amp pages | Sakshi

ధరలు పెంచి.. ధర్నాలు చేస్తారా?

Published on Mon, 11/08/2021 - 18:34

సాక్షి, అమరావతి: ‘పెట్రోల్, డీజిల్‌ ధరలు మీరే పెంచేసి.. వాటిని తగ్గించాలని ధర్నాలు చేస్తారా?’ అంటూ బీజేపీ, టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ‘ఎక్సైజ్‌ సుంకం పిసరంత ఉంటే కొండంత సెస్సులు వేసి పెట్రోల్, డీజిల్‌ ధర లీటర్‌ను రూ.వంద దాటించి, రూ.ఐదో, పదో తగ్గించి.. రాష్ట్రాలను ధర తగ్గించాలని ధర్నాలు చేయడంకంటే దిగజారుడుతనం మరొకటి ఉంటుందా?’ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. 2015 ఫిబ్రవరి 5 నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ లీటర్‌పై రూ.4 చొప్పున వ్యాట్‌ విధించింది టీడీపీ సర్కారు కాదా అని చంద్రబాబును నిలదీశారు. పెట్రోల్, డీజిల్‌ ధరలను సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు పెంచలేదని స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోకపోవడంవల్ల అవి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి మరమ్మతులు చేయడం కోసమే పెట్రోల్, డీజిల్‌పై కేవలం లీటరుకు రూ.1 చొప్పున సెస్‌ విధించామని తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు వారు చేసిన తప్పులు, పాపాలను వైఎస్సార్‌సీపీ సర్కారుపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  

సెస్సుల రూపంలో కేంద్రం రూ. లక్షల కోట్లు వసూలు 
‘2017లో కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గితే.. దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయని.. ముడి చమురు ధరలు పెరిగితే వీటి ధరలు పెరుగుతాయని చెప్పింది. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్రం తగ్గించలేదు. సెస్సుల రూపంలో లక్షల కోట్లు వసూలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం, సెస్సుల రూపంలో కేంద్రానికి 2016–17లో రూ.3,35,175 కోట్లు, 2017–18లో రూ.3,36,163 కోట్లు, 2018–19లో రూ.3,48,041 కోట్లు, 2019–20లో రూ.3,34,315 కోట్ల ఆదాయం వస్తే.. 2020–21లో ఇప్పటికే రూ.4,53,812 కోట్ల ఆదాయం రావడమే అందుకు నిదర్శనం.

2019–20లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎక్సైజ్‌ సుంకం కింద రూ.47,500 కోట్లు వస్తే.. సెస్సుల రూపంలో రూ.3,15,700 కోట్లు వచ్చింది. ఎక్సైజ్‌ సుంకంలోనే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తుంది. సెస్సుల ఆదాయం ఒక్క పైసా కూడా ఇవ్వదు. అంటే రూ.19,475 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. సెస్సుల రూపంలో ప్రజల నుంచి దోచిన రూ.లక్షలాది కోట్లను కేంద్రం ఏం చేస్తోందో చెప్పాలి. సెస్సులు తగ్గిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ని రూ. 60–70 కి ఇవ్వొచ్చు. సామాన్యలపై భారం తగ్గించవచ్చు’ అని వివరించారు. మరో వైపు కేంద్రం 2013–14 నాటికి రూ.53,11,081 కోట్ల అప్పులు చేస్తే.. ఆ రుణం ప్రస్తుతం రూ.1,16,21,780 కోట్లకు చేరుకుందని.. అంటే ఏడేళ్లలో కేంద్రం రూ.63,10,699 కోట్ల అప్పు చేసిందని, అప్పుగా తెచ్చిన నిధులను కేంద్రం ఏం చేసిందో వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలను నిలదీశారు. 
చదవండి: శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్‌ 
ఉచిత విద్యుత్‌ను రైతులకు హక్కుగా కల్పించడం కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 25 ఏళ్లపాటు యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తున్నామని సజ్జల స్పష్టంచేశారు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నుంచి పీపీఏలు చేసుకుని చంద్రబాబు వేలాది కోట్ల రూపాయలు కమీషన్లుగా వసూలు చేసుకున్నారని ఆరోపించారు. ‘బాబు చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుదుత్పత్తి చేసినా, చేయకున్నా వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌ పద్ధతిలో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.7, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.5 చొప్పున కొనేలా పీపీఏలు కుదుర్చుకుని.. కమీషన్లు వసూలు చేసుకున్నారు.

చంద్రబాబు కమీషన్ల వల్లే డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటివల్ల ప్రజలపై తీవ్ర భారం పడింది’ అని చెప్పారు. ‘చంద్రబాబు పాలనలో చీకటిమయంగా మారిన రాష్ట్రాన్ని వెలుతురులోకి తేవడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే సెకీ నుంచి యూనిట్‌ను రూ.2.49కే కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. సరఫరా నష్టాలు, ఇతర పన్నులతో కలిపి ఈ రేటుకు ఇవ్వడానికి సెకీ ముందుకొచ్చింది. అదే సంస్థ నుంచి తమిళనాడు సర్కారు యూనిట్‌ను రూ.2.61కు కొంటోంది. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదు. ఏవైనా తప్పులు జరిగితే.. ఆధారాలతో సహా చూపడం ద్వారా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు. అవాస్తవాలతో సర్కారుపై బురద జల్లడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఛీకొడతారు’ అని సజ్జల చెప్పారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)