ్మెల్యేలను గుర్తించే పనిలో ఆయనకు నందుకుమార్‌ సాయం చేశారని వివరిస్తున్నాయి.

‘ఎర’కు తగిలే వారి కోసం రెక్కీ
తెలంగాణ శాసనసభలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజా రిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు. అయితే అధికార పార్టీకి చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. కేసీఆర్‌ నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని సింహయాజి, నందుకుమార్‌లకు ఢిల్లీ దూత రామచంద్ర భారతి చెప్పారని, ఈ విషయం వారం క్రితం బయటికొచ్చిన ఆడియో టేప్‌లోనూ ఉందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

2014 తర్వాత వివిధ సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నా మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నాలు చేశారని వివరించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యమున్న 31 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 40మందిని లక్ష్యంగా చేసుకోవాలని భావించారని వెల్లడించారు.

ఈ క్రమంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి తో నందుకుమార్‌ ప్రాథమిక సంప్రదింపులు జరి పారని, తర్వాత సింహయాజి పూర్తిస్థాయిలో టచ్‌ లోకి వచ్చారని తెలిపారు. చేవెళ్ల, పరిగి, కొడంగల్‌ ఎమ్మెల్యేలకూ ఎర వేసేందుకు వారు సిద్ధ మయ్యా రని.. మొత్తంగా పార్టీ మారడంపై సుమారు 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మనోగతాన్ని తెలుసు కునేందుకు ప్రయత్నించారని వివరించారు.

‘గిట్టుబాటు’ కోసమే ఆపరేషన్‌కు సిద్ధం!
కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారడంలో కీలకపాత్ర పోషించిన సింహయాజికి కమిషన్‌ రూపంలో భారీగా గిట్టుబాటు కావడంతో తెలంగాణ ‘ఆపరేషన్‌’కు సిద్ధమయ్యారని ఇంకా వెలుగు చూడని వీడియో, ఆడియో టేపుల్లో ఉన్నట్టు టీఆర్‌ ఎస్‌ వర్గాలు తెలిపాయి. నందుకుమార్‌ కూడా కమిషన్‌తోపాటు నామినేటెడ్‌ పదవి ఆశతో సింహయాజితో చేతులు కలిపారని వివరించాయి.

నందుకుమార్‌కు ఏదైనా పదవి ఇవ్వడంతోపాటు భద్రత కూడా కల్పించాలని ఇంతకుముందే విడు దలైన ఆడియో సంభాషణల్లో ఉన్నట్టు గుర్తు చేశాయి. నందుకుమార్, సింహయాజిల ప్రయ త్నాల్లో పైలట్‌ రోహిత్‌రెడ్డి నుంచి సానుకూల స్పందన రావడంతో.. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి రంగ ప్రవేశం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించాయి.

కానీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో కీలక మలుపు తిరిగిందని వెల్లడించాయి. కనీసం నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటేనే డీల్‌ సాధ్యమని రామచంద్ర భారతి చెప్పడంతో.. రోహిత్‌రెడ్డికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తోడైన ట్టు తెలిపాయి. రామచంద్ర భారతికి నమ్మకం కలిగించేందుకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలను చివరి నిమిషంలో భాగస్వాములను చేశారని వివరించాయి.

ముగ్గురు నిందితులతో ఫామ్‌హౌజ్‌లో జరిగిన భేటీలో.. రోహిత్‌రెడ్డి చురుగ్గా చర్చల్లో పాల్గొనగా, మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారి నుంచి ప్రభుత్వాల కూల్చివేత, నగదు బదిలీ, ఢిల్లీలో ఎవరు ఆపరేట్‌ చేస్తారన్న అంశాలపై కూపీ లాగే ప్రయత్నం చేశారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి వ్యూహాత్మకంగా తమకు హిందీ భాష తెలియదంటూ చర్చల్లో మౌనం పాటించినట్టు వివరించాయి. 

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)